దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఉపరాష్ట్రపతితో పాటు, కేంద్రమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో లాంఛనంగా ఈ కార్యక్రమం సాగింది. 44 ఏళ్ల క్రితం తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేస్తే, ఇప్పుడు తనయుడు అత్యున్నత పీఠాన్ని …
Read More »TimeLine Layout
November, 2022
-
9 November
ఉప్పుతో చర్మ సౌందర్యం ..?
మీ చర్మ సంరక్షణ సాధనాల్లో ఉప్పు ఉందా? లేకపోతే, ఇప్పుడే సముద్రపు ఉప్పును ప్రయత్నించండి. దీనివల్ల తల నుంచి పాదాల వరకూ ఎన్నో ఉపయోగాలు. సముద్రపు ఉప్పులో సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. కొబ్బరినూనెలో కొంత సముద్రపు ఉప్పు కలిపి పెదాలకు రాసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లని నీళ్లతో కడగాలి. ఈ చిట్కాను రోజుకు రెండుసార్లు ప్రయత్నిస్తే చాలు.. పెదాల పగుళ్లను నియంత్రించవచ్చు.రెండు చెంచాల సముద్రపు …
Read More » -
9 November
జాన్వీ కపూర్ కొన్న డూప్లెక్స్ హౌస్ ధర ఎంతో తెలుసా..?
అలనాటి దివంగత అందాల తార శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైన నటి జాన్వీ కపూర్. కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా కొత్త బాటలో పయనిస్తూ బాలీవుడ్లో మంచి అవకాశాలను దక్కించుకుంటోంది. తాజాగా ఆమె నటించిన ‘మిలీ’ చిత్రం నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. కాగా, ఈ బాలీవుడ్ బ్యూటీ తాజాగా అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు ఒక వార్త బీటౌన్లో తెగ చక్కర్లు కొడుతోంది.ముంబై బాంద్రా …
Read More » -
9 November
ఫ్లై ఓవర్, రోడ్ల అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే Kp సమీక్ష
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, దుండిగల్-కొంపల్లి మున్సిపాలిటీలలో సుమారు రూ.205 కోట్లతో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో చేపడుతున్న ఫ్లై ఓవర్, రోడ్ల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండిఏ, మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్బి, ఎస్.ఎన్.డి.పి, అర్బన్ ఫారెస్ట్, టీఎస్పిడిసీఎల్, కన్స్ట్రక్షన్, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ …
Read More » -
9 November
గంగూబాయి గెటప్లో యాంకర్ శ్రీముఖి
బుల్లితెర యాంకర్ శ్రీముఖి రోజుకో ఫోటో షూట్తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఈ రాములమ్మ గంగూబాయి గెటప్లో ఆకట్టుకుంటోంది. వేశ్య అయిన గంగూబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది గంగూబాయి కఠియావాడి సినిమా. ఈ మూవీలో ఆమె పాత్రలో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది ఆలియాభట్. ఆ మధ్య మెగా డాటర్ నిహారికా కూడా ఓ పార్టీకి గంగూబాయి గెటప్లో అలరించింది. తాజాగా …
Read More » -
9 November
చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత భరోసా
చదువుల తల్లి హారికకు ఎమ్మెల్సీ కవిత భరోసా ఇచ్చారు. యూట్యూబ్ ద్వారా క్లాసులు విని ఎంబీబీఎస్ సీటు సాధించిన నిజామాబాద్ జిల్లా లోని నాందేవ్గూడకు చెందిన హారికకు అండగా నిలిచారు. ఎంబీబీఎస్ సీటు సాధించినప్పటికీ ఆర్థిక స్తోమత లేని కారణంగా కాలేజీలో చేరని పరిస్థితి ఉన్న విషయాన్ని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్న కవిత తక్షణమే స్పందించారు. నిజామాబాద్ పర్యటన సందర్భంగా హారికను కలిసిన ఆమె ఎంబీబీఎస్ కోర్సును పూర్తి …
Read More » -
9 November
క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు బీజేపీ టికెట్!
గుజరాత్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఎన్నికలు కానందున యావత్ దేశ రాజకీయాలనే ఆకర్షిస్తున్నాయి. ఈ తరుణంలో తమ పార్టీ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది అధికార బీజేపీ. ఈ తుది జాబితాలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రీవాబా జడేజాకు టికెట్ ఇచ్చారని తెలుస్తోంది. మరో వైపు బీజేపీను ఓడించేందుకు ఆప్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రీవాబా …
Read More » -
9 November
ఏపీలో పట్టాలు తప్పిన ట్రైన్.. 9 రైళ్లు రద్దు..!
ఏపీలోని రాజమండ్రి స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పి పక్కకు ఒరిగింది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్కు రాజమండ్రి బాలాజీపేట వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో పలు ట్రైన్లు రద్దు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మత్తులు చేశారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడం వల్ల ఒకే ట్రాక్పై ఇతర రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. …
Read More » -
8 November
డౌట్ లేదు.. అది కూడా చంద్రబాబే కనిపెట్టి ఉంటాడు: వల్లభనేని వంశీ
టీడీపీ ప్రభుత్వం చేయలేని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ అని ఆయన కొనియాడారు. నిడమానూరులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వంశీ మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వంశీ చెప్పారు. సంక్షేమ పథకాలతో పాటు …
Read More » -
8 November
భవిష్యత్లోనూ కమ్యూనిస్టులతో కలిసి వెళ్తాం: జగదీష్రెడ్డి
కమ్యూనిస్టు పార్టీల ప్రచారం వల్లే మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారని మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. భవిష్యత్లోనూ ఐక్యంగా కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్లోని ముఖ్దూం భవన్కు కూసుకుంట్ల, ఎమ్మెల్యే గాదరి కిషోర్తోకలిసి జగదీష్రెడ్డి వెళ్లారు. టీఆర్ఎస్విజయానికి సీపీఐ, సీపీఎం శ్రేణులు కష్టపడ్డాయంటూ ఆ పార్టీ నేతలకు మంత్రి కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి …
Read More »