ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా బారినపడిన ఎస్వీ ప్రసాద్.. నగరంలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఉమ్మడి ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కుటుంబం ఇటీవల కరోనా బారిన పడింది. ఆయనతోపాటు కుంటుంబ సభ్యులు యశోద …
Read More »తెలంగాణలో కొత్తగా 2,524 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో రాష్ర్టంలో 2,524 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18 మంది మరణించారు. 3,464 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ర్టంలో ప్రస్తుతం 34,084 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 24 గంటల్లో 87,110 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 307 పాజిటివ్ కేసులు, నల్లగొండ జిల్లాలో 183, రంగారెడ్డి జిల్లాలో …
Read More »మంత్రి కేటీఆర్ పై సోనుసూద్ ప్రశంసలు
తెలంగాణ రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను ట్విట్టర్ వేదికగా బాలీవుడ్ నటుడు సోనూసూద్ ప్రశంసించారు. కేటీఆరే నిజమైన హీరో అంటూ కొనియాడారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని సోనూసూద్ పేర్కొన్నారు. అయితే నంద కిశోర్ తోకల అనే ఓ నెటిజన్ కేటీఆర్కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. తాము సంప్రదించిన 10 గంటలలోపే తమకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ సమకూర్చారని, ఆ మేలు ఎప్పటికీ మరిచిపోలేమని అతను పేర్కొన్నాడు. …
Read More »పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ కవిత
పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ తరహాలో జగిత్యాలలో నాలుగు వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు. జిల్లాలోని నూకపెల్లిలో నిర్మిస్తున్న 4520 డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్తో కలిసి కవిత పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన ఇండ్లు, టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిస్తున్న ఇండ్ల తేడాను ప్రజలు …
Read More »తెలంగాణలో కొత్తగా 1,801 పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 1,801 పాజిటివ్ కేసులు, 16 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,75,827కి చేరింది. కరోనా నుంచి 5,32,557 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 35,042 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో ఇప్పటి వరకు 3,263 మంది మృతి చెందారు.
Read More »విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్
ప్రస్తుతం వ్యాక్సిన్ కొరత వల్ల రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన సాధారణ యువతకు వ్యాక్సిన్ వేయట్లేదు. అయితే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మాత్రం వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇస్తామని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విదేశాలకు వెళ్లే వారికి టీకాలు ఇస్తే.. కరోనా బారిన పడకుండా సురక్షితంగా ప్రయాణం చేస్తారని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Read More »తెలంగాణలో లాక్డౌన్ పొడిగింపు
కరోనా మహమ్మారి నివారణకు తెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతున్న విషయం విదితమే. నేటితో ముగియనున్న లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నది. జూన్ 9వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయించింది. నేటి వరకు రోజుకు 4 గంటలు మాత్రమే మినహాయింపు ఇవ్వగా, ఆ సమయాన్ని మరో మూడు గంటల పాటు పొడిగించారు. ఇక ప్రతీ …
Read More »నాటి పచ్చని ప్రగతి స్వప్నం నేటి నిజం
నిన్న మొన్ననే వచ్చింది కదా అన్నట్టుగా ఉన్న తెలంగాణ రాకడకు అప్పుడే ఏడేండ్లు. ఎక్కడ చూసినా నెర్రెలు- మట్టి నిండిన ఒర్రెలు, సాగు మొత్తం ఆగమయ్యిందే అని దిగాలు పడ్డ తెలంగాణ. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అయ్యిందంటే ఎంత అద్భుతం! అందుకు ఎన్ని ప్రణాళికలు కావాలి, ఎంత ఆచరణాత్మక కృషి జరగాలి? ‘మీకు వ్యవసాయం వస్తదా?’ అని ప్రశ్నించిన నోళ్లతోనే.. ‘మీకే వ్యవసాయం వస్తదని’ చెప్పించాలంటే ఎంత …
Read More »TSPSC సభ్యురాలు సుమిత్ర ఆనంద్ తానోబాను శాలువతో సత్కరించిన ఎమ్మెల్సీ కవిత
ఇటీవల నూతనంగా టిఎస్పీఎస్సి సభ్యురాలుగా ఎంపికైన కామారెడ్డి జిల్లా కు చెందిన సుమిత్ర ఆనంద్ తానోబాకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ,ఆదర్శవంత సేవలు అందించాలని సుమిత్ర ఆనంద్ తానోబాకు ఎమ్మెల్సీ కవితకు తెలిపారు కామారెడ్డి జిల్లా కు చెందిన సుమిత్ర ఆనంద్ కు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్సీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read More »తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా లాక్డౌన్ పొడిగింపుపై సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్డౌన్తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చ జరగనున్నట్లు సమాచారం. అయితే..రాష్ట్రంలో ఇప్పటికే లాక్డౌన్ కఠినంగా అమలువుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని …
Read More »