TimeLine Layout

August, 2022

  • 25 August

    అనసూయ అలా అనేసిందేంటి.. ఏమైంది?

    ప్రముఖ యాంకర్‌, నటి అనసూయ లేటెస్ట్‌గా చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఎవరినో తెలియదు కానీ.. వాళ్లని ఉద్దేశించి చేసిన కౌంటర్‌ ట్వీట్‌లాగే అది ఉంది. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్ని సార్లు రావటం లేవటవ్వచ్చేమోకాని రావటం మాత్రం పక్కా’ అంటూ అనసూయ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా #NotHappyOnsomeonesSadness but #FaithRestored అనే హ్యాష్‌ట్యాగ్‌లను పెట్టారు. ‘ఇతరుల బాధని చూసి ఆనందపడను.. కానీ నమ్మకం నిజమైంది’ …

    Read More »
  • 25 August

    ఎమ్మెల్యే ఇంట్లో విందు.. రూ. 10 కోట్ల చదివింపులు

    డీఎంకేకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇంట్లో జరిగిన ఫంక్షన్‌లో ఏకంగా రూ.10 కోట్ల చదివింపులు వచ్చాయి. చదివింపుల కోసం 40 కౌంటర్లు ఏర్పాటు చేయించారు ఆ ఎమ్మెల్యే. పుదుకోట్టై, తంజావూరు మొదలైన జిల్లాల్లో వందేళ్లగా చదివింపుల విందు వేడుక నిర్వహిస్తున్నారు. తాజాగా డీఎంకేకు చెందిన పేరావూరణి నియోజికవర్గ ఎమ్మెల్యే అశోక్‌కుమారు తమ మనవడి చెవులు కుట్టే ఫంక్షన్, చదివింపుల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందుకు వెజ్, నాన్ వెజ్ విందు …

    Read More »
  • 25 August

    ఫ్యాన్స్‌తో కలిసి లైగర్ చూసిన విజయ్ – అనన్య పాండే

    పాన్ ఇండియా సినిమాగా రూపొంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన లైగర్‌ను విజయ దేవరకొండ హీరోయిన్‌ అనన్యా పాండేతో కలిసి చూశారు. సిటీలోని సుదర్శన్ థియేటర్‌లో లైగర్ జంటను చూసిన అభిమానులు లైగర్ లైగర్ అంటూ నినాదాలు చేశారు. మరో వైపు థియేటర్ల దగ్గర విజయ్ ఫ్యాన్స్ భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తున్నారు.

    Read More »
  • 25 August

    లైగర్‌లో నాగ్.. లుక్ – యాక్షన్ అదుర్స్..!

      పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేసింది. పాన్ ఇండియాగా రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. తాజాగా లైగర్ చూసిన ప్రతి ఒక్కరూ కింగ్ నాగార్జున లుక్ అదుర్స్ అంటున్నారు. అసలు విజయ్ లైగర్‌కు నాగార్జునకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి. కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు …

    Read More »
  • 25 August

    తెలంగాణలో అత్యధికంగా ఆస్తులున్న ఎమ్మెల్సీ ఎవరో తెలుసా..?

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీల్లో  10 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు ADR నివేదిక వెల్లడించింది. వీరిలో ఎమ్మెల్సీలు కల్వకుంట్ల  కవిత, పాడి కౌశిక్ రెడ్డి, మహమూద్ అలీ, నారాయణరెడ్డి, ప్రకాశ్, కడియం, కోటిరెడ్డి, సత్యవతిరాథోడ్, కృష్ణారెడ్డి, సుఖేందర్ రెడ్డి ఉన్నారు. అయితే అత్యధిక ఆస్తులున్న ఎమ్మెల్సీల్లో యెగ్గె మల్లేశం(రూ.126.83 కోట్లు) తొలిస్థానంలో, కవిత (రూ. 39.79 కోట్లు) 4వ స్థానంలో నిలిచారు. అత్యధిక అప్పులున్న …

    Read More »
  • 25 August

    మళ్లీ పెరిగిన బంగారం ధరలు

    ఈరోజు గురువారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరగడంతో.. రూ. 47,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 పెరగడంతో రూ.51,550గా ఉంది. కిలో వెండి ధర రూ.200 పెరగడంతో రూ.60,900గా ఉంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

    Read More »
  • 25 August

    సూపర్ స్టార్ తో సినిమా చేయాలని ఉంది-రాజమౌళి

    బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీని ప్రముఖ పాన్ ఇండియా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తమిళంలో విడుదల చేస్తున్నాడు. ఈ  మూవీ  ప్రమోషన్లలో భాగంగా చిత్ర యూనిట్ చెన్నైలో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా ఏ తమిళ స్టార్ హీరోకు మీరు డైరెక్షన్ ఏ చేయాలనుకుంటున్నారు? అని పలువురు దర్శకుడు రాజమౌళిని ప్రశ్నించారు. తనకు సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఏదో రోజు …

    Read More »
  • 25 August

    దేశంలో కొత్తగా 10,725 కరోనా పాజిటీవ్ కేసులు

    దేశ వ్యాప్తంగా  గడిచిన గత 24గంటల్లో కొత్తగా 10,725 కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ  గురువారం తెలిపింది. తాజాగా 13,084 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. అయితే ఈ కరోనా  వైరస్‌ కారణంగా 34 మంది ప్రాణాలు వదిలారు. దీంతో తాజా కొత్త కరోనా  కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,43,78,920కి చేరింది. ఇందులో 4,37,57,385 మంది బాధితులు …

    Read More »
  • 25 August

    రాజాసింగ్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలి

    ఒక ఎమ్మెల్యేగా..ప్రజాప్రతినిధిగా ఉంటూ, అత్యంత బాధ్యతారహితంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలకు కారణమయ్యే విధంగా  మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలి అని  సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం చౌకబారు ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పరిపాటిగా మారింది. గతంలో బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్‌ శర్మ చేసిన …

    Read More »
  • 25 August

    నేడు కొంగరకలాన్ కు సీఎం కేసీఆర్

    తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత..ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ రోజు  గురువారం రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా  కొంగరకలాన్‌లో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికోసం ఆయన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నుండి మధ్యాహ్నం 2 గంటలకు   కొంగరకలాన్‌కు చేరుకొంటారు. మొదట సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించి అనంతరం ముఖ్యమంత్రి  అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం కలెక్టరేట్‌ …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat