Classic Layout

మద్యం మత్తులో బతికున్న తల్లిని పూడ్చేసిన కొడుకు!

తమిళనాడులోని విల్లుపురం జిల్లా ముగైయూర్ సమీపంలోని సిత్తామూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఫుల్లుగా తాగేసిన ఓ కొడుకు మద్యం మత్తులో కన్నతల్లిపై దాడి చేసి అనంతరం ఆమెను బతికుండగానే గొయ్యి తీసి పాతిపెట్టేశాడు. సిత్తామూర్‌కు చెందిన శక్తివేల్ దంపతులకు నలుగురు కూతురులు, ఒక కొడుకు. శక్తివేల్ తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో మరోసారి వారి మధ్య గొడవ జరగడంతో శక్తివేల్ భార్య పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో …

Read More »

నెక్ట్స్ మూవీలో అన్న సిక్స్ ప్యాక్ పక్కా.. సూపర్‌స్టార్ ఫోటో వైరల్!

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు జిమ్‌లో వర్కౌట్‌ చేస్తోన్న ఫోటో ఒకటి నెట్టింట హల్ చల్‌ చేస్తోంది. ఈ ఫోటోని చూస్తోన్న ఎంబీ ఫ్యాన్స్ ఈ రేంజ్‌లో కసరత్తులు చేస్తున్నాడంటే నెక్ట్స్ మూవీలో మా అన్న సిక్స్ ప్యాక్‌లో కనిపించడం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహేశ్ బాబు ట్రైనర్ సమక్షంలో డంబెల్‌తో కసరత్తు చేస్తున్నారు. దీన్ని సోషల్ మీడియాలో పంచుకున్న ఆయన అభిమానులు అన్నా అన్‌ ఫైర్, నెక్ట్స్ సినిమాలో అన్న …

Read More »

లెహంగా చిచ్చు.. ఏకంగా పెళ్లే క్యాన్సిల్!

అత్తింటివారు పెళ్లి కోసం పంపిన లెహంగా నచ్చలేదని ఓ వధువు ఏకంగా పెళ్లికే నిరాకరించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది. సమయానికి పోలీసులు కలుగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. హల్ద్వానీకి చెందిన ఓ యువతికి, అల్మోరాలో నివాసం ఉంటున్న ఓ యువకుడితో పెద్దలు వవాహం నిశ్చయించారు. నవంబరు 5న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇరు …

Read More »

అయోధ్య చారిత్రాత్మక తీర్పునకు మూడేళ్లు.. వచ్చే ఏడాదికి రామమందిరం పూర్తి

ఉత్తరప్రదేశ్‌లోని రామజన్మభూమి అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువడి నేటికి మూడేళ్లు పూర్తయింది. ఆయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని మూడు భాగాలు చేస్తూ అప్పట్లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలయ్యాయి. అనంతరం సుప్రీం కోర్టు ఆ స్థలం మొత్తం హిందువులకే చెందుతుందని తీర్పునిచ్చింది. ఆ  వివాదాస్పద  భూమిలో శ్రీరాముడి ఆలయం నిర్మించే బాధ్యతను ట్రస్టుకు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. …

Read More »

తెగ ఫీలవుతున్న రష్మిక మందన్నా

కన్నడ బ్యూటీ… నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నా ఇన్ స్టా గ్రామ్  వేదికగా విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘గత కొంతకాలంగా నన్ను చాలా మంది విమర్శలు, నెగిటివిటీతో ఇబ్బంది పెడుతున్నారు. నేను అందరికీ నచ్చాల్సిన పని లేదు. నేను మీకు నచ్చలేదంటే దానర్థం మీరు విమర్శలు చేయొచ్చని కాదు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఎంత కష్టపడతానో నాకు తెలుసు. నేను మాట్లాడని విషయాలపై కూడా నన్ను విమర్శిస్తుంటే గుండె …

Read More »

సంజయ్ రౌత్ కు బెయిల్

మనీలాండరింగ్ కేసులో నిందితుడుగా ఉన్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కు బెయిల్ మంజూరు చేసింది ముంబయి కోర్టు. ఈ ఏడాది జూన్ లో సంజయ్ రౌతు అరెస్ట్ చేసిన ఈడీ ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించింది. రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని, ఇది అధికార దుర్వినియోగమేనని రౌత్ తన పిటిషన్లో పేర్కొన్నారు. గతవారమే జరిగిన ఈ విచారణలో రౌత్కు బెయిల్ ఇవ్వొదని.. అతని ప్రమేయంతోనే ఈ …

Read More »

పవన్ కళ్యాణ్ కు నటుడు జీవీ సలహ

జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో పవన్ కల్యాణ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు జీవీ సుధాకర్ నాయుడు సలహా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏపీలోని ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీతో చేతులు కలుపుతున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై నటుడు జీవీ సుధాకర్ మాట్లాడుతూ టీడీపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపద్దు అని డిమాండ్ చేశారు. ఈ …

Read More »

పవన్ కల్యాణ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో పవన్ కల్యాణ్ గురించి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ కళ్యాణ్ ను ఉద్ధేశిస్తూ కేఏ పాల్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు ఉన్న విలువ పోతోందని ఆయన ఆరోపించారు. ‘పవన్ 9 పార్టీలు మారాడు. అన్నయ్య పార్టీ అయిన ప్రజారాజ్యం,సీపీఐ,సీపీఎం,బీఎస్పీ, బీజేపీ సహా ఎన్నో పార్టీల్లో చేరడంతో పవన్ కు ఉన్న ప్రస్తుత ఓటు బ్యాంక్ …

Read More »

సంక్రాంతికి కొత్త సచివాలయం..!

రాష్ర్టంలో కొత్త సచివాలయం బిల్డింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. రానున్న సంక్రాంతికి కొత్త సచివాలయాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటివరకు 90 శాతం పనులు పూర్తయ్యాయి. కీలకమైన భారీ డోమ్‌ల నిర్మాణం, బిల్డింగ్ లోపల ఫినిషింగ్ పనులు, చుట్టూ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, డ్రెయిన్లు, పచ్చికబయళ్ల పనులు మాత్రమే చేయాల్సి ఉంది. రాజస్థాన్ ధోల్పూర్ నుంచి తెప్పించిన ఎర్ర రాయితో కొత్త సచివాలయం బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారు. మొత్తం దీనిలో …

Read More »

మంత్రి గంగుల, గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లల్లో ఈడీ, ఐటీ సోదాలు..!

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో ఈడీ, ఐటీ సంయుక్త సోదాలను నిర్వర్తిస్తున్నాయి. ఈ క్రమంలో పలు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లల్లో, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. గ్రానైట్‌ వ్యాపారులు ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలు రావడంతో 20కి పైగా బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ మంత్రి ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు. ఆదాయపన్ను(ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెర్టరేట్(ఈడీ) ఏకకాలంలోనే ఈ సోదాలు జరుపుతున్నారు. కరీంనగర్‌లోని మంత్రి గంగుల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat