rameshbabu
May 27, 2021 NATIONAL, SLIDER
990
దేశంలో మొత్తం బ్లాక్ ఫంగస్ కేసుల్లో 65% ఐదు రాష్ట్రాల్లో ఉన్నాయని కేంద్రం తెలిపింది. గుజరాత్లో 2,859, మహారాష్ట్రలో 2,770, APలో 768, మధ్యప్రదేశ్లో 752, తెలంగాణలో 744 కేసులు ఇప్పటివరకు నమోదైనట్లు పేర్కొంది. ఈ చికిత్సకు ఉపయోగించే యాంపోటెరిసిన్-B ఇంజక్షన్లను ఆయా రాష్ట్రాలకు అదనంగా సరఫరా చేస్తున్నట్లు కేంద్రమంత్రి సదానందగౌడ తెలిపారు. APకి ఇప్పటివరకు 1930, తెలంగాణకు 1890 వయల్స్ ను కేంద్రం అందించింది.
Read More »
rameshbabu
May 27, 2021 NATIONAL, SLIDER
894
తమిళనాడు మంత్రి పీకే శేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశానికి చెందిన వారు, తమిళనాడులో ఉంటూ ధనవంతులుగా మారారని, దానికి కారణం తమపార్టీనే అని వ్యాఖ్యానించారు. కానీ, వారు బీజేపీకి ఓటు వేశారని మండిపడ్డారు. వారు EVMల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవచ్చని బెదిరించారు. ఈ వ్యాఖ్యలు CM స్టాలిన్కు తలనొప్పులు తెచ్చిపెట్టేవేనని నిపుణులు అంటున్నారు.
Read More »
rameshbabu
May 27, 2021 SLIDER, SPORTS
1,791
ఐసీసీ వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండు, మూడు స్థానాలను నిలబెట్టుకున్నారు. పాకిస్థాన్ బ్యాట్స్మన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే ఆల్ రౌండర్ల జాబితాలో బంగ్లా ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు.
Read More »
rameshbabu
May 27, 2021 LIFE STYLE, SLIDER
1,463
మెంతి తినడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం * గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. * శరీరంలో కొవ్వు తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి * అధిక బరువు తగ్గుతారు *లివర్ సమస్యలను నివారిస్తుంది. * మలబద్ధకం తగ్గుతుంది * చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది * డయాబెటిస్ అదుపులో ఉంటుంది. * జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి
Read More »
rameshbabu
May 27, 2021 ANDHRAPRADESH, SLIDER
1,040
ఏపీ కరోనా బులెటిన్ ను ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది.ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 91,120 శాంపిల్స్ను పరీక్షించగా.. 18,285 పాజిటివ్ కేసులు వచ్చాయి. 99 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 16,27,390కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 10,427 మంది మృతి చెందారు. 14,24,859 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాల్టి వరకు రాష్ట్రంలో 1,88,40,321 సాంపిల్స్న టెస్ట్ …
Read More »
rameshbabu
May 27, 2021 SLIDER, TELANGANA
692
కరోనా కట్టడి కోసం విధించిన లాక్డ్ డౌన్ మంచి ఫలితాలను ఇస్తోంది. గత 24 గంటల్లో 91 వేల కొవిడ్ పరీక్షలు చేయడం జరిగింది.. ఇందులో 3,762 మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు వెల్లడించారు. మరో 20 మంది కరోనాతో మృతి చెందారని పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు గణనీయంగా 4.1 శాతానికి తగ్గిందని, మరణాల రేటు 0.56 శాతంగా ఉందని ఆయన …
Read More »
rameshbabu
May 27, 2021 LIFE STYLE, SLIDER
1,140
మ్యాంగో తిన్నాక.. ఇవి అస్సలు వద్దు సమ్మర్లో మామిడి పండ్లు చాలా స్పెషల్. అయితే, మ్యాంగో తిన్నాక కొన్ని తినొద్దని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లు తిన్న వెంటనే పెరుగు తినడం మంచిది కాదు. మిరపకాయలు, కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినకండి. మామిడి తిన్న వెంటనే కూల్డ్రింక్స్ తాగడం హానికరం. మ్యాంగో తిన్న వెంటనే.. నీరు తాగడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ ఏర్పడతాయి.
Read More »
rameshbabu
May 27, 2021 MOVIES, SLIDER
719
వరుస అవకాశాలతో హీరోయిన్ కీర్తి సురేష్ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో మహేష్ బాబుతో సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్న కీర్తికి తాజాగా మరో ఆఫర్ వచ్చిందట. తమిళ స్టార్ హీరో విజయ్ తెలుగులో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తుండగా.. ఈ మూవీలో విజయ్కు జోడీగా కీర్తి నటిస్తుందని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కే ఈ సినిమాకు వంశీ పైడిపల్లి డైరెక్టర్ కాగా, నిర్మాతగా వ్యవహరిస్తారని …
Read More »
rameshbabu
May 27, 2021 SLIDER, TELANGANA
770
తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 28 నుంచి జర్నలిస్టులందరికీ వ్యాక్సినేషన్ అందించనున్నది.. I&PR ద్వారా జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అటు రాష్ట్రంలో ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200కు పెంచేందుకు ఆమోదం చెప్పిన ప్రభుత్వం.. జూడాలు విధుల్లో చేరాలని మరోసారి కోరింది.
Read More »
rameshbabu
May 27, 2021 NATIONAL, SLIDER
892
దేశంలో వ్యాక్సినేషన్ కొరతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఎందుకు టీకాలు కొనడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ పాకిస్తాన్ దేశంపై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా? సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా? అంటూ మండిపడ్డారు. ఇతర దేశాల లాగా కాకుండా దేశంలో 6 నెలలు ఆలస్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు.
Read More »