Home / CRIME / మద్యం మత్తులో బతికున్న తల్లిని పూడ్చేసిన కొడుకు!

మద్యం మత్తులో బతికున్న తల్లిని పూడ్చేసిన కొడుకు!

తమిళనాడులోని విల్లుపురం జిల్లా ముగైయూర్ సమీపంలోని సిత్తామూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఫుల్లుగా తాగేసిన ఓ కొడుకు మద్యం మత్తులో కన్నతల్లిపై దాడి చేసి అనంతరం ఆమెను బతికుండగానే గొయ్యి తీసి పాతిపెట్టేశాడు.

సిత్తామూర్‌కు చెందిన శక్తివేల్ దంపతులకు నలుగురు కూతురులు, ఒక కొడుకు. శక్తివేల్ తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో మరోసారి వారి మధ్య గొడవ జరగడంతో శక్తివేల్ భార్య పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో శక్తివేల్ ప్రస్తుతం తల్లి యశోదతో కలిసి ఉంటున్నాడు. శక్తివేల్ తండ్రి 15 ఏళ్ల క్రితమే చనిపోయారు. శక్తివేల్‌కి మద్యం తాగే అలవాటు బాగా ఉండడంతో మద్యం మత్తులో తల్లితో నిత్యం గొడవ పడుతుండేవాడు. భయంతో తల్లి రాత్రివేళల్లో పక్కింట్లో పడుకుంటుండేది.

మంగళవారం కూడా ఫుల్లుగా తాగి వచ్చిన శక్తివేల్ తల్లితో గొడవ పడ్డాడు. ఆ తర్వాత నుంచి అతడి తల్లి కనిపించలేదు. చుట్టుపక్కలవారు ఎంత వెదికిగా ఆమె ఆచూకీ లభించలేదు. శక్తివేల్ ఇంటికి తాళం వేసి ఉండడం చూసి అనుమానంతో వెనుక వైపు వెళ్లి పరిశీలించగా ఓ చోట అతడి తల్లి కట్టుకున్న చీర కిందపడి ఉండడాన్ని గమనించారు. అనుమానంతో తాళం పగలగొట్టి చూడగా శక్తివేల్ లోపలే ఉన్నాడు. ఇరుగుపొరుగు వారిని చూసిన అతడు భయంతో పరుగులు తీయగా స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేయగా.. తల్లిపై దాడి చేశానని ఆమె తలకు గాయమై స్పృహ తప్పి పడిపోయిందని అందుకే గొయ్యి తీసి పాతేశానని చెప్పాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చి గొయ్యి తీసి చూసేసరికి ఆమె చనిపోయింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat