Classic Layout

Big Boss హౌస్ నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్

ఊహించినట్టే 13వ వారంలో Big Boss హౌస్ నుంచి ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయింది. అయితే షో నుంచి వెళ్లిపోతున్నానన్న బాధ కంటే మానసు దూరమవుతున్నానన్న బాధే ఆమెలో ఎక్కువ ఉన్నట్లు కనిపించింది. మరోవైపు పింకీ వారానికి రూ.1.75 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. దీంతో మొత్తంగా 13 వారాలకు దాదాపు రూ.25 లక్షలు వెనకేసుకున్నట్లు తెలుస్తోంది.

Read More »

తులసి ఆకులతో లాభాలు ఎన్నో..?

తులసి ఆకులతోపాటు గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్.. రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. దీంతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అలాగే తులసి గింజల్లో ప్రొటీన్స్, ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటి వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్ధకం దూరం అవుతుంది. ఈ గింజలు తింటే ఆకలి అనుభూతి తగ్గి బరువు కూడా తగ్గే అవకాశం …

Read More »

మీకు జుట్టు రాలడం సమస్యగా ఉందా..?

ఈ రోజుల్లో జుట్టు రాలడం చాలామందికి ప్రధాన సమస్యగా మారింది. అయితే, జుట్టు సమస్యలకు ఉసిరి చెక్ పెడుతుంది. కురులు తెల్లబడకుండా, సన్నబడకుండా, చుండ్రు రాకుండా, చిట్లి పోకుండా ఉండేందుకు పోషణనిస్తుంది. ఇందుకోసం పరగడుపునే ఉసిరికాయలు తినాలి. నాన్-సీజన్లో ఎండబెట్టిన ఉసిరి, మురబ్బా తీసుకోవాలి. ఉసిరి పచ్చడి తిన్నా పోషకాలు అందుతాయి. ఇందులోని విటమిన్-C.. పొటాషియం, సోడియం, ఐరన్ మీ జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి.

Read More »

ఉదయాన్నే నిద్రలేవగానే ఇవి చేయకూడదు

ఉదయాన్నే నిద్రలేవగానే కొన్ని చూడకూడదని అంటారు పెద్దలు. కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేసినా.. మరికొందరు సీరియస్ గానే పట్టించుకుంటారు. ఇక, వాస్తు శాస్త్రం ప్రకారం.. … నిద్ర లేవగానే పాడైపోయిన వాచీ చూడకూడదు లేచిన వెంటనే అద్దంలో చూసుకోవడం అశుభం ఉదయమే శుభ్రపర్చని పాత్రలు చూస్తే.. ఆర్థిక సమస్యలు వస్తాయట జంతువుల్ని చూడటం కూడా మంచిది కాదట . నిద్రలేవగానే నీడను చూసుకోవద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది

Read More »

అన్నం తిన్నాక ఇది చేయకూడదు..?

చాలామంది ఆహారం తీసుకోగానే అది అరగడానికి నడుస్తుంటారు. అయితే, ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సో.. తిన్న వెంటనే నడవడం సరికాదట. భోజనం తర్వాత శరీరం ఆహారాన్ని జీర్ణం చేసేందుకు ఎక్కువ శక్తిని వాడుతుంది. అందుకే ఆ సమయంలో ఎక్కువ శక్తిని ఉపయోగించే పనులు ఏవీ చేయకూడదు. అలా చేయడం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. తప్పనిసరైతే కాస్త నెమ్మదిగా నడవాలని చెబుతున్నారు నిపుణులు.

Read More »

రోజూ నిద్ర తగ్గినా..ఎక్కువ అయినా.?

ప్రతి రోజూ పోవాల్సిన నిద్ర కంటే నిద్ర తగ్గినా, ఎక్కువ అయినా వీర్యకణాలపై ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 6 గంటల కంటే తక్కువ, 9 గంటల కంటే ఎక్కువసేపు పడుకునే వారిలో వీర్యం క్వాలిటీ పడిపోవడం గుర్తించారట. 7-8 గంటల సేపు నిద్రపోయేవారిలో స్పెర్మ్ నాణ్యత బాగా ఉంటున్నట్లు తేలింది. ఆలస్యంగా నిద్రపోవడం, విశ్రాంతి లేకపోవడం వల్ల వీర్యకణాలు దెబ్బతింటున్నాయట. పడుకునే 2 గంటల ముందు భోజనం …

Read More »

Carona థర్డ్ వేవ్ కి కారణం ఇదే..?

సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న కాలేజీల్లో ఫెస్ట్ లు ఊపందుకున్నాయి. వీటిలో విద్యార్థులెవరూ కనీసం మాస్కులు ధరించకుండా పాల్గొనడమే వైరస్ వ్యాప్తికి కారణంగా తెలుస్తోంది. ఇటీవల కర్ణాటకలోని ఓ మెడికల్ కాలేజీలో 280 మందికి కరోనా సోకగా.. తాజాగా కరీంనగర్లో ప్రైవేటు మెడికల్ కాలేజీలో 43 మంది వైరస్ బారిన పడ్డారు. అందుకే విద్యాలయాల్లో కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

Read More »

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై సంచలన విషయాలు

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశమంతా విస్తరించే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ డా. మనీంద్ర అగర్వాల్ అన్నారు. దీంతో జనవరి లేదా ఫిబ్రవరి నెల లో థర్డ్ వేవ్ వచ్చే సూచనలు ఉన్నాయన్నారు. మరోవైపు వచ్చే 6 వారాలు చాలా కీలకమని తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. స్వల్ప లక్షణాలు ఉండటం కాస్త ఉపశమనం కలిగించే విషయమని, కరోనా నిబంధనలు పాటిస్తే బయటపడొచ్చన్నారు. …

Read More »

దేశంలో కొత్తగా 8306 కరోనా కేసులు

ఇండియాలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య సగటున 10 వేలకు మించడం లేదు. ఇతర ప్రపంచ దేశాలైన యూరోపియన్ దేశాలు, రష్యాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.అక్కడ రోజుకు సగటున 30 వేల కన్నా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 130 కోట్లకు పైబడిన జనాభా ఉన్న ఇండియా లాంటి దేశంలో రోజుకు 10 వేల లోపు కేసులు నమోదవ్వడం శుభసూచికం. కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల …

Read More »

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మాస్క్ ధ‌రించ‌క‌పోతే రూ. 1,000 జ‌రిమానా

ద‌క్షిణాఫ్రికాలో బ‌య‌ట‌ప‌డ్డ ఒమిక్రాన్ వేరియంట్ ఇప్ప‌టికే 24 దేశాల‌కు విస్త‌రించిన నేప‌థ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. నిన్న యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వ‌చ్చిన ఓ 35 ఏండ్ల మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింద‌ని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, త‌ప్ప‌నిస‌రిగా మాస్కు ధ‌రించాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మాస్కు ధ‌రించ‌క‌పోతే నేటి నుంచి పోలీసులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat