తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు పన్నెండు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెల్సిందే. తాజాగా మిగతా ఆరుగురు మంత్రులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ఆరు మంత్రి పదవులబు దాదాపు పదిహేను మంది పోటి పడుతున్నారు. వీరిలో షబ్బీర్ ఆలీ, ఫిరోజ్ ఖాన్,వివేక్,వినోద్,మల్ రెడ్డి రంగారెడ్డి,అంజన్ కుమార్ యాదవ్, మైనంపల్లి హన్మంతరావు,మధుయాష్కీ గౌడ్,అద్దంకి దయాకర్,బాలు నాయక్ …
Read More »TimeLine Layout
December, 2023
-
8 December
పవన్ పై మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కాంట్రాక్ట్ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అమర్నాథ్ ఆరోపించారు. తెలంగాణలో జనసేనకు వచ్చిన ఓట్లు చూసి పవన్ కు మతి చలించిందని ఎద్దేవా చేశారు. ‘పవన్ ఏ ఊరు? ఏ నియోజకవర్గం? పార్టీ లక్ష్యం ఏంటి? బాపట్ల, చీరాల, నెల్లూరు అంటూ తన జీవితాన్ని నటనలో కలిపేశాడు. బీజేపీతో అధికారికంగా, టీడీపీతో అనధికార ఒప్పందం చేసుకున్నాడు’ అని ఆయన మండిపడ్డారు.
Read More » -
8 December
రవితేజ అభిమానులకు బ్యాడ్ న్యూస్
ప్రముఖ హిట్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజు రవితేజ చేయాల్సిన సినిమా ఆగిపోయినట్లు వార్తలొస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇదే కథను హిందీలో సన్నీ డియోల్తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గదర్-2తో ఈ ఏడాది బిగ్ హిట్ అందుకున్న సన్నీకి గోపి ఇప్పటికే కథ వినిపించారట. స్టోరీ లైన్కు గ్రీన్ సిగ్నల్ రావడంతో స్క్రిప్ట్ మార్పులు చేస్తున్నారని సినీవర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక …
Read More » -
8 December
త్వరలోనే పెళ్లి చేసుకుంటా
సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ త్వరలో పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నానితో జంటగా తాను నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం ప్రదర్శితమవుతున్న అమెరికాలోని ఓ థియేటర్ ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఓ అభిమాని.. ‘మీకు పెళ్లైందా?’ అని ప్రశ్నించాడు. దీనికి ఆమె త్వరలోనే చేసుకుంటానని సమాధానమిచ్చారు. కాగా మృణాల్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది.
Read More » -
8 December
దివ్యాంగురాలు రజినీకి జీతం ఎంతో తెలుసా..?
తెలంగాణ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం కల్పిస్తూ సంతకం చేసిన విషయం తెలిసిందే. ఆమెకు అగ్రికల్చర్ & కోఆపరేషన్ డిపార్ట్మెంటులో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం ఇచ్చారు. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ ఏజెన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్గా ఆమె విధులు నిర్వర్తించనున్నారు. ఆమె నెలకు రూ.50,000లు జీతం అందుకోనున్నారు.
Read More » -
8 December
ఈనెల 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకం అమలుతో రోజుకు సగటున రూ.4కోట్ల రాబడి తగ్గే అవకాశం ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీకి సగటున రోజుకు రూ.14కోట్ల రాబడి వస్తోంది.. ప్రయాణికుల్లో దాదాపు 40 శాతం మంది మహిళలు ఉంటున్నారని చెప్పారు. …
Read More » -
8 December
ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయమై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి సీఎం రేవంత్ సమాచారం అందించారట. ఒకవేళ అందుకు ఒవైసీ అంగీకరిస్తే అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్గా డిసెంబరు 9న అసెంబ్లీ కార్యకలాపాలు నిర్వహిస్తారు. దీనిపై …
Read More » -
8 December
తెలంగాణ అసెంబ్లీ తొలి దళిత స్పీకర్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కు కాంగ్రెస్ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. 2008 (ఉపఎన్నిక), 2009 ఎన్నికల్లో ఆయన వికారాబాద్ నుంచి ఎమ్మెల్యే గా గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కిరణకుమార్ రెడ్డి, రోశయ్య మంత్రివర్గంలో పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లో ఓడిన ఆయన 2022లో టీపీసీసీ కార్యనిర్వాహక కమిటీ సభ్యునిగా …
Read More » -
8 December
ప్రజా భవన్ లో ప్రజా దర్భార్ -వేలాదిగా తరలివచ్చిన జనం
టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన తొలి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయం జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్భార్ మొదలైంది. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.. డిప్యూటీ సీఎం విక్రమార్క ఆధ్వర్యంలో పలు శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో ప్రజాదర్భార్ కొనసాగుతుంది. ఈ ప్రజా దర్భార్ కు రాష్ట్ర నలుమూలాల నుండి వేలాది ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలో తమకు …
Read More » -
8 December
ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కోదండరామ్
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వంలో టీజేఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ కోదండరామ్కు కీలక పదవి దక్కనున్నట్లు తెలిసింది. ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. కోదండరామ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ దృష్ట్యా ప్రభుత్వ పాలనలో ఆయన సహకారం తీసుకోవాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిజానికి ఎన్నికలకు …
Read More »