Classic Layout

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా  రాష్ట్రంలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈనెల మే 30న పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఇటీవల పార్లమెంట్ సభ్యులుగా ఉన్న బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగతి విదితమే. దీంతో ఆయన రాజ్యసభకు …

Read More »

ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిప్పులు

టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి చెందిన నిజామాబాద్  ఎంపీ అర‌వింద్ ఓ అప‌రిచితుడి మాదిరిగా, అరాచ‌కం సృష్టించే వాడిగా త‌యార‌య్యాడ‌ని మండిప‌డ్డారు. నోరు తెరిస్తే బూతులు, అబ‌ద్ధాలే మాట్లాడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప‌సుపు బోర్డుపై మాట త‌ప్పిన అర‌వింద్‌ను జీవితాంతం బాండ్ పేప‌ర్లు వెంటాడుతూనే ఉంటాయ‌న్నారు. ఎమ్మెల్సీ క‌విత సంస్కారంగా మాట్లాడితే.. అర‌వింద్ మాత్రం ఏక‌వ‌చ‌నంతో సంస్కార‌హీనంగా మాట్లాడుతున్నార‌ని కోపోద్రిక్తుల‌య్యారు. స్పైస్ బోర్డుకు …

Read More »

ఓయూలో రాహుల్‌ పర్యటన.. ఎన్‌ఎస్‌యూఐ పిటిషన్‌ కొట్టేసిన హైకోర్టు

ఓయూలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనకు అనుమతిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఎన్‌ఎస్‌యూఐ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాహుల్‌ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది. ఓయూ క్యాంపస్‌లో రాజకీయ, మతపరమైన సమావేశాలకు అనుమతించకూడదని.. అందుకే సభకు పర్మిషన్‌ ఇవ్వలేమని ఇటీవల వీసీ పేర్కొన్నారు. వీసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ …

Read More »

అర్వింద్‌.. పసుపు బోర్డు ఏదీ?.. ఇంకెన్నాళ్లు మాయమాటలు?: కవిత

అబద్ధాలు చెప్పి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని మాజీ ఎంపీ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైస్పీడ్‌లో అబద్ధాలు చెప్పడం తప్ప బీజేపీ నేతలు చేసిందేమీ లేదని మండిపడ్డారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. బీజేపీ నాయకులు కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో, కేంద్రం జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలని సూచించారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మూడేళ్ల క్రితం పసుపు …

Read More »

ఓరి దేవుడో.. పొట్టలో 108 హెరాయిన్‌ మాత్రలు.. విలువ తెలిస్తే షాక్‌ అవుతారు!

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు చాకచక్యంగా వ్యవహరించి భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి ఏకంగా తన పొట్టలో 108 హెరాయిన్‌ మాత్రలను దాచేశాడు. వివరాల్లోకి వెళితే.. గత నెల 26న టాంజానియా దేశస్థుడు జోహనెస్‌బర్గ్‌ నుంచి శంషాబాద్‌ వచ్చాడు. అతడి వ్యవహారశైలిపై డౌట్‌ రావడంతో కస్టమ్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లగేజీ తనిఖీ చేసి అతడి వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లేనట్లు తేల్చారు. కానీ ఆ వ్యక్తి …

Read More »

గృహ వినియోగదారులకు పవర్‌ కట్‌ ఇబ్బందులొద్దు: సీఎం జగన్‌

రాష్ట్రంలోని థర్మల్‌ పవర్‌ ప్లాంట్లలో అదనంగా కెపాసిటీని జోడించాలని.. తద్వారా విద్యుత్‌ కొరతను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ బి.శ్రీధర్‌ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ కృష్ణపట్నం, వీటీపీఎస్ ప్లాంట్లలో 800 మెగావాట్ల చొప్పున అదనపు యూనిట్లను త్వరగా ప్రారంభించాలని …

Read More »

యాదాద్రిలో కారు పార్కింగ్‌ ఫీజు నిబంధనల్లో మార్పు

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల కారు పార్కింగ్‌ ఫీజుపై అధికారులు సవరణ చేశారు. కొండపై వాహనాల పార్కింగ్‌ రూ.500 చొప్పున.. ఆపై ప్రతి గంటకు రూ.100 చొప్పున ఫీజు వసూలు చేస్తామని ఇటీవల ఆలయ ఈవో గీత ప్రకటించారు. అయితే ఆ నిబంధనలో స్వల్ప మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గంటకు రూ.100 చొప్పున వసూలు చేయాబోమని.. ఆ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో …

Read More »

కేక పుట్టిస్తున్న యాషిక ఆనంద్ అందాలు

గతంలో ఎన్నడూలేని విధంగా యాషిక ఆనంద్  ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ ఈ ఫొటో షూట్‌ చేసింది. అసలే మండిపోతున్న ఎండలతో సతమతమవుతున్న సినీ అభిమానుల్లో యాషిక ఆనంద్‌ తాజా ఫొటోలు మరింత హీట్‌ను పెంచుతున్నాయి. కాగా, బిగ్‌ బాస్‌ నుంచి బుల్లితెరకు అక్కడ నుంచి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన యాషికకు గత యేడాది మహాబలిపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత పునర్జన్మ లభించింది. ఈ ప్రమాదం కారణంగా దాదాపు మూడు నెలల …

Read More »

మహేష్ చేతుల మీదుగా జయమ్మ ట్రైలర్ విడుదల

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..  సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల మెయిన్ రోల్ గా నటించిన  ‘జయమ్మ పంచాయితీ’ మూవీకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు.. ఈ చిత్రాన్ని విజయ లక్ష్మీ సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించారు. ఇప్పటికే, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను పవర్ …

Read More »

YCP Mp సంజీవ్ కుమార్ కు షాక్

 ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ  ఎంపీ సంజీవ్ కుమార్ ను సైబర్ నేరగాడు బురిడీ కొట్టించాడు. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యింది.. వెంటనే పాన్ నంబరుతో జత చేసి అప్ డేట్ చేసుకోవాలని  సదరు ఎంపీకి మెసేజ్ వచ్చింది. దానిని నమ్మి లింకులో వివరాలు నింపి పంపగా ఓటీపీ వచ్చింది. ఓ వ్యక్తి ఎంపీకి ఫోన్ చేసి OTP, ఇతర వివరాలు తెలుసుకున్నాడు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat