rameshbabu
February 9, 2023 SLIDER, TELANGANA
484
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 11న నామినేషన్లను స్వీకరించనున్నారు. 12వ తేదీన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేరు ఖరారు అయింది. బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా 2021, నవంబర్ నెలలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి కొనసాగుతున్న విషయం విదితమే.
Read More »
rameshbabu
February 9, 2023 SLIDER, TELANGANA
532
తెలంగాణలో మే 7న ఎంసెట్ పరీక్ష జరగనున్న సంగతి విదితమే. అయితే ఈ పరీక్షలకు హజరై విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎంసెట్లో ఇంటర్ ఫస్టియర్ 70% సిలబస్ నుంచే ప్రశ్నలు ఇస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. సెకండియర్లో 100% సిలబస్ చదవాల్సిందేనని పేర్కొన్నారు. 2021-22లో కరోనా కారణంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 70% సిలబస్తో పరీక్షలు రాశారని.. ఎంసెట్లో కూడా అదే సిలబస్ ఉంటుందన్నారు.
Read More »
rameshbabu
February 9, 2023 ANDHRAPRADESH, SLIDER
675
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల వసతి, భోజనం ఖర్చుల కోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2 నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వారానికి మూడు రోజులపాటు అందజేసేందుకు అదనంగా రూ.86 కోట్లను ఖర్చు చేయనుంది.
Read More »
rameshbabu
February 9, 2023 SLIDER, TELANGANA
588
కేంద్రమంత్రి అమిత్ షా ఈనెల 11న హైదరాబాద్ రానున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో జరగనున్న ట్రైనీ ఐపీఎస్ల పరేడ్కు ఆయన హాజరవుతారు. 190 మంది ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా అమిత్ షా వారితో మాట్లాడనున్నారు. వీరిలో 29మంది విదేశీ ఆఫీసర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు, ఏపీకి చెందిన ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ లు ఉన్నారు.
Read More »
rameshbabu
February 9, 2023 ANDHRAPRADESH, SLIDER
518
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అభద్రతాభావంలో ఉన్నారని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నాయకులు.. ఫోన్లు మాట్లాడుకునే ధైర్యం చేయలేకపోతున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఘటనపై ప్రభుత్వం భయపడుతోందని… విచారణ జరిగితే మిగిలిన వారి ట్యాపింగ్ విషయాలు బయటపడతాయని వెనకడుగు వేస్తోందని చెప్పారు. మేయర్తోపాటు 11 మంది కార్పోరేటర్లు తనతోపాటు ఉన్నారని కోటంరెడ్డి తెలిపారు.
Read More »
rameshbabu
February 9, 2023 MOVIES, SLIDER
588
పాన్ ఇండియా స్టార్ హీరో.. రెబల్ స్టార్ ..డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ప్రేమలో ఉన్నారని, త్వరలో వీరు పెళ్లి చేసుకోనున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా ప్రభాస్, కృతి ఎంగేజ్మెంట్ మాల్దీవుల్లో జరగనుందనే ప్రచారం మొదలైంది. దీనిపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ‘ప్రభాస్, కృతి మంచి ఫ్రెండ్స్. మాల్దీవుల్లో వారి ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తల్లో నిజంలేదు’ అని ప్రకటించింది. ఆదిపురుష్ లో వీరిద్దరూ నటిస్తున్నారు.
Read More »
rameshbabu
February 9, 2023 MOVIES, SLIDER
469
ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ‘లియో’పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ భాగం.. ‘విక్రమ్’, ‘ఖైదీ’ చిత్రాలతో సంబంధం ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పుడు ఈ అంచనాలను పెంచే టాక్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మెగాపవర్ స్టార్ రాంచరణ్ ‘లియో’ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారట. అయితే ఈ వార్తలపై మూవీ టీమ్ స్పందించాల్సి …
Read More »
rameshbabu
February 9, 2023 SLIDER, TELANGANA
524
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతకు మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని అమెరికాకు చెందిన ప్రొవిడెన్స్ హెల్త్ సిస్టమ్స్ కంపెనీ తమ ఉద్యోగుల సంఖ్యను మూడింతలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీలో 1,000 మంది పనిచేస్తున్నారని, ఆ సంఖ్యను 3వేలకు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ మేరకు కంపెనీ సీఈవో డాక్టర్ రాడ్ హోచ్మన్, సీఐవో మూర్, ఇండియా హెడ్ మురళీ కృష్ణలు భేటీ అయ్యారని ట్విటర్లో పేర్కొన్నారు.
Read More »
rameshbabu
February 9, 2023 NATIONAL, SLIDER, TELANGANA
921
దేశంలో సంచలనం సృష్టించిన అదానీ స్టాక్స్ మోసాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని భారత్ రాష్ట్ర సమితి, ఆమ్ ఆద్మీ పార్టీలు ఇవాళ పార్లమెంట్లో డిమాండ్ చేశాయి. ఉభయసభలను బహిష్కరించిన ఇరు పార్టీలు.. పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్, ఆప్ పార్టీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని గాంధీ విగ్రహం ముందు నినాదాలు చేశారు. అదానీ సంక్షోభంపై తేల్చేందుకు జేపీసీతో విచారణ చేపట్టాలని డిమాండ్ …
Read More »
rameshbabu
February 9, 2023 SLIDER, TELANGANA
515
తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్ టీచర్ ఎమ్మెల్స స్థానానికి ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. ఈ ఎన్నికకు సంబంధించి ఈ నెల 16వ తేదీ నోటఫికేషన్ను విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 23వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. మార్చి 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయా …
Read More »