rameshbabu
January 21, 2022 NATIONAL, SLIDER
426
అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వ నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.’స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మన …
Read More »
rameshbabu
January 21, 2022 SLIDER, TELANGANA
563
దేశంలో గిరిజనులు, దళితులకు మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు.ఎస్సీ,ఎస్టీలపై ప్రేమ ఉంటే రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. ములుగులో ట్రైబల్ వర్సిటీని ఇంతవరకు కేంద్రం నిర్మించలేదని తెలిపారు. పోడు భూముల సమస్యపై బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపితే కేంద్రం ఎందుకు పెండింగ్లో పెట్టిందో చెప్పాలని ప్రశ్నించారు.
Read More »
rameshbabu
January 21, 2022 ANDHRAPRADESH, SLIDER
739
దేశంలో టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 15-18 ఏళ్ల మధ్య వారిలో ఇప్పటివరకు 52% మందికి తొలి డోసు తీసుకున్నారని కేంద్రం తెలిపింది. టీనేజర్లకు పంపిణీలో ఏపీ టాప్లో ఉంది.. 91% మంది టీనేజర్లకు ఏపీలో వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత 83% మందికి వ్యాక్సిన్తో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో, 71%తో మధ్యప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. 55% మందికి టీకా ఇవ్వడంతో తెలంగాణ 19వ స్థానంలో …
Read More »
rameshbabu
January 21, 2022 SLIDER, TELANGANA
421
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కరోనా టెస్టుల ధరలను తగ్గించింది. గతంలో రూ.499గా ఉన్న కరోనా టెస్టు ధరను రూ.350కి తగ్గించింది. దీంతో తెలంగాణలో కూడా ధరలను తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలంటున్నారు. కాగా తెలంగాణలో కరోనా టెస్టుల కోసం కొన్ని ల్యాబ్లో రూ.500 నుంచి రూ. 2000 వరకు వసూలు చేస్తున్నారు.
Read More »
rameshbabu
January 21, 2022 SLIDER, TELANGANA
585
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,20,215 కరోనా పరీక్షలు చేయగా.. 4,207 కేసులు నమోదయ్యాయి. మహమ్మారి వల్ల ఇద్దరు మృతి చెందారు. నిన్న మరో 1,825 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,633 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 95.75శాతంగా ఉంది.
Read More »
rameshbabu
January 21, 2022 SLIDER, TELANGANA
388
రైల్వే లైన్ల మంజూరులో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోదక్కుమార్ అన్నారు. ‘రాష్ట్రానికి రైల్వే లైన్లు మంజూరు చేయాలి. తెలంగాణ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. దేశంలోని పలు ప్రాంతాల నుంచి TSకు పెద్ద ఎత్తున వలస వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్త రైల్వే లైన్లు అవసరం’ అని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్కు …
Read More »
rameshbabu
January 21, 2022 MOVIES, SLIDER
742
సినిమాలతో స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి నట వారసులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లు హోస్టులుగానూ మంచి ఆదరణ పొందారు. ఇక బాలయ్య ‘అన్ పబుల్’ అయితే సూపర్ సక్సెస్ అయింది. వీరిద్దరిలా అల్లు అర్జున్ కూడా త్వరలో ‘ఆహా’లో ఓ షోను హోస్ట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. కుటుంబ సంస్థ కావడంతో ఇందుకు బన్నీ సుముఖంగా ఉన్నాడట. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »
rameshbabu
January 21, 2022 MOVIES, SLIDER
505
అఖండ మూవీ 103 సెంటర్స్లో 50 రోజులను పూర్తి చేసుకుని విజయపథంలో సాగుతోంది. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అఖండ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటి వరకు రూ.200 కోట్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ RTC క్రాస్రోడ్స్ సుదర్శన్ థియేటర్తో పాటు US, UK, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోనూ 50 డేస్ సెలబ్రేషన్స్ను భారీ ఎత్తున ప్లాన్ చేశారు బాలయ్య ఫ్యాన్స్.
Read More »
rameshbabu
January 21, 2022 ANDHRAPRADESH, SLIDER
682
ఈ ఏడాది పత్తి రైతుల ఇంట సిరుల పంట పండుతోంది. కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ మార్కెట్లో క్వింటాలు పత్తి తాజాగా గరిష్ఠంగా రూ.10,521 పలికింది. ఇది దేశంలోనే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు తెలిపాయి. వర్షాలకు పంట నష్టపోవడంతో స్పిన్నింగ్ మిల్లుల్లో దూది కొరత ఏర్పడింది. దీంతో ‘ వ్యాపారుల మధ్య పోటీ ఏర్పడి ధర పెరుగుతోంది. మంచి ధర వస్తుండటంతో అన్నదాతల ముఖాల్లో ఆనందం కన్పిస్తోంది.
Read More »
rameshbabu
January 21, 2022 NATIONAL, SLIDER
510
వాహనదారులపై మళ్లీ పెట్రో పిడుగు పడనుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 4 వారాల్లో ఏకంగా 25 శాతం పెరిగి ఏడేళ్ల గరిష్ఠానికి చేరుకుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ చుక్కలనంటే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. గతేడాది దేశంలో పెట్రోల్ లీటర్ రూ.110 దాటడంతో వాహనదారులు బెంబేలెత్తారు. తర్వాత కాస్త తగ్గడంతో ఉపశమనం లభించినా.. ఇప్పుడు మళ్లీ రేట్లు పెరిగితే సామాన్యులపై భారం తప్పదు.
Read More »