యాసంగి సీజన్ రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున రూ.7,300 కోట్ల నిధులు జమ చేయడానికి సిద్ధమైంది. ఈ యాసంగిలో దాదాపు 59.32 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని అందజేయనున్నారు. గతేడాది 57.62 లక్షల మంది పట్టాదారులకు రైతుబంధు సాయాన్ని పంపిణీ చేయగా.. ఈ సీజన్లో 1.70 లక్షల మంది …
Read More »జనవరి 13నుండి ఐనవోలు జాతర
ఉమ్మడి వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. ఈ జాతరకు అశేషంగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలతో ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు, అర్చకులను ఆదేశించారు. భక్తులకు అవసరమైన భద్రత, లావెట్రీలు, చలువ పందిళ్ళు, మంచినీటి వసతి, …
Read More »మానవాళికి మార్గదర్శకం భగవద్గీత : ఎమ్మెల్సీ కవిత
నిత్యం గీతా పఠనం చేయడం ద్వారా జీవితంలో సన్మార్గంలో పయనిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో జరిగిన ‘గీతాజయంతి మహోత్సవం’లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ముందుగా గో మాతను పూజించిన ఎమ్మెల్సీ కవిత, భారతీయ సంస్కృతిలో గో పూజకు ఎంతో విశిష్టత ఉందన్నారు. భగవద్గీతలోని ఎన్నో సూక్ష్మమైన, ఆధ్యాత్మికమైన అంశాలను వివరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలున్నా …
Read More »శ్రీవారిని దర్శించుకున్న మంత్రులు హరీష్, గంగుల కమలాకర్
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ రోజు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకొని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. శ్రీవారికి మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు వారికి ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపనేని నరేందర్, సుంకే రవిశంకర్, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మాజీ …
Read More »పెండ్లి పెద్దగా మారిన – రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్
తన్నీరు.. పేరులోనే ఉంది. ఆ కన్నీరును తుడిచే గుణం.! అలాంటి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ అన్నీ తానై అండగా నిలిచి భాగ్య బరువు దించారు.* చదివించారు. పెద్ద చేశారు. పెళ్లి చేశారు. అనాథయిన అభాగ్యురాలికి మంత్రి సూచన మేరకు జిల్లా కలెక్టర్ ఆపన్న హస్తం అందించారు. కష్ట కాలంలో ఉన్న బాలికకు విద్య బుద్ధులు అందించి బతుకు దెరువుకై ఉపాధినిచ్చారు. పెండ్లీడు వచ్చిన భాగ్య అభీష్టం మేరకు …
Read More »మహబూబాబాద్ లో 70 మందికి తీవ్ర అస్వస్థత
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా అయోధ్యలో కొత్తరకం కొవిడ్ కలకలం రేపుతోంది. 70 మంది అస్వస్థతకు గురవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు ఆసుపత్రి బాట పట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తీవ్ర అస్వస్థతగా ఉన్నవారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Read More »తెలంగాణలో తొలిదశలో 40,095 మందికి కరోనా వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలోకరోనా వ్యాక్సిన్ పంపిణీకి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలి విడతలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ సిబ్బందికి ఇస్తారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇప్పటికే 40,095 మంది ఉన్నట్లు గుర్తించారు. PHC స్థాయిలో వ్యాక్సిన్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మేడ్చల్ జిల్లాలో 146, రంగారెడ్డి జిల్లాలో 60 కేంద్రాలు గుర్తించి నిల్వకు ఏర్పాట్లు చేస్తున్నారు
Read More »తెలంగాణలో కొత్తగా 574 కరోనా కేసులు
తెలంగాణలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 574 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,83,556గా ఉంది. అటు నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 1,524కు చేరింది. నిన్న కరోనా నుంచి 384 మంది కోలుకున్నారు ఇప్పటివరకు 2,75,217 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జవగా ప్రస్తుతం 6,815 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »యాసల బాలయ్యమృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
అంతర్జాతీయ స్థాయిలో పేరుగడించిన బాతిక్ చిత్ర కళాకారుడు యాసల బాలయ్య(82) మృతి పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. బాలయ్య మరణం చిత్రకళారంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బాతిక్ చిత్ర కళ ద్వారా బాలయ్య పల్లె జీవన సౌందర్యాన్ని కళ్ళకు కట్టారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయలు, గ్రామీణ జానపద చిత్రాలను తన …
Read More »పశుసంవర్ధక శాఖ అధికారులతో మంత్రి తలసాని ఉన్నతస్థాయి సమీక్ష
జీవాలకు మరిన్ని మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ది, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా 1962 టోల్ ఫ్రీ తో సంచార పశువైద్య శాలల ద్వారా జీవాలకు అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు. ఈ …
Read More »