తెలంగాణ లో స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య అద్భుతంగా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య పదవ సర్వసభ్య సమావేశం హైదరాబాదులోని శిల్పారామం లో జరిగింది.ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1. 59 లక్షల సంఘాలలోని 5.30 లక్షల సంఘ సభ్యులు స్త్రీ నిధి నుంచి రుణాలు పొందారని తెలిపారు.
స్త్రీ నిధి రుణాల నిలువ ప్రస్తుతం రూ.5,355 కోట్లని,రుణాల నిలువలో 28.20 శాతం వృద్ధి సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు.రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు మన స్త్రీ నిధి ని అమలు చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రూ. 750 కోట్లు వడ్డీ లేని రుణాలను విడుదల చేసిందని పేర్కొన్నారు.