తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో సోమవారం చేనేత బతుకమ్మ-దసరా సంబురాలను ఘనంగా నిర్వహించారు. యూకే నలుమూలల నుంచి సుమారు 600లకుపైగా ప్రవాస కుటుంబాలు ఈ వేడుకలకు హాజరయ్యాయి. భారత సంతతికి చెందిన బ్రిటిష్ ఎంపీలు వీరేంద్రశర్మ, సిమా మల్హోత్రా, స్థానిక హాన్స్లో మేయర్ బిష్ణు గురుగ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో చేనేతకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఏడాదిలాగే చేనేత దుస్తులు ధరించి బతుకమ్మ- …
Read More »అడ్డంగా దొరికిపోయిన ఈటల
అడ్డగోలు అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా దొరికిపోవడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. బీజేపీ నేతల్లో ఈటల రాజేందర్ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వెలగబెట్టిన ప్రబుద్ధ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. గ్యాస్బండపై రూ.291 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా వస్తున్నదంటూ నోటికొచ్చిన అబద్ధమాడుతున్నారు. ప్రచారం ఒక్కో గ్యాస్బండపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.291 పన్నువాటాగా వస్తున్నదని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ …
Read More »ఆపదలో ఉన్న వారికి అడగ్గానే అండగా మంత్రి KTR
ఆపదలో ఉన్న వారికి అడగ్గానే అండగా నిలుస్తున్నారు మున్సిపల్, ఐటీశాఖా మంత్రి కేటీఆర్. సామాజిక మాధ్యమాల్లో ఆయనకు వస్తున్న విజ్ఞప్తులకు వెంటనే స్పందిస్తూ భరోసా ఇస్తున్నారు. వేడి పాలు ఒంటిపై పడి కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న చిన్నారితోపాటు బోన్క్యాన్సర్తో బాధపడుతు న్న బాలుడి వైద్యానికి సాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన గుండెబోయిన అశోక్, లక్ష్మి దంపతులకు కొడుకు కార్తీక్(11 నెలలు) …
Read More »రాష్ట్రంలో రెండు వందల ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు
దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రమే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు వందల ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి.. తెలంగాణలో విద్యుత్ కోతలకు ఆస్కారమే లేదని మంత్రి తేల్చిచెప్పారు. ఒక్క నిమిషం కూడా రాష్ట్రంలో పవర్ కట్ ఉండదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను హైదరాబాద్కు …
Read More »సీఎం కేసీఆర్ గొప్ప మనసు-మంత్రి NIranjan Reddy చొరవతో చిన్నారికి సాయం
వనపర్తి నియోజకవర్గం రేవల్లికి చెందిన ఓ విద్యార్థిని అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (PNH) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ యువతికి చికిత్స చేసేందుకు రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్తో యువతి ప్రాణాలు నిలిపే అవకాశం ఉంది. బాధితురాలికి ఎంబీబీఎస్లో సీటు వచ్చినా కూడా.. ఈ వ్యాధి కారణంగా చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ …
Read More »మా ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ ట్వీట్
‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎందురుచూశారు. ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికీ అభినందనలు’’ అంటూ తెలంగాణ రాష్ట్ర భాజాపా అధ్యక్షుడు జండి సంజయ్ ట్వీట్ చేశారు. ‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన విష్ణు సహా ఇరు ప్యానళ్ల విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన ‘మా’ ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే …
Read More »Huzurabad లో BJPకి ఎదురీత..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులపట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రజాగ్రహం పెల్లుబికుతున్నది. హుజూరాబాద్ ఉపఎన్నిక సందర్భంగా ఓటు అడిగేందుకు బీజేపీ నాయకులు తమ ఇంటికి రావొద్దని ప్రజలు ఖరాఖండిగా చెబుతున్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణవాసులు తమ ఇంటి ముందు ‘ఓటు కోసం బీజేపీ నాయకులు రావొద్దు.. మా ఓట్లు టీఆర్ఎస్కే’ అని ఉన్న బోర్డులను ఏర్పాటుచేసుకొన్నారు. 27వ వార్డులో ప్రతీ ఇంటి ఎదుట గేట్లకు ఏర్పాటుచేసిన బోర్డులు బీజేపీపై వ్యతిరేకతకు పరాకాష్ఠగా …
Read More »ఈటలపై ఎమ్మెల్యే సుమన్ ఫైర్
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. తనపై భూకబ్జా ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే తప్పులు బయటపడుతాయనే రాజీనామా చేసి ఉప ఎన్నిక తెచ్చారు. విభజన హామీలను తుంగలో తొక్కి బీజేపీ తెలంగాణను మోసం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్ పథకాలతో పేద, మధ్య తరగతి ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి …
Read More »గెల్లుకు జైకొడుతున్న హుజురాబాద్ ప్రజలు
హుజూరాబాద్ ఉప ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీఆర్ఎస్కు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది. సకల జనం టీఆర్ఎస్కు జై కొడుతున్నది. ఆదివారం హుజూరాబాద్లో మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన 60 మంది పాన్షాప్ యజమానులు.. గెల్లు గెలుపుకోసం కృషిచేస్తామని తెలిపారు. బీజేపీకి చెందిన 30 మంది యువకులు జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన యువకులు పరకాల …
Read More »త్వరలో కాజల్ అగర్వాల్ సర్ప్రైజింగ్ అప్డేట్
స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో సర్ప్రైజింగ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. ఆమె గురువారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ముఖ్యమైన అనౌన్స్మెంట్ త్వరలో వస్తుంది.. వేచి ఉండండి’ అని పేర్కొన్నారు. దాంతో ఈ అనౌన్స్మెంట్ దేని గురించోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, గత ఏడాది ప్రియుడు గౌతమ్ కిచ్లును 2020 అక్టోబర్ 30న వివాహం చేసుకున్నారు. …
Read More »