టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్ఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగల మధ్య ఎస్సీ వర్గీకరణ విషయమై జరుగుతున్న మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది…ఇటీవల ఎస్సీ వర్గీకరణకు మద్దతివ్వాలని కోరుతూ..కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రేకు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించిన మంద కృష్ణ ఈ సందర్భంగా గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ కాంగ్రెస్ పార్టీని ఏకిపారేసారు. ఎస్సీ …
Read More »పొంగులేటికి భారీ షాక్ ఇచ్చిన ఇద్దరు ముఖ్య అనుచరులు…త్వరలో బీఆర్ఎస్ లో చేరిక…!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో విబేధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈమధ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పొంగులేటి చేరికతో ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ లో కలహాల కుంపట్లు ముదిరిపోయాయి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఏకమై పార్టీలో మోస్ట్ సీనియర్ అయిన …
Read More »కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోభారీ చేరికలు…
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 23వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుండి బలబత్తుల రమేష్,బండారి రమేష్,ఎండి వలీల్ మొహమ్మద్,మంద అనిల్, తీగల చంటి,తీగల రమేష్,మంగళ చంద్రమౌళి, జన్ను వినయ్,పురుషోత్తం చారి తదితరులు నేడు శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా 23వ డివిజన్ మాజి కార్పొరేటర్ …
Read More »జలీల్ ఖాన్ ను మించిపోయిన చంద్రబాబు కామెడీ… పిచ్చి పీక్స్ కు పోయిందా బ్రో..!
ఏపీలో అటు సొంత పుత్రుడు నారాలోకేష్ పాదయాత్ర పేరుతో ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా…ఇటు దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పేరుతో ఎన్ని వీరంగాలు వేసినా…మరోవైపు పచ్చ మీడియా ఎన్ని జాకీలు వేసినా..టీడీపీ పరిస్థితి రెండు అడుగులు ముందుకు…నాలుగు అడుగులు వెనక్కి అన్న చందాన మారిపోయింది. దత్తపుత్రుడిని ఎంత రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లించినా జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేయకపోతుండడంతో పాపం బాబోరికి ఏం చేయాలో అర్థం …
Read More »ఈనెల 20న సూర్యాపేటలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో సూర్యాపేటలో బీఆర్ఎస్ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈనెల 20న ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అదే రోజు జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు భవనాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Read More »సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా పర్యటన వాయిదా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అధికార బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల పంతోమ్మిది తారీఖున మెదక్ జిల్లాలో పర్యటించనున్న సంగతి తెల్సిందే. అయితే ఈ పర్యటన ఈ నెల ఇరవై మూడో తారీఖుకు వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పంతోమ్మిదో తారీఖున ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేయడంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »ఆసియాలోనే ప్రతిష్టాత్మక మార్కెట్ గా సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ : మంత్రి జగదీశ్రెడ్డి
ఆసియాలోనే ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ‘సూర్యాపేట టైమ్స్’తో చెప్పారు. ఆసియాలో ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరిగిందని, ఈనెల 20న సీఎం కేసీఆర్ చేతులమీదుగా సీఎం కేసీఆర్ దీనిని ప్రారంభిస్తారన్నారు. ఈ మార్కెట్ యార్డు నిర్మాణంలో ప్రతి దశను తాను స్వయంగా పరిశీలించినట్లు మంత్రి చెప్పారు. సూర్యాపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో 165 కమర్షియల్ షాపులతో పాటు …
Read More »కుత్బుల్లాపూర్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ కె ఎం గౌరీష్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సత్తి రెడ్డి, సదానందం, బాలయ్య, రాజు, వెంకటేష్, అజయ్, మధుకర్, రమణ, సిద్ధికి, విజయ్ హరీష్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
Read More »నందమూరి అభిమానులకు శుభవార్త
ఈ రోజు బుధవారం నందమూరి అభిమానులకు ఓ శుభవార్త తెలియనున్నది. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. తెలుగు సినిమా ప్రేక్షకులకు సందేశాత్మక చిత్రాలను అందించే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం దేవర.. పాన్ ఇండియా స్టార్ నందమూరి తారకరామారావు ఆలియాస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ ఈ రోజు మధ్యాహ్నాం రెండు గంటలకు రీలివ్ …
Read More »తగ్గేదేలే అంటున్న జైలర్ కలెక్షన్లు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ జైలర్. విడుదలైన మొదటి రోజు నుండే ఈ మూవీ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ చిత్రం నాలుగు వందల పదహారు కోట్ల పంతోమ్మిది లక్షల రూపాయలను కలెక్ట్ చేసిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సెలవులు పూర్తవ్వడంతో ఈ చిత్రానికి సంబంధించిన …
Read More »