TimeLine Layout

June, 2020

  • 9 June

    ఏపీలో అవినీతి లేదు-సీఎం జగన్

    ఏపీలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఎలాంటి అవినీతికి చోటు లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు.సీఎం జగన్ మాట్లాడుతూ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తరుణంలో ఎలాంటి అవినీతి జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు,పించన్ అందాలని ఆదేశించారు.ఎలాంటి స్పష్టమైన కారణాలు లేకుండా రేషన్ కార్డులను తొలగించవద్దు. దరఖాస్తులను తిరస్కరించవద్దు అని సూచించారు .తొమ్మిది నెలల్లోనే గత ఎన్నికల్లో …

    Read More »
  • 9 June

    వెన్నుపోట్లు,గాడిద గుడ్లు నాకర్ధం కావు

    ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావును వెన్నుపోటు పొడిచి పార్టీని,అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు విమర్శలు ఉన్న సంగతి విదితమే. దీనిపై ఒక ప్రముఖ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వూలో టీడీపీ నేత,ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు.ఆయన మాట్లాడుతూ ” వెన్నుపోట్లు,గాడిద గుడ్లు నాకర్ధం కాదు.అప్పుడు అందరం కల్సి పార్టీని బతికించుకోవడానికి అలా …

    Read More »
  • 9 June

    వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత

    ఏపీ అధికారక పార్టీ వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ బాగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీకి వరుస షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వంపై ఆ పార్టీ అధినేత విమర్శలు, ఆరోపణలతో బిజీ బిజీగా ఉంటే..మరోవైపు పార్టీకి చెందిన కీలక నేతలు జంప్ అవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత శిద్ధా రాఘవరావు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుతం శిద్ధాతో పాటు ఆయన …

    Read More »
  • 9 June

    తెలంగాణ బాటలో తమిళనాడు

    పదో తరగతి పరీక్షల విషయంలో తమిళనాడు ప్రభుత్వం తెలంగాణను అనుసరించింది. తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులకు పంపిస్తామని, విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా పరిగణిస్తున్నామని సీఎం ప్రకటించారు. త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్షల ఫలితాల ఆధారంగా 80 శాతం మార్కులు, హాజరు ఆధారంగా మరో 20 శాతం మార్కులు కేటాయిస్తామని చెప్పారు.

    Read More »
  • 9 June

    సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతూ రాజమౌళి ట్వీట్..!

    తెలంగాణలో సినిమా షూటింగ్ లకు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతినిస్తూ, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై దర్శక దిగ్గజం రాజమౌళి స్పందించారు. ” మా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నందుకు, షూటింగ్‌ తదితర కార్యకలాపాలు ప్రారంభించుకోవడానికి అనుమతించినందుకు సీఎం కేసీఆర్‌ గారికి కృతజ్ఞతలు. అలాగే, సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లో కీలక పాత్ర పోషించిన మంత్రి తలసానికి ధన్యవాదాలు. కోవిడ్‌-19పై ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత …

    Read More »
  • 8 June

    కేంద్రం సంచలన నిర్ణయం..కరోన కట్టడి కోసం ఆ రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే

    దేశవ్యాప్తంగా కొన్ని నగరాలు, పట్టణాల్లో కొవిడ్‌-19 పరిస్థితి దారుణంగా ఉండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటింటి సర్వే చేపట్టడం, వెంటనే పరీక్షలు నిర్వహించడం, వైరస్‌ వ్యాప్తి, మరణాలను కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించింది. పది రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో 45 స్థానిక సంస్థలకు ఈ మేరకు దిశానిర్దేశం చేసింది. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్‌, వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్‌తో కేంద్ర ఆరోగ్యశాఖ …

    Read More »
  • 8 June

    తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది.ఇందులో భాగంగా సోమవారం రాష్ట్రంలో కొత్తగా 92 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా మరో ఐదుగురు మృతిచెందారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌ విడుదల చేసింది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3742 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 142 మంది మృతిచెందారు. గత కొద్దిరోజులతో పోలిస్తే ఈ రోజు తక్కువ కేసులు నమోదవ్వడం కాస్త ఉరటనిచ్చే …

    Read More »
  • 8 June

    ఆర్ఆర్ఆర్ మూవీలో శ్రియ

    తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’.. దీనిలో కథానాయిక శ్రియ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే అంశం గురించి ఈ ముద్దు గుమ్మ సోషల్‌మీడియాలో లైవ్‌లో తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో వెల్లడించారు.‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా గురించి ఆమె ప్రస్తావిస్తూ ‘ఇందులో నా పాత్ర భావోద్వేగంతో కూడుకుని ఉంటుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపిస్తా. …

    Read More »
  • 8 June

    తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు

    పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ఎలాంటి పరీక్షలూ నిర్వహించకుండానే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు పదో తరగతి పరీక్షలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి …

    Read More »
  • 8 June

    అందరికీ కరోన టెస్టులు ఎలా సాధ్యం

    కరోనా రోగుల చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ఎంతమందికైనా చికిత్స చేసే సామర్థ్యం ప్రభుత్వ ఆస్పత్రులకు ఉందని ఆయన వెల్లడించారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌పై అధికారులతో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వైరస్‌ నివారణకు తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు. రోగులకు చికిత్స, సదుపాయాలపై …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat