Blog Layout

ఫ‌లిస్తున్న మంత్రి కేటీఆర్ ప్ర‌య‌త్నం..!

త‌మ ఆకాంక్షాలను చిదిమేసుకోకుండా…విద్యార్థుల్లోని ఔత్సాహిక వ్యాపారవేత్తల నైపుణ్యానికి మెరుగులు దిద్ది వారిని తమ ఆలోచనలు ఆవిష్కరించేలా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ చేసిన ప్రయత్నం ఫలిస్తున్నది. విద్యార్థుల్లోని నైపుణ్యానికి మెరుగులు దిద్దేందుకు వారిని నైపుణ్యవంతులు చేసేందుకు ఉద్దేశించి టాస్క్‌ ద్వారా ఇంతటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో అడ్మిషన్లు దక్కడమే కాదు…వారి ఆలోచనలు ఆవిష్కరణలు రూపంలో కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు తమ ఆలోచనలకు ఆవిష్కరణ రూపం ఇచ్చేందుకు …

Read More »

కొలువుల కొట్లాట సభకు భారీగా తరలిరావాలి.. రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అచ్చంపేటలో కాంగ్రెస్‌ ప్రజాగర్జన బహిరంగ సభను ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి  జైపాల్‌రెడ్డి, రేవంత్ రెడ్డి, డికే అరుణ, సంపత్, వంశీచంద్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి  మాట్లాడుతూ…టీఆర్‌ఎస్‌ బీసీలను ఏనాడు పట్టించుకోలేదన్నారు. సభ విజయవంతం కాకుండా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని ఆయన మండిపడ్డారు.  జేఏసీ కొలువుల కొట్లాట సభకు భారీగా తరలిరావాలి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 26వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 26వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. కడప, కర్నూలు జిల్లాల్లో ముగించుకుని ప్రజాసంకల్పయాత్ర సోమవారం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది. గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి మండలం బసేనపళ్లిలో ఉదయం 8:30 గంటలకు అనంతపురం జిల్లాలో సోమవారం వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర మొదలవుతుంది. బసేనపళ్లిలో పార్టీ జెండాను వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. అనంతరం 10 గంటలకు గుత్తి ఆర్ఎస్‌కు …

Read More »

54శాత‌మున్న బీసీల అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యం..మంత్రి రామ‌న్న‌

రాష్ట్ర జ‌నాభాలో 54శాతం ఉన్న బీసీల అభ్యున్నతి సీఎం కేసీఆర్‌తోనే సాధ్య‌మ‌ని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామ‌న్న స్ప‌ష్టం చేశారు. బీసీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌మావేశం అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు. జ‌నాభాలో కీల‌కంగా ఉన్న బీసీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని వెల్ల‌డించారు. బీసీల సంక్షేమం కోసం నివేదికను అమలు చేయటానికి సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీ‌నివాస్ గౌడ్ …

Read More »

బీసీల సంక్షేమంలో అన్నిరాష్ర్టాల‌కు ఆద‌ర్శంగా తెలంగాణ..మంత్రి ఈట‌ల‌

బీసీల సంక్షేమం విష‌యంలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని  రాష్ట్ర ఆర్థిక, పౌర‌స‌ర‌ఫ‌రాల‌ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బీసీ ప్ర‌జాప్రతినిధుల‌తో స‌మావేశం అయిన అనంత‌రం మంత్రి ఈట‌ల మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశం శుభ పరిణామమ‌ని అన్నారు. వృత్తులను మూడు రకాలుగా విభజించమని సీఎం కేసీఆర్ అన్నార‌ని మంత్రి ఈట‌ల తెలిపారు. వృత్తి ద్వారా సంపద సృష్టించే వారిని గుర్తించి 5 వేల కోట్లు కేటాయించమన్నారని వివ‌రించారు. …

Read More »

బీసీ ఎమ్మెల్యేల‌తో సీఎం కేసీఆర్ భేటీ..మెచ్చుకున్న విప‌క్ష నేత‌లు

జ‌నాభాలో 54 శాతం ఉన్న బీసీల సంక్షేమం కోసం పాటుప‌డుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వేసిన ముంద‌డుగు ఇటు అధికార, అటు విప‌క్ష ఎమ్మెల్యేల‌ను ఆక‌ట్టుకుంది. బీసీ ప్ర‌జాప్ర‌తినిధుల‌తో సీఎం కేసీఆర్ స‌మావేశం అనంత‌రం అధికార పార్టీ నేత‌ల‌తో పాటుగా విప‌క్ష నేత‌లు సైతం ప్ర‌శంసించారు. బీజేపీ డా.లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ స‌మావేశం జ‌ర‌గ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. తెలంగాణ లో 54శాతం బీసీ జనాభా ఉంద‌ని ఈ స‌మావేశంలో విద్య, ఉద్యోగాలు, …

Read More »

మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రేపు మొద‌టి మెడిక‌ల్ కాలేజీకి శంకుస్థాప‌న

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్రంలో మొద‌టి వైద్య క‌ళాశాల మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మెడిక‌ల్ కాలేజీకి శంకుస్థాప‌న‌కు ముహూర్తం కుదిరింది. రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రేపు  శంకుస్థాప‌న జ‌ర‌గ‌నుంది. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ల‌క్ష్మారెడ్డి చొర‌వ‌తో ఈ క‌ళాశాల మంజూర‌యింది.  నిజానికి రెండేళ్ళ కింద‌టే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ వైద్య‌క‌ళాశాల ప్రారంభ‌మైంది. 2016-17 విద్యా సంవ‌త్స‌రం నుంచే అడ్మిష‌న్లు ప్రారంభ‌మ‌య్యాయి. తాజాగా 2017-18 …

Read More »

లభ్యమైన మురళి సూసైడే నోట్..

ఉస్మానియా వర్సిటీలోని మానేర్ హాస్టల్‌ బాత్రూమ్‌లో పీజీ విద్యార్థి మురళీ ఉరేసుకుని బలవన్మరణం చెందిన విషయం తెలిసిందే..ఆత్మహత్య చేసుకున్న మురళీ ఎంఎస్సీ ఫిజిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావటం లేదని మనస్తాపానికి లోనై మురళీ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. మురళి ఆత్మహత్యకు పాల్పడిన ప్రాంతం వద్ద పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది.. “అమ్మా నన్ను క్షమించు.. ఈ చదువులు భరించలేకపోతున్నా.. ఇంకా తట్టుకోవడం నావల్ల …

Read More »

ఓయూలో విద్యార్థి ఆత్మహత్య..ఉద్రిక్తత

ఉస్మానియా విశ్వ విద్యాలయం మానేరు హాస్టల్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎమ్మెస్సీ ఫిజిక్స్ తొలి సంవత్సరం చదువుతున్న మురళి అనే విద్యార్థి మానేరు హాస్టల్లోని 159వ నంబరు గది బాత్రూరంలో ఉరి వేసుకుని చనిపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఓయూ హాస్టల్‌కు చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతుడి స్వస్థలం సిద్దిపేట్ జిల్లా అని తెలుస్తోంది. మురళీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించే యత్నం చేయగా పోలీసులను విద్యార్థులు …

Read More »

ఖమ్మంలో కంచె ఐలయ్య అరెస్ట్..

“సామాజిక స్మగ్లర్ల కోమటోళ్లు” పుస్తక రచయిత ప్రొఫెసర్ కంచె ఐలయ్య షెపర్డ్ సభలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఏపీతోపాటు తెలంగాణలోనూ ఆయన సభలపై పోలీసులు, వైశ్యలు, బ్రాహ్మణుల సంఘాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇవాళ ఖమ్మంలో గొర్రెల పెంపకందారుల మహాసభలో పాల్గొనడానికి వెళ్లిన ఐలయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.కంచె ఐల‌య్య అరెస్ట్ చేయ‌డంతో సీపీఎం కార్యాల‌యం వ‌ద్ద కాసేపు ఉద్రిక్త‌త ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఐల‌య్య అరెస్ట్ చేసినంత మాత్ర‌నా బ‌హిరంగ స‌భ ఆగ‌ద‌ని, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat