”కరోనా” ఈ పేరు చెప్తే చాలు నేడు ప్రపంచమే గడగడలాడిపోతుంది.మానవ మనుగడను ప్రశ్నిస్తున్నది కరోనా వైరస్.ఎంతో బలమైన దేశాలు సైతం ఈ వైరస్ బారినపడి కకావికలం అవుతున్నాయి.చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు అన్ని దేశాలకి విస్తరిస్తూ వైద్య రంగానికి సవాల్ గా నిలుస్తుంది.మందులేని రోగం కావడంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రపంచ దేశాలు నేడు గడగడలాడుతున్నాయి..కరోనా వైరస్ విషయంలో నిర్లక్యానికి మూల్యం ఎలా ఉంటుందో నేడు …
Read More »TimeLine Layout
April, 2020
-
7 April
భారత్ కు ట్రంప్ వార్నింగ్
అమెరికాలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో హైడ్రాక్సిక్లోరోక్వీన్ మెడిసిన్ను భారత్ తమకు పంపని పక్షంలో ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మలేరియా నివారణకు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందును ఇప్పుడు కోరనా వైరస్ నివారణకు ఉపయోగిస్తుండటంతో… ఆ మందుల ఎగుమతులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఐతే… అమెరికాకు అవసరమయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్లో సగం భారత్ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు భారత్ ఈ …
Read More » -
7 April
మంత్రి కేటీఆర్ ట్వీట్తో జాతీయస్థాయి గుర్తింపు
తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లపై జాతీయస్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని ములుగు జిల్లాలో ఎంతో అంకితభావంతో అమలుచేస్తున్న అంగన్వాడీ టీచర్ను ‘సిటిజెన్ హీరో’గా అభినందిస్తూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ను నీతిఆయోగ్ ప్రశంసించింది. రమణమ్మ లాంటివారిని ‘ఇండియా కరోనా వారియర్స్’గా అభివర్ణించింది. కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం.. అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు ఇచ్చే …
Read More » -
7 April
బ్రిటన్ ప్రధాని జాన్సన్ ఆరోగ్యం విషమం
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం విదితమే. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డ జాన్సన్.. లండన్లోని సెయింట్ థామస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాధి తీవ్రత పెరగడంతో జాన్సన్ను ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బోరిస్ ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రధాని విదేశాంగ సెక్రటరీ డోమినిక్ రాబ్ వెల్లడించారు. మార్చి 27 నుంచి జాన్సన్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి …
Read More » -
7 April
లాక్డౌన్ ఉండాల్సిందే!
రాష్ర్టానికి, దేశానికి కరోనా నుంచి పూర్తిగా విముక్తి లభించాలంటే దేశవ్యాప్తంగా లాక్డౌన్ మరికొంతకాలం కొనసాగాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందుతున్న, వైద్య సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో లేని మనలాంటి దేశానికి లాక్డౌన్ తప్ప గత్యంతరం లేదని స్పష్టంచేశారు. అమెరికా, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల పరిస్థితి మనకు రాకూడదని ఆకాంక్షించారు. లాక్డౌన్ను సడలిస్తే.. పరిస్థితి చేజారిపోతుందని పేర్కొన్నారు. లాక్డౌన్ వల్ల కలిగే ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోగలం కానీ …
Read More » -
7 April
హీరోలు నరేష్, గోపిచంద్ దాతృత్వం
కష్ట సమయాలలో తామున్నామనే భరోసా ఇస్తు మంచి మనసు చాటుకుంటున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటికే చాలా మంది స్టార్స్ భారీ విరాళాలు అందించగా, తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు వీకే నరేష్ ఈ సమయంలో ‘మా’ సభ్యులకు అండగా నిలబడటం తన బాధ్యత అని భావించారు. ఇందులో భాగంగా ఆయన 100 కుటుంబాలని దత్తత తీసుకుని ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 10 …
Read More » -
6 April
లక్ష కుటుంబాలకు అండగా అమితాబ్
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో జీవనాధారం కోల్పోయిన సినీ కార్మికులు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు ఎందరో సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్ లక్ష కుటుంబాలకు తన వంతుగా సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయిస్ కాన్ఫిడరేషన్లో సభ్యులుగా ఉన్న లక్ష మంది రోజువారీ సినీ కార్మికుల కుటుంబాలకు నెలవారీ …
Read More » -
6 April
ఒకపూట భోజనం మానెయ్యాలి-బీజేపీ కార్యకర్తలకు ప్రధాని పిలుపు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు చేస్తున్న పోరులో భారతీయులందరినీ ఏకం చేసేందుకు వివిధ కార్యక్రమాలకు పిలుపునిస్తున్న ప్రధాని మోదీ తాజాగా భాజపా కార్యకర్తలకు మరో టాస్క్ ఇచ్చారు. నేడు భాజపా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొవిడ్పై పోరాడుతున్న వారికి సంఘీబావంగా కార్యకర్తలంతా ఒకపూట భోజనం మానెయ్యాలన్న పార్టీ సూచనను ప్రతిఒక్కరూ ఆచరించాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. పార్టీ జెండా ఆవిష్కరణలో సామాజిక …
Read More » -
6 April
కరోనాతో ఉద్యోగాలకు ముప్పు
మాయదారి కరోనా అన్ని రకాలుగా మనుషుల ఉసురు తీస్తున్నది. వీలైతే బతుకును.. లేకపోతే బతుకుతెరువును మింగేస్తున్నది. కరోనా వైరస్ సృష్టిస్తున్న బీభత్సంతో జన నష్టమే కాదూ.. ఆర్థిక నష్టమూ పెద్ద ఎత్తున వాటిల్లుతున్నది. ముఖ్యంగా భారత్కు కరోనా సెగ గట్టిగానే తగులుతున్నది. అసలే ఆర్థిక మందగమనంతో అల్లాడిపోతున్న దేశ ఆర్థికవ్యవస్థను ఈ మహమ్మారి ఏకంగా మాంద్యంలోకి పడేసింది. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్.. ప్రజల ప్రాణాలను నిలబెడుతున్నా.. …
Read More » -
6 April
యువతపై కరోనా ప్రభావం ఎక్కువ
మేము యువకులం.. కరోనా మమ్మల్ని ఏమీ చేయదు’ అని నిర్లక్ష్యం చేస్తున్నారా? ప్రభుత్వం, వైద్యుల మాటలు పెడచెవిన పెట్టి ఇష్టారీతిగా తిరుగుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీ నిర్లక్ష్యం కరోనా వైరస్ వ్యాప్తికి ఆసరాగా నిలుస్తున్నది. మన దేశంలో కరోనా కాటు యువతరంపైనే ఎక్కువగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ 2వ తేదీ వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 60శాతం కంటే ఎక్కువగా.. 20 నుంచి 49 ఏండ్ల …
Read More »