Home / TELANGANA (page 283)

TELANGANA

తెలంగాణ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లు నియామకం

తెలంగాణ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు చైర్మన్లను సీఎం కేసీఆర్ నియమించారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితను నియమించగా, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్ మోహన్ రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్, తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా దూదిమెట్ల బాలరాజు యాదవ్‌లను నియమించారు. సీఎం …

Read More »

జీహెచ్‌ఎంసీ అప్రమత్తం-GHMC సర్కిళ్లలో ఐసొలేషన్‌ కేంద్రాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో ఒమిక్రాన్‌ పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. థర్డ్‌ వేవ్‌ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఇప్పటి నుంచే ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇప్పటికే కాలనీల వారీగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపడుతూ మొదటి డోసు, రెండో డోసు వ్యాక్సిన్‌ ప్రక్రియను ముమ్మరం చేసింది. అంతేకాకుండా 2173 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో రసాయనాలు స్ప్రే చేశారు. పాజిటివ్‌ నమోదవుతున్న ప్రాంతాలు, …

Read More »

హైదరాబాద్‌ నగరంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను ప్రారంభించిన మంత్రి KTR

తెలంగాణ రాష్ట్ర రాజధాని  మహానగరం హైదరాబాద్‌ నగరంలో మరో 248 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయి. సనత్‌ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట డివిజన్‌ చాచా నెహ్రూ నగర్‌లో నిర్మించిన 248 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. చాచా నెహ్రూనగర్‌లోని 3.35 ఎకరాల్లో రూ.19.20 కోట్ల వ్యయంతో 264 ఇండ్లను నిర్మించారు. మౌలిక వసతులతో పాటు 50, 20 …

Read More »

తెలంగాణ హరిత నిధి (గ్రీన్‌ ఫండ్‌) ఏర్పాటు

తెలంగాణ హరిత నిధి (గ్రీన్‌ ఫండ్‌) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో పచ్చదనం పెంచడం కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు హరితనిధిని ఏర్పాటు చేశారు. శాసనసభలో అక్టోబర్‌ ఒకటిన సీఎం కేసీఆర్‌ హరితనిధి ఏర్పాటుపై ప్రకటన చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర వర్గాల నుంచి విరాళాలు సేకరించి ‘హరిత నిధి’కి నిధులు సమకూరుస్తామని చెప్పారు. ఈ మేరకు దీనిపై ఉత్తర్వులు …

Read More »

నేడు టీఆర్‌ఎస్‌ కీలక భేటీ -పార్టీ ప్రజాప్రతినిధులతో గులాబీ దళపతి కేసీఆర్‌ సమావేశం

తెలంగాణ రాష్ట్ర సమితి కీలక సమావేశం శుక్రవారం తెలంగాణభవన్‌లో జరుగనుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మధ్యాహ్నం రెండు గంటలకు జరుగనున్న ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్‌, రైతుబంధు సమితి జిల్లా కమిటీ అధ్యక్షులు, కార్పొరేషన్‌ చైర్మన్లతోపాటు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా …

Read More »

రాష్ట్ర నిధులతోనే కాళేశ్వరం..

ప్రతిష్ఠాత్మక బహుళదశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తన సొంత వనరులతోనే నిర్మిస్తున్నదని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ లోక్‌సభలో వెల్లడించారు.నిర్మాణ పనులకు ఆన్‌లైన్‌ టెండర్‌ విధానాన్ని అనుసరించిందని చెప్పారు. గురువారం కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. కాళేశ్వరానికి అనుమతులున్నాయా? ఎంత ఖర్చు చేశారు? ప్రాజె క్టు ద్వారా కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై అడిగిన ప్రశ్నకు షెకావత్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జల్‌శక్తి శాఖలోని సాగునీరు, …

Read More »

TPCC  చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం

దేశంలో ఉన్న బీసీ కులాల జన గణన సాధ్యం కాదని కేంద్రప్రభుత్వం ప్రకటించడంపై TPCC  చీఫ్, MP రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘దేశ జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీ కులాల జన గణన చేయడానికి కేంద్రంలోని మోదీ సర్కారు తిరస్కరించడం అంటే ఆ వర్గాలకు తీవ్ర అన్యాయం చేయడమే. బీసీలపై బీజేపీ ప్రేమ కొంగజపం-దొంగజపం అని దీన్ని బట్టి అర్థమవుతోంది. బీసీల మనోభావాలను గౌరవించని …

Read More »

విదేశాల నుండి తెలంగాణకు వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్

తెలంగాణ‌లోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌వేశించింది. ఇద్ద‌రు విదేశీయులు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించ‌బ‌డిన‌ట్లు తెలంగాణ వైద్యారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు మీడియాకు వెల్ల‌డించారు. ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించ‌బ‌డ్డారు అని తెలిపారు. కెన్యా జాతీయురాలి వ‌య‌సు 24 ఏండ్లు కాగా, సోమాలియా దేశ‌స్థుడి వ‌య‌సు 23 ఏండ్లు అని పేర్కొన్నారు. 12వ తేదీనే వీరిద్ద‌రి శాంపిల్స్ సేక‌రించి …

Read More »

తెలంగాణలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధం

తెలంగాణలో థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఆయన.. 21 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితుల పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజలు మాస్కులు ధరించాలని, రెండు డోసుల వాక్సిన్ తీసుకోవాలని మంత్రి హరీష్ సూచించారు.

Read More »

సీఎం కేసీఆర్ తో సీఎం స్టాలిన్ భేటీ

తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తో అద్భుతమైన సమయాన్ని గడిపినట్లు  ఆరాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. సీఎం కేసీఆర్ తనను మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పారు. కాగా ఈ భేటీలో నదీజలాల వివాదాలు, ధాన్యం కొనుగోళ్లు, కేంద్రంలో ఉన్న బీజేపీ వైఖరి.. తదితర అంశాలపై కేసీఆర్, స్టాలిన్ చర్చించినట్లు తెలిసింది. అటు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్తో సీఎం కేసీఆర్ ఇవాళ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat