టీమ్ఇండియా స్టార్ ఆటగాడు చతేశ్వర్ పుజారా తనకే సాధ్యమైన అరుదైన రికార్డును బద్దలుకొట్టాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యధిక ద్విశతకాలు సాధించిన టీంఇండియా క్రికెటర్గా విజయ్ మర్చంట్ పేరిటున్న రికార్డును పూజారా తిరగరాశాడు. జార్ఖండ్తో మ్యాచ్లో డబుల్ సెంచరీ బాదిన అతడు కెరీర్లో 12వ ద్విశతకాన్ని నమోదు చేశాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న దిగ్గజ క్రికెటర్ విజయ్ మర్చంట్ (11)ను రెండో స్థానానికి పరిమితం చేశాడు. స్టార్ ఆటగాళ్ళు సునీల్ …
Read More »Blog Layout
మెరిసిపోతున్న కాజల్ ను చూసి మురిసిపోతున్నారు
ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో తన ప్రతిభనంతా ప్రదర్శిస్తోంది కాజల్ అగర్వాల్. ప్రత్యేకించి ఎక్కడికి వెళితే అక్కడ ప్రాంతీయ సెంటిమెంట్ ను పండించడానికి ఈ హీరోయిన్ అపసోపాలు పడుతోంది.తాజాగా లేలేత భానుడు తాకుతున్న వేల.. గోరు వెచ్చని ఎండలో.. అందాల ఫ్రెంచ్ రివేరా వద్ద.. అంతే అందంగా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం హాలిడే వెకేషన్లో భాగంగా పారిస్ లో ఉన్న ఈ భామ అక్కడ నుంచి ఈ …
Read More »శ్రీదేవి కూతురు డెబ్యూ మూవీ ఫిక్స్..!
వెండితెర అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి సిల్వర్ స్కీన్ ఎంట్రీ కోసం జరుగుతున్న హడావుడి అంతా ఇంతా కాదు. ప్రస్తుతం బాలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ కూడా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్న ఏకైక విషయం జాన్వి కపూర్ వెండితెర తెరంగేట్రం ఎప్పుడు చేస్తోందని. తొలుత తెలుగులో రామ్ చరణ్ సరసన అని, ఆ తర్వాత అఖిల్కి జోడీగా అని వార్తలు వచ్చాయి. బాలీవుడ్ మీడియాకి శ్రీదేవి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో …
Read More »లాస్ట్ మినిట్లో చేతులెత్తేశారు..?
బొమ్మరిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు సిద్ధార్థ్ ఆ తర్వాత వరుస పరాజయాలతో కనుమరుగు అయిపోయాడు. చాలా రోజులు గ్యాప్ తర్వాత తనే నిర్మాతగా సొంత బ్యానర్లో ఒక హారర్ థ్రిల్లర్ సినిమా చేశాడు. తమిళంతో పాటు తెలుగు… హిందీ భాషల్లోను ఒకే రోజున ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించాడు. ఒక్కో భాషలో ఒక్కో టైటిల్ పెట్టేసి .. నవంబర్ 3వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు …
Read More »నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు.. పోచారం
తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నకిలీ విత్తనాల విక్రయంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిని రాష్ట్రం నుంచి పూర్తిగా ఏరేస్తామని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 50 టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలు నకిలీ విత్తనాలు అమ్మేవారిని ఏరివేసే …
Read More »2000 రూపాయల నోట్ల ప్రింటింగ్ నిలిపివేత
రిజర్వ్ బ్యాంకు అఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది.కొత్తగా వచ్చిన 2000 రూపాయల నోట్లను రద్దు చేస్తుంది. ఈ ఆర్ధిక సంవస్సరం లో రెండు వేల రూపాయల నోట్లు ప్రింట్ చేయలేదు.దీనివెనుక పెద్ద కారణాలే ఉన్నాయని సమచారం. పెద్ద నోట్ల రద్దు విఫలమయిందని విమర్శలు చెలరేగడంతో కేంద్రం ఇరకాటంలో పడింది.. దిద్దుబాటు చర్యలపై మల్లగుల్లాలు పడుతోంది. రద్దు చేసిన నోట్ల స్థానంలో తెచ్చిన 2000 రూపాయల నోటును కూడా త్వరలో …
Read More »కమల్ రాజకీయాలకు పనికిరాడు.. గౌతమి సంచలనం..!
నటుడు కమల్ హాసన్ పై గౌతమి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. దాదాపు పదేళ్ళు సహజీవనం చేసిన తర్వాత కమల్ హాసన్ నేనిక కలిసి ఉండలేను అంటూ తన బ్లాగ్ లో బాంబ్ పేల్చిన గౌతమి రీసెంట్ గా ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ గురించి, ఆమె కెరీర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు వెలిబుచ్చింది. ఆ విషయాలు వింటుంటే.. ఏంటి కమల్ మరీ …
Read More »త్వరలో 600 AE పోస్టులకు నోటిఫికేషన్..
విద్యుత్ సంస్థల్లో ఖాళీగా ఉన్న 600 అసిస్టెంట్ ఇంజనీర్(AE) పోస్టులను భర్తీ చేయాలని డిస్కమ్లు నిర్ణయించాయి. తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్(టీఎస్ట్రాన్స్కో), దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్)ల్లో ఈ మేరకు పోస్టుల భర్తీకి కసరత్తు జరుగుతోంది. ఈ నియామకాలన్నిటికీ ఉమ్మడిగా ఒకే నోటిఫికేషన్ జారీ కానుంది. విద్యుత్ సంస్థల వారీగా ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఐటీ విభాగాల్లో AE పోస్టుల ఖాళీలను గుర్తించి …
Read More »టాలీవుడ్ ట్రేడ్ టాక్..!
నేను శైలజ కాంబినేషన్లో వచ్చిన ఉన్నది ఒకటే జిందగీ పరాజయ బాటలో పయనిస్తోంది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ చిత్రం మూడు రోజులు మంచి కలెక్షన్లు సాధించినా.. ఇక సోమవారానికి ఈ చిత్ర కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్గా విడుదల అయిన ఈ చిత్రం హ్యాపీడేస్ మాదిరిగా యువతరాన్ని ఉర్రూతలూగిస్తోందని అంచనా వేసిన ఈ చిత్రానికి ఫస్ట్ డేనే మిశ్రమ స్పందన వచ్చింది. …
Read More »2018 అక్టోబర్ చివరి నాటికి అది చేసి చూపిస్తాం.. మంత్రి తుమ్మల
ఇవాళ శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కొత్త జిల్లాల భవనాల ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సమాధానం ఇచ్చారు. పది జిల్లాలు ఉన్నటువంటి రాష్ర్టాన్ని 31 జిల్లాలుగా మార్చామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు పాలన వెళ్లిందన్నారు. ఈ కొత్త సంస్కరణలతో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు. అంతేకాకుండా అధికారులను ప్రజలు నేరుగా కలుసుకునే అవకాశం వచ్చిందన్నారు. 26 జిల్లాల్లో కొత్త భవనాలకు …
Read More »