
Classic Layout
KOTAM REDDI: అవమానం జరిగిన చోట ఉండకూడదనే అధికారం వదులుకున్నా: కోటంరెడ్డి
KOTAM REDDI: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికీ అధికార, ప్రతిపక్షాలు విమర్శల అస్త్రాలు సంధిస్తునే ఉన్నారు. ఈ వాడీ వేడీ రాజకీయాల్లో కోటంరెడ్డి కూడా ఘాటుగానే బదులిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరికీ నమ్మకద్రోహం చేయలేదని కోటంరెడ్డి ధ్వజమెత్తారు. అవమానం జరిగిన చోట ఉండకూడదనే అధికారం వదులుకునేందుకు సిద్ధమయ్యానని వ్యాఖ్యానించారు. మరో 10 నెలలకు పైగా అధికారంలో ఉండే ప్రభుత్వంపై విమర్శలు చేస్తే పరిణమాలు ఎలా …
Read More »JAGGAREDDI: గవర్నర్ ప్రసంగంపై జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
JAGGAREDDI: శాసనసభలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. మొన్నటివరకు భారాస ప్రభుత్వంపై కోపాలు, అలకలు, గర్జనలు చేసిన గవర్నర్….శాసనసభలోకి రాగానే పిల్లిలా అయిపోయారని ఎద్దేవా చేశారు. భారాస, భాజపాలో ‘బి‘లో ఉంది….గవర్నర్ మూడో బి అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ రాసిచ్చిందే గవర్నర్ శాసనసభలో అప్పజెప్పారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రులు రాసిచ్చిందే గవర్నర్లు చదువుతారని జగ్గారెడ్డి విమర్శించారు. శాసనసభలో కనబడాలనుకున్నారు.. కనిపించారు.. అంతే అని జగ్గారెడ్డి …
Read More »GOVERNOR: దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ అభివృద్ధి, గొప్ప ప్రగతిని సాధించింది: గవర్నర్
GOVERNOR: తెలంగాణ….యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ తమిళిసై కొనియాడారు. అన్ని రంగాల్లోనూ దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ అభివృద్ధి, గొప్ప ప్రగతిని సాధిస్తోందని అన్నారు. ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ పరిపాలన వల్ల తెలంగాణ మంచి పురోగతి సాధించిందని అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ఒకప్పుడు విద్యుత్ కోతలతో తెలంగాణ చీకటిలో గడిపేది. నేడు ప్రభుత్వ కృషితో 24 గంటల విద్యుత్ సరఫరాతో కోటి కాంతుల …
Read More »KAKANI: ఎమ్మెల్యే కోటంరెడ్డిపై మంత్రి కాకాణి ఫైర్
KAKANI: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై మరో వైకాపా నేత దుయ్యబట్టారు. పార్టీ మారాలనే ఆలోచన ఉన్నప్పుడు మారాలి గానీ…..ఇలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించకూడదని మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి….చంద్రబాబు మాయలో పడ్డారని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల వేళ నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం అభ్యర్థి విషయంలో ఎంత పోటీ ఉన్నా…..సీఎం జగన్ గెలిపించారని తెలిపారు. నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే కోర్టుకు వెళ్లాలిగానీ…..ఇప్పటివరకూ ఎందుకు వెళ్లలేదని …
Read More »సీనియర్ దర్శకుడు వి.సాగర్ కన్నుమూత
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ దర్శకుడు వి.సాగర్ (71) గురువారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. టి.నగర్ రాధాకృష్ణన్ వీధిలోని తన స్వగృహంలో నివశిస్తున్న సాగర్.. పదిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన భౌతికకాయానికి శుక్రవారంఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారు. సాగర్కు భార్య మాలా, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సాగర్ పూర్తి పేరు ఉయ్యూరు విద్యా సాగర్ రెడ్డి. సినీ దర్శకుడిగా మారిన తర్వాత ఆయన వి.సాగర్గా ఖ్యాతిగడించారు. …
Read More »కళాతపస్వీ కె. విశ్వనాథ్ కన్ను మూత
తెలుగు చిత్ర పరిశ్రమకు అద్భుతమైన చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు కళాతపస్వీ కె. విశ్వనాథ్ కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పూర్తిపేరు కాశీనాధుని విశ్వనాథ్. అప్పటి ఉమ్మడి ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెదపులివర్రు గ్రామం ఆయన స్వస్థలం. 1930 ఫిబ్రవరి 19న కాశీనాధుని సుబ్రహ్మణ్యం, సరస్వత్మ దంపతులకు విశ్వనాథ్ జన్మించారు. కె.విశ్వనాథ్కు ఇద్దరు కుమారులు, …
Read More »నేటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ మధ్యాహ్నం 12.10 గంటలకు శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన రెండుచోట్ల సభా నిర్వహణ సలహా కమిటీ (బీఏసీ) సమావేశాలు జరుగనున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? ఎన్ని బిల్లులను సభలో ప్రవేశపెట్టాలి? వంటి విషయాలపై బీఏసీ సమావేశాల్లో సభ్యులు చర్చించి …
Read More »