Blog Layout

కోమ‌టిరెడ్డి..నీకు వ‌చ్చిన ఓట్ల‌ను చూసి సీఎం కేసీఆర్‌పై స‌వాల్ విసురు..ఎంపీ గుత్తా

  నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రోజూ తన పిచ్చిమాటలు, అబద్ధాలతో నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడంలో గోబెల్స్‌ను మించిపోయాడని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు.  తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు తాను టీఆర్‌ఎస్ నుండి మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటూ కొట్టిపారేశారు. నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంపీగా హస్తం గుర్తుపై తనను రెండుసార్లు గెలిపించినట్టుగా …

Read More »

రేవంత్‌కు కాంగ్రెస్‌లో జ‌రిగిన తొలి అవ‌మానం ఇదే

తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో త‌న స‌త్తా చాటుకోవాల‌ని క‌ల‌లు క‌న్న కొడంగ‌ల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆదిలోనే షాక్‌ల ప‌రంప‌ర ఎదురువుతోంది. ఇప్ప‌టికే  కాంగ్రెస్‌పార్టీలో వ్యక్తిగత పాదయాత్రలకు అనుమతులు ఉండవని, తనకూ, మల్లు భట్టి విక్రమార్కకు ఇవ్వనట్టే, రేవంత్‌రెడ్డికి కూడా పాదయాత్ర చేసుకునేందుకు అనుమతి ఉండదని సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పి రేవంత్ గాలి తీసేసిన సంగ‌తి మ‌రువక ముందే.. ఆ పార్టీ అధిష్టాన‌మే …

Read More »

గొంతులో పూలుగు బొక్క ఇరికి వ్యక్తి మృతి

సూర్యపేట జిల్లా మిర్యాల గ్రామంలో ఓ వ్యక్తి మాంసం తింటూ ఒక్కసారిగా క్రింద కుప్పకూలాడు. ఆ తర్వాత ఊపిరాడక అతను చనిపోయాడు. మిర్యాల గ్రామంలోని రవీందర్(35) నాగోల్‌లోని ఓ భవనంలో వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి మటన్‌తో భోజనం చేస్తున్నాడు.కానీ ఆదరా బాదరా తినడంతో పూలుగు బొక్క గొంతులో ఇరుక్కుంది. దీనితో కొద్దిసేపు రవీందర్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. బొక్క గొంతులో ఇరకడంతో శ్వాస తీసుకోవడానికి వీలులేకుండా పోయింది. వెంటనే కుటుంబసభ్యులు కామినేని …

Read More »

ఈ నెల 23న యువ క్రికెటర్ భువనేశ్వర్ పెళ్లి

టీమిండియా యువ క్రికెటర్ భువనేశ్వర్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 23న భువీ తన ప్రేయసి నుపుర్‌ నగార్‌ను పెళ్లాడనున్నాడు. ఆయన సొంత వూరు మీరట్‌లోనే వివాహం జరుగనుంది. 26న బులంద్‌షహర్‌లో రిసెప్షన్‌ ఉంటుంది. నవంబరు 30న ఢిల్లీలో మరో రిసెప్షన్‌ జరుగుతుంది. మీరట్‌లో జరిగే వివాహానికి బంధువులు, స్నేహితులు హాజరవుతారని తెలిపాడు. కానీ భువి జట్టు సహచరులు, బోర్డు సభ్యులు కూడా మ్యారేజ్ లో పాలుపంచుకోవాలని …

Read More »

జగన్‌ను చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారు..

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి టీడీపీ నేతలు బయపడుతున్నారని.. అందుకే వాస్తవాలు దాచిపెట్టి జగన్‌పై బురదజల్లాలని చంద్రబాబు చూస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు.ఇవాళ అయన మీడియా తో మాట్లాడారు .టీడీపీ నేతలకు దమ్ముంటే వైఎస్ జగన్ సవాల్‌ను స్వీకరించాలని బుగ్గన అన్నారు. ప్యారడైజ్ పేపర్లపై వైఎస్ జగన్ నేరుగా సవాల్ విసిరినా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, …

Read More »

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి భారీ షాక్‌

హిమాచల్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి భారీ షాక్ తగిలింది. మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి నీలాంషు చతుర్వేది బీజేపీ అభ్యర్థి శంకర్‌ దయాళ్‌ త్రిపాఠిపై 14,100 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. సిట్టింగ్‌ కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ప్రేమ్‌ సింగ్‌ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కౌంటింగ్‌లో తొలి రౌండ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి చతుర్వేది బీజేపీ అభ్యర్థిపై భారీ …

Read More »

మంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్ నేత

తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో రాష్ట్ర పోలీసు హౌజింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, సీనియర్‌ రాజకీయ నాయకుడు మధిరకు చెందిన పుతుంబాక శ్రీకృష్ణప్రసాద్‌ శనివారం టీఆర్‌ఎస్‌లో చేరారు. కృష్ణాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు సమక్షంలో పుతంబాక టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ 35యేళ్లుగా కృష్ణప్రసాద్‌ రాజకీయాల్లో ఉన్నారు …

Read More »

తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం : డీజీపీ మహేందర్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా మహేందర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. డీజీపీ కార్యాలయంలో అనురాగ్‌శర్మ నుంచి మహేందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీజీపీకి అనురాగ్ శర్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు …ముందుగా డీజీపీగా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అయన ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రెండో డీజీపీగా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉందన్నారు.తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని నూతన …

Read More »

ఆరో రోజు పాదయత్రలో యువతకు జగన్ బంపర్ ఆఫర్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఆరు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే..ఈ పాదయత్రకు ప్రజల నుండి,యువత,విద్యార్ధి,విద్యార్ధిని,మహిళల ,వృద్ధుల నుండి ఆశేష అదరణ లభిస్తుంది..ఆరో రోజులో భాగంగా జగన్ యువతకోసం వరాల జల్లు కురిపించారు..పాదయాత్రలో భాగంగా జగన్ మాట్లాడుతూ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్ధులు చాలా …

Read More »

జగన్‌ రాజకీయాల నుంచి తప్పుకోవాలంట… యనమల రామకృష్ణుడు

ప్రపంచ ఆర్థిక నేరగాళ్ల జాబితాలో చోటు సాధించిన ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరువు తీశారని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నది ప్రజల సంకల్పమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.‘ జగన్‌లాంటి వారు రాజకీయాల్లో ఉండటం ప్రమాదకరం. ఆయనది ప్రజా సంకల్ప యాత్ర కాదు. కేసుల నుంచి తప్పించుకునేందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat