Classic Layout

కొత్త కేబినెట్‌లో పాతవాళ్లు ఎంతమంది? కొడాలి నాని ఏమన్నారంటే?

ఇటు కేబినెట్‌లో అటు పార్టీలో కొందరు సమర్థులు కావాలని.. పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం జగన్‌ ప్రారంభంలోనే చెప్పారన్నారు. కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్‌కు తమ రాజీనామాలను సమర్పించామని చెప్పారు. జగన్‌ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానన్నారు. పార్టీలో …

Read More »

ఏపీ కేబినెట్‌.. 24 మంది మంత్రుల రాజీనామా

ఏపీ మంత్రివర్గంలో 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. కేబినెట్‌ భేటీ అనంతరం తమ రాజీనామాలను సీఎం జగన్‌కు అందజేశారు. కేబినెట్‌ సమావేశంలో 36 అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. సంగం బ్యారేజ్‌కి దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి పేరు, మిల్లెట్‌ మిషన్‌ పాలసీ, డిగ్రీ కాలేజీల్లో 574 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ వంటి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజీనామాలను ఈ రాత్రికే గవర్నర్‌ ఆమోదించే అవకాశం …

Read More »

యుద్ధం ఆపేందుకు రష్యా మరో ప్రతిపాదన

 ఉక్రెయిన్ దేశంపై  రష్యా చేస్తున్న యుద్ధం ఆపేందుకు మరో ప్రతిపాదన చేసింది. చర్చల సందర్భంగా సూచించిన షరతులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరిస్తే మిలిటరీ ఆపరేషన్ నిలిపివేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా నాటోలో చేరాలనే అన్ని ప్రణాళికలను ఉక్రెయిన్ విరమించుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఇటీవల పుతిన్, జెలెన్ స్కీ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.. అయితే ఉక్రెయిన్లోని బుచాలో రష్యా …

Read More »

చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం

కరోనా వైరస్ తొలిసారి వెలుగుచూసిన చైనాలో మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 20,472 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా అతిపెద్ద నగరం షాంఘైలో 17,077 కేసులు బయటపడ్డాయి. తాజా ఉద్ధృతిలో ఈ ఒక్క నగరంలోనే 90 వేలకు చేరింది. చైనాలో ఇటీవల ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ ఉద్ధృతితో మహమ్మారి విజృంభిస్తోంది

Read More »

అర్బన్ ఫారెస్టులకు అంతర్జాతీయ గుర్తింపు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా తెలంగాణ అమలు చేస్తున్న పచ్చదనం పెంపు, అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రాష్ట్రంలో 109 అర్బన్ ఫారెస్టులను, హెచ్ఎండీఏ పరిధిలో 59 పార్కులను హరితహారంలో అభివృద్ధి చేశారు. తెలంగాణలో అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతిని అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఫారెస్ట్ సైన్స్ గుర్తించింది. అర్బన్ ఫారెస్టులపై రాసిన వ్యాసం ఆ సంస్థ ఆన్ లైన్ …

Read More »

రేపు నంద్యాలకు సీఎం జగన్

ఏపీ అధికార వైసీపీ అధినేత ,సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా నంద్యాలలో రేపు   పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్  జగనన్న వసతి దీవెన కింద తదుపరి విడత నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో  జమ చేయనున్నారు. అనంతరం జరగనున్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిగతా జిల్లాల అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ఈ పథకం కింద ఐటీఐ విద్యార్థులకు …

Read More »

అల్లంతో ఎన్ని ప్రయోజనాలంటే?

అల్లంతో ఎన్ని ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? * కండరాల నొప్పి తగ్గిస్తుంది. * * అల్లంలో ఉండే పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని అరికట్టవచ్చు * తీవ్రమైన కడుపు నొప్పి నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది * శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది * అల్లంలోని యాంటీ ఇంఫ్లమేటరీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది * జలుబు, ఫ్లూ తగ్గడానికి సహాయపడుతుంది.

Read More »

ఆ హీరోలతో మల్టీస్టారర్ చేస్తా-వరుణ్ తేజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ‘గని’తో రేపు థియేటర్లలోకి రానున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. మూవీ ప్రమోషన్లో భాగంగా వరుణ్ మల్టీస్టారర్ చేయడంపై స్పందించాడు. యువహీరోలు నితిన్, సాయి ధరమ్ తేజ్ లతో తాను చాలా సన్నిహితంగా ఉంటాను.. వారితో మల్టీస్టారర్లు చేయడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. వీరి కలయికలో సినిమా వస్తుందేమో చూడాలి మరి.

Read More »

పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతా అంటున్న గని

సాధారణంగా తాను ఫిట్ గా ఉండనని, కానీ ‘గని’ సినిమాలో కోచ్గా నటించిన సునీల్ శెట్టి స్ఫూర్తితో నిత్యం జిమ్ కు వెళ్లి ఫిట్ గా మారానని హీరో వరుణ్ తేజ్ అన్నాడు. వరుణ్ తేజ్ నటించిన గని రేపు విడుదల నేపథ్యంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో వరుణ్ మాట్లాడాడు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ ఓ ట్రెండ్ సెట్ చేశారు. తాను ఫాలో అవుతున్నాని చెప్పాడు. తమ్ముడు సినిమా …

Read More »

తెలంగాణలో కోకాకోలా రూ. 1,000 కోట్ల పెట్టుబడులు- మంత్రి కేటీఆర్

కోకాకోలా సంస్థ గురించి కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేద‌ని, 25 ఏండ్లుగా మంచి సేవ‌లందిస్తోంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో రూ. 600 కోట్ల పెట్టుబ‌డులు పెట్టడం సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ తెలిపారు. నూత‌న ప‌రిశ్ర‌మ కోసం ఇక్క‌డ 48.53 ఎక‌రాల స్థలాన్ని ప్ర‌భుత్వం కేటాయించింది. మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో హిందుస్థాన్ కోకాకోలా బేవ‌రేజ‌స్ సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం గురువారం నాలుగు ఒప్పందాల‌ను కుదుర్చుకుంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat