Blog Layout

మొక్కలు నాటడంలో తెలంగాణకు ప్రథమస్థానం

దేశంలో మొక్కలు నాటడంలో తెలంగాణ రాష్ట్రం    ప్రథమస్థానంలో నిలిచిందని కేంద్రం వెల్లడించింది. 20 సూత్రాల కార్యక్రమంలో భాగంగా 2019-20 ఆర్థిక ఏడాదిలో దేశంలో 150.23కోట్ల మొక్కలు నాటడం జరిగింది.. అందులో తెలంగాణ రాష్ట్రం లోనే 38.17కోట్లు నాటినట్లు తెలిపింది. తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర (34.54కోట్లు), ఉత్తరప్రదేశ్ (22.59కోట్లు) ఆంధ్రప్రదేశ్ (17.05కోట్లు) ఉన్నాయని పేర్కొంది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ చంద్రశేఖర్ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు. కేంద్రమంత్రి సుప్రియో సమాధానమిచ్చారు

Read More »

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు-2021 – ‘పీపుల్స్ పల్స్’ సర్వే నివేదిక:

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి మార్పు తథ్యంగా కన్పిస్తోంది. రాష్ట్రంలోని మెజారిటీ ఓటర్లలో మమతా బెనర్జీ ప్రభుత్వంపట్ల నెలకొన్న వ్యతిరేకతే దీనికి కారణం. పశ్చిమ బెంగాల్ లో ‘పీపుల్స్ పల్స్’ ప్రతినిధులు పర్యటించి రాష్టంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఓటర్ల మనోభావాలెలా ఉన్నాయనే అంశంపై అధ్యయనం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లతోపాటు వివిధ సామాజికవర్గాల, మతాల వారీగా అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించారు. ‘పీపుల్స్ పల్స్’ సంస్థ డైరెక్టర్, …

Read More »

చంద్రగిరిలో చరిత్ర సృష్టించిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి

ఏపీలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగిన సంగతి విధితమే..ఈ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలో మెజార్టీ పంచాయతీల్లో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ ప్రభంజనం సృష్టించింది..ఇందులో భాగంగా నియోజకవర్గంలో మొత్తం 107గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాయకత్వంలో 105గ్రామ పంచాయతీల్లో విజయ దుందుభి మ్రోగించింది.. అయితే ప్రధాన ప్రతిపక్ష …

Read More »

జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే

ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని ఏలూరులో జనసేన తరఫున ఎన్నికల ప్రచారంలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ‘అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. 25వ డివిజన్ ను ఏకగ్రీవం చేయాలని టీడీపీ అభ్యర్థిని విత్డ్రా చేయించారు. అందుకే జనసేన అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నా, టీడీపీ, జనసేన పార్టీలకు వైసీపీ ప్రధాన శత్రువు. వైసీపీ ఓటమికి ఇరు పార్టీల …

Read More »

ఏపీలో త్వరలో మెగా డీఎస్సీ,టెట్ నోటిఫికెషన్స్

ఏపీలో మెగా డీఎస్సీ, డీఎస్సీ, టెట్ నిర్వహణపై విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. త్వరలోనే వీటి నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీనిపై కసరత్తు చేస్తున్నాముని, ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పింది. అటు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రస్థాయి విద్యకు ప్రాధాన్యత ఇస్తూనే సీబీఎస్ఈ అమలు చేయనున్నట్లు తెలిపింది. ప్రైవేట్ కు మించి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొంది

Read More »

ఏపీలో కొత్తగా 136 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో 45,702 శాంపిల్స్ పరీక్షించగా. కొత్తగా 136 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,692కి చేరింది. ఇందులో 998 యాక్టివ్ కేసులు ఉండగా, ఇప్పటి వరకు 8,82,520 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఒకరు మృతిచెందగా.. మొత్తం 7,174 మంది మరణించారు…

Read More »

మంత్రి కేటీఆర్ కు ఎంపీ రేవంత్ సవాల్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి బహిరంగ సభ లేఖ రాశారు.  అధికార పార్టీ టీఆర్ఎస్ ,ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ శరీరాలే వేరని, ఆత్మ ఒక్కటేనన్నారు. ఎన్నికలప్పుడు కుస్తీ తర్వాత దోస్తే చేస్తారని ఆరోపించారు. అటు విభజన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఢిల్లీ జంతర్ మంతర్ …

Read More »

జర్నలిస్టు కుటుంబాలకు అండగా తెలంగాణ ప్రభుత్వం

జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తనదేనన్నారు. 260మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఇచ్చామన్నారు. వారి పిల్లలను గురుకుల పాఠశాలలో చదివించే బాధ్యత తీసుకుంటామన్నారు. జలవిహార్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ప్రతినిధుల సమావేశానికి హాజరైన మంత్రి కేటీఆర్.. జర్నలిస్టులకు నాణ్యమైన ఆరోగ్య స్కీం తీసుకొస్తామన్నారు.

Read More »

రాత్రివేళల్లో వీటిని తినకపోవడం మంచిది..?

అరటిపండు, ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ రాత్రివేళల్లో వీటిని తినకపోవడం ఉత్తమమం అని నిపుణులు చెబుతున్నారు. అరటికి శరీరంలోని వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అయితే రాత్రిపూట తింటే చల్లగా ఉన్న శరీరాన్ని ఇది మరింత చల్లబరిచి, దగ్గు, జలుబు వచ్చేందుకు కారణం అవుతుంది. అలాగే రాత్రి సమయంలో అరటి పండు తింటే వెంటనే జీర్ణం కాదు. దీంతో నిద్రపట్టకపోవచ్చు. ఆటు ఎసిడిటీ ఉన్నవాళ్లు రాత్రిపూట యాపిల్ పండ్లను …

Read More »

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కుటుంబంలో విషాదం

భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం – సోదరుడు కన్నుమూశారు. కలాం పెద్దన్నయ్య మహ్మద్ ముత్తుమీరా(104) రామేశ్వరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ముత్తుమీరా మృతికి తెలంగాణ గవర్నర్ తమిళి సై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat