ఏపీ అమరావతిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వాహనంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు యాక్షన్ మొదలు పెట్టారు. తాళ్లాయపాలెంలో నిందితుడు దున్న నితిన్ ను అరెస్టు చేశారు. అతనే వాహనంపై రాయి విసిరినట్లు పోలీసులు పేర్కొన్నారు. రాజధాని రైతులకు మద్దతు ప్రకటించేందుకు అమరావతి వెళ్తుండగా మూడు రాజధానుల మద్దతుదారులు సత్య కుమార్ వాహనంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More »TimeLine Layout
April, 2023
-
1 April
పాలకూర తినడం మంచిదా..? కాదా..?
మనకు పాలకూర మనకు కొత్తేం కాదు. పప్పులో వేసుకుంటాం. తాలింపు చేసుకుంటాం. తరచూ పాలకూర తింటే చర్మం అందంగా తయారవుతుంది. చర్మ కణాలు మృదుత్వాన్ని పొందుతాయి. చర్మం పొడిబారడాన్ని, ముడతలు పడటాన్ని తగ్గిస్తుంది. పాలకూరలోని మెగ్నీషియం, ఐరన్ జుట్టు రాలిపోకుండా చేస్తాయి. వెంట్రుకలు చిట్లడమూ తగ్గుతుంది. జీర్ణవ్యవస్థకు సహకరించే మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఉదయం పూట గ్రీన్ జ్యూస్గా తీసుకుంటే మరీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. పాలకూర వల్ల …
Read More »
March, 2023
-
31 March
దేశానికే ఆదర్శంగా స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య
తెలంగాణ లో స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య అద్భుతంగా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య పదవ సర్వసభ్య సమావేశం హైదరాబాదులోని శిల్పారామం లో జరిగింది.ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1. 59 లక్షల సంఘాలలోని 5.30 లక్షల సంఘ సభ్యులు …
Read More » -
31 March
వీరసింహారెడ్డి,వాల్తేరు వీరయ్ లను దాటిన దసరా
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా అరుదైన రికార్డు సాధించింది. స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కినెట్టి కలెక్షన్లు రాబడుతోంది. 2023లో నైజాంలో తొలిరోజు ఎక్కువ కలెక్షన్లు ఈ సినిమాకే వచ్చాయి. దసరా మూవీకి రూ.6.78 కోట్లు రాగా రెండో స్థానంలో బాలయ్య వీరసింహారెడ్డి- రూ.6.21 కోట్లు, ఆ తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్య- రూ.6.10 కోట్లు, వారసుడు (తెలుగు)- రూ.1.40 కోట్లు ఉన్నాయి.
Read More » -
31 March
ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు-8మంది అరెస్ట్
గుజరాత్లోని అహ్మదాబాద్ లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు అంటించిన ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘మోదీ హటావో, దేష్ బచావో’ పేరుతో నిందితులు ఈ పోస్టర్లు ముద్రించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, ఇటీవల ఢిల్లీలోనూ ఈ తరహా పోస్టర్స్ గుర్తించిన అధికారులు.. 185 కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు.
Read More » -
31 March
డొనాల్డ్ ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టుకు రంగం సిద్ధమైంది. 2006లో డేనియల్స్ తో ఎఫైర్ నడిపినట్టు ఆరోపణలున్నాయి. ఈ విషయం బయటపెట్టకుండా ఆమెకు లక్షా 30 వేల డాలర్లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇదే ఇప్పుడు ట్రంప్ మెడకు చుట్టుకుంది. అరెస్టు దాకా తీసుకొచ్చింది. ఈ ఆరోపణలు నిజమని న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ తేల్చింది. తాజా పరిణామాలను ట్రంప్ ఖండించారు. తనను కావాలనే వెంటాడుతున్నారని ఆరోపించారు. మరోవైపు ట్రంప్ …
Read More » -
31 March
బాక్సాఫీస్ వద్ద దసరా ఊచకోత
నేచూరల్ స్టార్ హీరో నాని.. జాతీయ అవార్డు గ్రహీత మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఒదేలా దర్శకత్వంలో శ్రీరామనవమి రోజున వచ్చిన తాజా లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ దసరా. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది. నైజాం ఏరియాలో తొలి రోజు రూ.6.78 కోట్లు వచ్చాయి. ఈ ఏడాదిలో ఇవే అత్యధిక వసూళ్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మీడియం …
Read More » -
31 March
రాహుల్ గాంధీపై ఈసీ అనర్హత వేటు
వయనాడ్ ఎంపీ ఎన్నికల్లో పోటీచేసి లెక్కలు సమర్పించని అభ్యర్థిపై ఈసీ అనర్హత వేటు వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై స్వతంత్ర అభ్యర్థి కే.ఇ రాహుల్ గాంధీ పోటీ చేశారు. 2196 ఓట్లు తెచ్చుకున్నారు. అయితే ఎన్నికల ఖర్చుల వివరాలను ఈసీకి సమర్పించకపోవడంతో ఆయనపై అనర్హత వేటు వేసింది. కే.ఇ రాహుల్గాంధీ 2024 సెప్టెంబర్ 13వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఈసీ తాజాగా ప్రకటించింది.
Read More » -
31 March
దేశంలో కరోనా కలవరం
దేశవ్యాప్తంగా కరోనా పాజిటీస్ కేసులు మళ్లీ పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. కొత్తగా 3,095 కరోనా కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో ఐదుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,208కి చేరింది. ఇప్పటి వరకు 5,30,867 మంది కరోనా కారణంగా మరణించగా… ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు పెంచాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది.
Read More » -
31 March
బిగ్ బీ కి సజ్జనార్ సలహా
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బిగ్ బీ అమితాబచ్చన్ తో పాటు పలువురు సెలబ్రిటీలకు కీలక సూచన చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు ప్రజలను నట్టేట ముంచుతున్న సంస్థలకు అడ్వర్ టైజ్మెంట్ ద్వారా సహకరించవద్దని ట్వీట్ చేశారు. ముఖ్యంగా అమితాబ్ ఆమ్వేకు అంబాసిడర్ ఉండటంపై అప్రమత్తం చేశారు. ఇలాంటి సంస్థతో అనుబంధం కొనసాగించవద్దని హితవు పలికారు. కాగా ఇటీవల క్యూనెట్కు యాడ్ చేసిన సానియా మీర్జాకు సైతం సజ్జనార్ ఇదే …
Read More »