నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అమెరికా వెళ్లడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేష్ తప్పుపడుతున్నారు. సొంత పనులలో జగన్ బిజీ గా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.దేశం అంతటా వరదలతో కష్టాలు,నష్టాలు వస్తే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేగంగా స్పందించారని, బాధితులను ఆదుకున్నారని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం అక్కరకు రాని చుట్టంలా అమెరికాలో సొంత పనుల్లో యమ …
Read More »Blog Layout
కోడెలని పట్టించుకోని టీడీపీ నాయకులు..అరెస్ట్ అవ్వాల్సిందే అంటూ ఎద్దేవా
స్పీకర్గా ఉన్నప్పుడు సర్కారు సొమ్ముకు కాపలాదారుగా ఉండాల్సింది పోయి అందినకాడికి సామగ్రిని ఇంటికి తరలించేయడం వెలుగు చూడటంతో ఔరా.. కోడెలా.. మజాకా.. అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా అసెంబ్లీలో భద్రత లేనందుకే ఇంటికి తెచ్చుకున్నానని దబాయించడం చూసి విస్తుపోతున్నారు. ‘కే ట్యాక్స్’ పేరుతో ఐదేళ్లపాటు సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల ప్రజల్ని పీడించిన ఈయన గారి కుటుంబ గాథలు రోజుకొకటి వెలుగు చూసిన తరుణంలో తాజాగా టీడీపీ నేతలు అంటున్న …
Read More »పరీక్ష రాసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని ఆర్మూర్ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్రెడ్డి వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీలో ఎల్ఎల్ఎం చివరి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్ష రాశారు. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్ఎల్ఎం కోర్సులో చేరి దూర విద్యను అభ్యసిస్తున్నారు. ఎల్ఎల్ఎం దూర విద్యను అభ్యసిస్తున్న జీవన్రెడ్డి ఇవాళ ఉదయమే వరంగల్ పట్టణానికి చేరుకున్నారు. కళాశాలలో జరిగిన గ్రూప్ డిస్కషన్లో పాల్గొని పరీక్షకు హాజరయ్యారు. ఇప్పటి వరకు రాసిన అన్ని సెమిస్టర్లలో ఎమ్మెల్యే …
Read More »జూబ్లీహిల్స్ చెక్పోస్ట్-హైటెక్సిటీ ప్రయాణికులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రోరైల్ ద్వారా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్-హైటెక్సిటీ మార్గంలో ప్రయాణించేవారికి శుభవార్త. ప్రయాణికుల కోసం తగిన సౌకర్యాలను అందిస్తున్న మెట్రో ఇప్పుడు చెక్పోస్ట్-హైటెక్సిటీ మధ్య ప్రతి 4 నిమిషాలకు మెట్రోరైలును అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రయాణికులు ఎక్కువసేపు వేచిచూడాల్సిన అగత్యం తప్పింది. ఇప్పటివరకు ఆ మార్గంలో ట్విన్ సింగిల్లైన్ మెథడ్ కారణంగా ప్రతి 15 నిమిషాలకు ఓ రైలు అందుబాటులో ఉండేది. మంగళవారం నుంచి …
Read More »అగ్రనటులందరితో స్టెప్పులేసిన అలనాటి అందాల నటికి 56వ పుట్టినరోజు శుభాకాంక్షలు
బంతి.. చామంతి ముద్దాడుకున్నాయిలే… యురేకా కసామిసా.. సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది.. ఇలాంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ విన్నపుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులేసిన అప్పటి నటి రాధిక గురించి ఈ తరంవారికి కూడా కచ్చితంగా తెలిసే ఉంటుంది.. అంతటి అద్భుతమైన చిత్రాల్లో నటించింది ఆమె. అప్పటి అగ్రనటులందరితో నటించడమే కాకుండా ప్రముఖ సీరియళ్లలోనూ కనిపించి బుల్లితెర ప్రేక్షకులనూ అలరించింది. ఎటువంటి అసభ్యకర సన్నివేశాల్లోనూ తన కెరీర్ లో …
Read More »నవ్యాంధ్రలో నయా చరిత్ర-ఆల్ ది బెస్ట్ జగన్
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా డలాస్ లో చేసిన ఉపన్యాసం ఉత్తేజభరితంగా సాగింది.ఆయన తన లక్ష్యశుద్దిని, చిత్తశుద్దిని తద్వారా మరోసారి తెలియచేయడానికి ప్రయత్నించారు.. తనకు అమెరికాలోని తెలుగు సమాజం ఎన్నికల సమయంలో ఎలా ఉపయోగపడింది కూడా ఆయన గుర్తు చేసుకుని దన్యవాదాలు తెలిపారు. ఎపిని ఎలా అబివృద్ది చేయాలన్నదానిపై ఆయన తన కల అంటూ చేసిన వ్యాఖ్యలు సబికులను ఇన్ స్పైర్ చేశాయి. అమెరికాలో ప్రముఖ …
Read More »సిరిసిల్లలో నేడు కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారకరామారావు నేడు సిరిసిల్లలో పర్యటించనున్నారు. ఉదయం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.ఈ పర్యటనలో బతుకమ్మ చీరలు, మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధి, వర్క్టూ ఓనర్ పథకం, అపెరల్ పార్కు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించనున్నా రు. సమావేశంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, చేనేత జౌళీశాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్, టెస్కో జనరల్ మేనేజర్ యాదగిరి, ఇతర అధికారులు …
Read More »ఎల్లో మీడియా చూపించని జగన్ అతికొద్ది రోజుల ప్రజారంజక పాలనలోని ముఖ్యాంశాలివే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ సీఎం అయ్యి ఇప్పటివరకూ పట్టుమని మూడు నెలలు కూడా గడవలేదు.. అయినా అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం వేగంగా ముందడుగు వేసారు. ఫించన్లు, చట్ట సవరణలు, నిధుల మంజూరు విషయాల్లో జగన్ వేగవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు టీడీపీ ఇంకా పాలన కుదుట పడకుండానే, సీఎం అన్ని డిపార్ట్ …
Read More »జగన్ జ్యోతి ప్రజ్వలన చేయకపోవడానికి కారణమిదే.. తప్పని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం
తాజాగా డల్లాస్ లో జరిగిన సభలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయకపోవడంపై పెద్దఎత్తున ప్రత్యర్ధ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కచ్చితంగా ఈ వ్యవహారానికి మతం రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే హిందూధర్మం, సంప్రదాయం అంటే క్రైస్తవుడైన జగన్మోహనరెడ్డికి ఎంత చులకనభావమో చూడండి.. అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇన్నాళ్ళూ పూజలు చేసినట్లు, పుష్కరాల్లో మునిగినట్లు హిందువుల ఓట్లకోసం నటించి, దాటేదాకా ఓడ మల్లన్న-దాటేశాక బోడిమల్లన్న అనే రీతిలో …
Read More »‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చంద్రబాబు..?
ఈ సామెత అక్షరసత్యం. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు గాక మేయదు. తమ నాయకుడు ఒక తరహాలో మాట్లాడుతోంటే.. ఆ అనుచరుల మంద మొత్తం అదే తరహాలో మాట్లాడుతుందే తప్ప.. తమ స్వబుద్ధితో వ్యవహరించదు. సొంత ఆలోచన మేరకు మాట్లాడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతల తీరు అలా ఉంది అంటున్నారు వైసీపీ నేతలు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అంటూ గతంలో …
Read More »