Classic Layout

దేశంలో వేగంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ

దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కొనసాగుతోంది. 2021 6న ఈ ప్రక్రియ ప్రారంభమవగా.. ఇప్పటివరకు 2,09,22,344 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో 71 లక్షల మందికి తొలి డోసు అందించారు.. మరో 37 లక్షల 54 వేల మందికి రెండు డోసులు పూర్తయ్యాయని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 14 లక్షల 24 వేల మందికి టీకా ఇచ్చామని పేర్కొంది.

Read More »

మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో విషాదం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు  టీడీపీకి చెందిన యువనేత మాగంటి రాంజీ(37) కన్నుమూశాడు. రాంజీ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో చేర్పించారు. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాంజీ మృతికి నారా లోకేష్ తో పాటు పలువురు టీడీపీ  నేతలు సంతాపం తెలిపారు

Read More »

రెండు కండ్లు ఒకే చూపు – తెలంగాణ ముద్దుబిడ్డలు పీవీ, కేసీఆర్‌

తెలంగాణ ముద్దు బిడ్డలలో ఒకరు దేశ ప్రధానిగా చరిత్ర సృష్టిస్తే మరొకరు ఉద్యమ నాయకుడిగా విజయం సాధించి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్రాత్మక పాత్ర నిర్వహిస్తున్నారు. రాజకీయ నేపథ్యాలు, నిర్వహించిన పదవులు వేరైనా ఇరువురి ఆలోచనల్లో, కార్యాచరణలో సారూప్యం ఉన్నది. ఇరువురి ఆకాంక్ష పేదల కన్నీరు తుడవడమే. వివిధ సందర్భాలలో ప్రధానిగా పీవీ ప్రసంగాలు, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఆచరణ గమనిస్తే, భావసారూప్యం ఎంతగా ఉందో తెలిసిపోతుంది. పీవీ ప్రధాని పదవి చేపట్టే …

Read More »

ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల రేట్లు

కరోనా వేళ కుటుంబ ఆదాయం భారీగా తగ్గిందనేది వాస్తవం. పెరిగే ధరలతో ప్రజలు సతమతమవుతున్నారు 2020తో పోల్చితే అన్నిరకాల నూనెల ధరలు 40-60% (రూ.150/లీ) వరకు పెరిగాయి. నిత్యావసరాల రేట్లు అయితే రోజురోజుకు మండిపోతున్నాయి రిటైల్ మార్కెట్లో KG కందిపప్పు-రూ.100 చింతపండు-రూ.200, పెసరపప్పు-రూ.120 మినపప్పు-రూ.115, ఉల్లి, చక్కెర-రూ.40 పామాయిల్-రూ.120/లీ ఉండటంతో కొనుగోళ్లు తగ్గాయని వ్యాపారులు ఆవేదన పడుతున్నారు.

Read More »

పార్టీ మనకు అండగా నిలబడుతుంది-ఎమ్మెల్యే అరూరి…

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నిర్మాణానికి కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46,47డివిజన్ల పార్టీ నాయకులు, కార్యకర్తలతో గోపాల్ పూర్ లో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పార్టీ పాటిష్టానికి కార్యకర్తలే కీలకం. బలమైన పార్టీ నిర్మాణానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు …

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు-మంత్రి హారీష్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళ సోదరి మణులకు మంత్రి హరీష్ రావు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ..ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక సమాజ వికాసానికి నిజమైన కొలమానం.. ఆ సమాజంలోని మహిళాభివృద్ధి స్థాయి మాత్రమేనని అంబేద్కర్ మహాశయుడు చెప్పారని . ఆయన మాటలు మననం చేసుకుంటు మహిళల వికాసానికి, భద్రతతకు, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ప్రభుత్వం అనేక …

Read More »

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్

జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వ కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చనిపోయిన జర్నలిస్టుల పిల్లలను రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదివిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆదివారం నగరంలోని జలవిహార్‌లో టీయూడబ్ల్యూజే సభ్యులతో జరిగిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటున్నానని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు అడ్డుంకులున్నాయని వాటిని కూడా చూస్తానని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ లేనిదే టీకాంగ్రెస్‌, టీబీజేపీ ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. …

Read More »

వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్

ర‌ంగారెడ్డి – హైద‌రాబాద్ – మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌భ‌ద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి సుర‌భి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దోమ‌ల‌గూడ‌లోని పింగ‌ళి వెంక‌ట‌రామిరెడ్డి హాలులో ఏర్పాటు చేసిన‌ పీవీ వాణిదేవీ స‌మ‌న్వ‌య స‌మ్మేళ‌నంలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ స‌మావేశంలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు ర‌మ‌ణాచారి, ఎంపీ కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, ఎమ్మెల్సీ పురాణం స‌తీష్‌తో పాటు ప‌లువురు …

Read More »

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూములకు పెండింగ్‌ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్‌ లో ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది.ఆధార్‌ నంబర్‌ అనుసంధానంలో లోపాలు, పేర్లు, భూ విస్తీర్ణం తప్పుగా నమోదవడం, సర్వే నంబర్‌ కనిపించకపోవటం తదితర 9 రకాల సమస్యలకు పరిష్కారం చూపేలా ఆప్షన్‌ ను అందుబాటులోకి తెచ్చింది. బాధితులు వారి సమస్యల పరిష్కారం అవడం కోసం మీసేవ ద్వారా అప్ప్లై చేసుకొని సంబంధిత ధ్రువపత్రాలను జత చేయాలి. …

Read More »

ప్రభాస్ పై శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సలార్’ మూవీలో అవకాశం దక్కించుకుని మళ్లీ రేసులోకి వచ్చింది శృతిహాసన్. ఈ నేపథ్యంలో డార్లింగ్ ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సలార్ లో నేను యాక్షన్ సీన్స్ చేస్తున్నానని వచ్చే వార్తల్లో నిజం లేదు. నాకు ఫైట్ సీన్స్ ఉండవు. ఇంకా ప్రభాస్ మూవీలో అవకాశం రావడం చాలా సంతోషాన్నిచ్చింది. ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. చాలా మంది అలా నటిస్తారు. కానీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat