Home / TELANGANA (page 389)

TELANGANA

ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ సెటైర్లు

కొవిడ్ మందుల పేర్లు పలికేందుకు కష్టంగా ఉన్నాయని, వీటికి పేర్లు పెట్టడంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ హస్తం ఉందా అని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ నేత శశిథరూర్ స్పందించారు. వాటిని కొరోనిల్, కొరొజీరో, గోకరోనాగో అని పిలవడానికి అభ్యంతరం లేదని, భారీ ఇంగ్లీష్ పదాలతో ట్వీట్ చేశారు. ఆంగ్లంలో పాండిత్యం అధికంగా ఉన్న నేతగా శశిథరూర్కు పేరుంది. ఈ క్రమంలో …

Read More »

తెలంగాణలో తగ్గని కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3,464 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 25 మంది మరణించారు. ఫలితంగా కరోనా కేసుల సంఖ్య 5,47,727 కు పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా ధాటికి 3,085మంది మరణించారు. కొత్తగా 4,801 మంది కోలుకోగా, రికవరీల సంఖ్య 5,00,247కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 44,395 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విద్యార్థులు సాధించిన గ్రేడ్లను ప్రకటించారు. ఈ ఏడాది 2,10,647 మంది 10కి పది గ్రేడ్‌ పాయింట్లు సాధించారు. రెగ్యులర్‌ సహా గతంలో ఫెయిల్‌ అయిన విద్యార్థులు మొత్తం 5,21,073 మంది పాసయ్యారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవటంతో ఈ ఏడాది ఎస్సెస్సీ పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కే …

Read More »

సెల్యూట్ పోలీస్

కరోనా వైరస్‌ సృష్టిస్తున్న రెండో దశ విధ్వంసంలో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశంసించారు. అత్యంత విలువైన ఔషధాలు, ఆక్సిజన్‌ సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని కితాబిచ్చారు. బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడుతున్న వారిపై 128 కేసులు నమోదుచేసి 258 మందిని అరెస్ట్‌చేయడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. కరోనా ఔషధాల బ్లాక్‌మార్కెటింగ్‌పై ఎవరికైనా సమాచారముంటే 100 ఫోన్‌ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని, @telanganadgpకి ట్వీట్‌ …

Read More »

తెలంగాణలో లాక్డౌన్ పై ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రతను తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 11న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం 12 నుంచి 10 రోజులపాటు లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. …

Read More »

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

దేశ వ్యాప్తంగా కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్ పై  ఇప్పటికే అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగసు నోటిఫియాబుల్ వ్యాధిగా ప్రకటించింది. దీనికి సంబంధించి కేసులు ఎక్కడ నమోదైనా తమకు సమాచారం అందించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని, ప్రతి రోజూ ఆయా ఆస్పత్రుల్లో నమోదైన బ్లాక్ ఫంగస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారి వివరాలు అందించాలని తెలిపింది.

Read More »

క‌రోనా రోగుల‌కు ధైర్యం.. డాక్ట‌ర్ల‌కు అభినంద‌న : సీఎం KCR

హైద‌రాబాద్  న‌గ‌రంలోని గాంధీ ఆస్ప‌త్రిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం సంద‌ర్శించారు. క‌రోనా రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు. క‌రోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల‌ను సీఎం ప‌రామ‌ర్శించి, ధైర్యంగా ఉండాల‌ని చెప్పారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ల‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. కొవిడ్ చికిత్స‌తో పాటు ఆక్సిజ‌న్‌, ఔష‌ధాల ల‌భ్య‌త‌ను ప‌రిశీలించి చ‌ర్చించ‌నున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ స్వయంగా …

Read More »

ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమ సామల

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని సీతాఫలమండి లో ఆశా వర్కర్లు గా పని చేస్తున్న వారికి కార్పొరేటర్ హేమ సామల గారి అధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్ గారు హాజరై ఆశా వర్కర్లు కి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమ …

Read More »

సోష‌ల్ ఇన్నోవేష‌న్ ఎకోసిస్ట‌మ్ ఏర్పాటుకు ఒప్పందం

హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో భాగమైన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (KSPP), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖల నిర్వహణలోని తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (TSIC)తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణ ప్రభుత్వ చీఫ్ ఇన్నోవేషన్ అధికారి రవి నారాయణ్, గీతం రిజిస్ట్రార్ ప్రొ.డి.గుణశేఖరన్, సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ శ్రీధర్ పబ్బిశెట్టి సంతకం చేసిన అవగాహన ఒప్పందం మేరకు …

Read More »

TSPSC కమిషన్ నియామకం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్., సభ్యులను బుధవారం, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం కెసిఆర్ ప్రతిపాదనల మేరకు గవర్నర్ ఆమోదించారు. చైర్మన్ గా .. డా. బి. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్) (వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్థుతం పనిచేస్తున్నారు ) … సభ్యులు గా.. రమావత్ ధన్ సింగ్ (బిటెక్ సివిల్, రిటైర్డ్ ఈఎన్సీ)., ప్రొ. బి. లింగారెడ్డి (ఎమ్మెస్సీ పిహెచ్డీ .,ప్రొ. హెడ్ డిపార్డ్మెంట్ ఆఫ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat