తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హయత్ నగర్ లో పెద్ద విషాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఇద్దరు యువతులు ఒకే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులకు భారం కాకూడదు. పెళ్లికి భారీగా లాంఛనాలు సమర్పించుకోవాల్సి వస్తుందని తమ సూసైడ్ నోట్ లో ఆ ఇద్దరు యువతులు పేర్కొన్నారు. మరో పది రోజుల్లోఆ ఇద్దరి యువతుల్లో …
Read More »మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కామారెడ్డి కలెక్టర్ భేటీ
కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఇటీవల నియామకమైన ఐఎఎస్ డా.శరత్ శనివారం మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు,భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి నూతన కలెక్టర్ శరత్ ను అభినందించారు.ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు,కొత్త స్కీమ్ లు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కృషి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలెక్టర్ కు …
Read More »జేబీఎస్ – ఎంజీబీఎస్ మెట్రో రైలును ప్రారంభించిన సీఎం కేసీఆర్..!
విశ్వనగరం కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. భాగ్యనగర వాసుల కల సంపూర్ణమైంది. ఇవాళ జూబ్లీ బస్స్టేషన్ నుంచి ఎంజీబీఎస్(కారిడార్-2) వరకు మెట్రోరైలు మార్గాన్ని జేబీఎస్ స్టేషన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు మెట్రో ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు. ఎంజీబీఎస్ ఇంటర్ ఛేంజ్ మెట్రోస్టేషన్లో మెట్రో ఉన్నతాధికారులు, ఉద్యోగులు సీఎం కేసీఆర్తో ఫొటోలు దిగారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కి.మీ మార్గంలో …
Read More »పుణె మహిళ మగశిశువుకు జన్మ.. కేసీఆర్ కిట్ అందజేత..
మహారాష్ట్రలోని పుణెకు చెందిన ఓ మహిళ మేడారంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జాతరకు మూడురోజుల క్రితం చవాన్ శివాని, గోవిందర్ కుటుంబం మేడారం చేరుకొన్నారు. గర్భిణి అయిన శివానితో కలిసి కుటుంబసభ్యులు గురువారం ఉదయం వనదేవతలను దర్శించుకొన్నారు. అంతలోనే నొప్పులురావడంతో శివానీని దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు శివానీకి సాధారణ ప్రసవం చేశారు. ఉదయం 11.48 గంటలకు శివానీ మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువు మూడున్నర కిలోల బరువుతో ఆరోగ్యంగా జన్మించాడు. …
Read More »వనదేవతలను దర్శించుకున్న సీఎం కేసీఆర్
మేడారం సమ్మక్క, సారలమ్మలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దర్శించుకున్నారు. వనదేవతల దర్శనానికి సీఎం ప్రత్యేక హెలికాఫ్టర్లో మేడారానికి చేరుకున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క, సారలమ్మలను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం సారలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పగిడిద్ద రాజులను సీఎం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవార్లకు తెలంగాణ రాష్ట్రం తరపున సీఎం చీర, సారాను సమర్పించారు. …
Read More »సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన రద్దు.ఎందుకంటే..?
ఏపీ సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు శుక్రవారం హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు అక్రమాస్తుల కేసులో హాజరుకావాల్సి ఉన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు శుక్రవారం హైదరాబాద్ పర్యటన రద్దు అయింది. రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో జరిగే దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమం ఉండటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా సీబీఐ,ఈడీ కోర్టులకు చెందిన న్యాయమూర్తులు సెలవులో …
Read More »మేడారం జాతర జనసంద్రం
తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద వనజాతర మేడారం జాతర ఎంతో ఘనంగా ప్రారంభమైంది. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు మొక్కులు చెల్లించేందుకు మేడారానికి భక్తులు,ఆశేష జనసందోహాం తరలి వస్తున్నారు. వీకెండ్ కావడంతో ఈరోజు రేపు భారీగా భక్తులు తరలివస్తారని భావించిన అధికారులు దానికితగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్,గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ఈ రోజు అమ్మవార్లను దర్శించుకోనున్నారు.రేపు శనివారం …
Read More »తెలంగాణ పోలీస్ కింగ్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసు విభాగానికి మరో ఘనత దక్కింది. పోలీసింగ్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. దేశంలోని పోలీస్ సీసీ కెమెరాల్లో సగానికి (2.75లక్షలు)పైగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో మౌలిక సదుపాయాలు ,సిబ్బందికి సదుపాయలు కల్పనలో కూడా తెలంగాణ ముందంజలో ఉన్నట్లు డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ నివేదికలో పేర్కొంది. అలాగే అత్యధిక పోలీస్ క్వార్టర్స్ ఉన్న రాష్ట్రంగా కూడా తెలంగాణ నిలిచింది. పోలీసులకు …
Read More »ప్రధాని మోదీకి వార్నింగ్
ప్రధానమంత్రి నరేందర్ మోదీ గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ” తలుపులు వేసి తెలంగాణను బలవంతంగా ఇచ్చారు. ఏపీ,తెలంగాణ ప్రజలతో మాట్లాడాల్సింది. ఎవర్ని సంప్రదించకుండా ఏపీ నుండి తెలంగాణను వేరు చేసింది అని కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రధాని స్థానంలో ఉన్న నరేందర్ మోదీ తెలంగాణ పోరటాన్ని.. ఎంతో మంది విద్యార్థుల ఆత్మబలిదానాలను కించపరిచేలా మాట్లాడారని తెలంగాణ వాదుల నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. మరోవైపు టీఆర్ఎస్ కు చెందిన నేతలు,మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎంపీలు …
Read More »వనదేవతలను దర్శించుకున్న గవర్నర్లు
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో గద్దెల వద్ద రద్దీ భారీగా పెరిగింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ వనదేవతలను దర్శించుకున్నారు. వారికి అధికారులు ఘనస్వాగతం పలికారు. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. గురువారం రాత్రి సమ్మక్క గద్దెపైకి చేరుకున్న తర్వాత భక్తుల రద్దీ మరింత పెరిగింది. …
Read More »