గుజరాత్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో ఎన్నికలు కానందున యావత్ దేశ రాజకీయాలనే ఆకర్షిస్తున్నాయి. ఈ తరుణంలో తమ పార్టీ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది అధికార బీజేపీ. ఈ తుది జాబితాలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రీవాబా జడేజాకు టికెట్ ఇచ్చారని తెలుస్తోంది. మరో వైపు బీజేపీను ఓడించేందుకు ఆప్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
రీవాబా జడేజా 2016లో రవీంద్క జడేజాను పెళ్లి చేసుకున్నారు. రీవాబా మెకానికల్ ఇంజినీర్ చేశారు. రాజ్పుత్ వర్గానికి చెందిన రీవాబా కర్ణిసేన నాయకురాలు. మూడేళ్ల క్రితం బీజేపీలో చేరారు. ఇక వచ్చేనెల 1, 5 తేదీల్లో రెండు దశల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 8న ఫలితాలు విడుదల అవుతాయి.