భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఈరోజు మధ్యాహ్నానికి నీటిమట్టం 60.30 అడుగులకు చేరింది. దీంతో సమీపంలోని లోతట్టు కాలనీలకు వరదనీరు భారీగా చేరడంతో అక్కడ ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.గోదావరికి వరద నీటి ప్రభావం అధికంగా ఉండడంతో భద్రాచలం నుంచి చర్ల, కూనవరం వెళ్లే మార్గాల్లో రావాణా నిలిచిపోయింది. నేటి సాయంత్రం నుంచి గోదావరి బ్రిడ్జ్పై రాకపోకలను అధికారులు నిలిపివేయనున్నారు. దీంతో హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోనున్నాయి. గోదావరి …
Read More »TimeLine Layout
July, 2022
-
14 July
తమిళనాడు సీఎం స్టాలిన్కు అస్వస్థత
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో ఐసోలేషన్లో ఉన్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడక ఈ రోజు చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని హాస్పిటల్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. అలసట, జ్వరంగా అనిపించడంతో కరోనా టెస్ట్లు చేయించుకోగా పాజిటివ్గా వచ్చిందని సీఎం ట్విట్టర్ ద్వారా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్లు ధరించాలని, వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రజలను …
Read More » -
13 July
టీడీపీ గ్రాఫ్ లేవడం లేదు.. అందుకే ఆ సర్వే..: పేర్ని నాని
ఏపీ సీఎం జగన్ గ్రాఫ్ పడిపోయిందనడం విచిత్రంగా ఉందని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని అన్నారు. సెంటర్ ఫర్నేషనల్ స్టడీస్ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్ శర్మదేనని.. అందుకే వాళ్లు అలా నివేదిక ఇచ్చారని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి గ్రాఫ్పెంచుకోవాలని టీడీపీ చూసిందని.. కానీ అలా జరగలేదన్నారు. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ వల్ల గ్రాఫ్ లేవడం లేదని.. టీడీపీని కాపాడుకోవడానికే చేయించిన …
Read More » -
13 July
నెలరోజులకు బొగ్గు నిల్వలు సిద్ధంగా ఉంచండి: కేసీఆర్ ఆదేశం
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో గోదావరి ఉద్ధృతి, వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. విద్యుత్ పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి వస్తున్న వరదను అంచనా వేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా మరో నెలరోజులకు సరిపడా బొగ్గు నిల్వలను సిద్ధం …
Read More » -
13 July
శ్రీలంకలో ఎమర్జెన్సీ.. కనిపిస్తే కాల్చివేతే!
శ్రీలంకలో ప్రజల ఆందోళన రోజురోజుకీ మరింత తీవ్రతరం అవుతోంది. ఇప్పటికే అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇంటిపై దాడి చేసిన నిరసనకారులు.. ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటిపైనా దాడికి యత్నించారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ప్రధాని.. అక్కడి సైనిక దళాల అధిపతులతో చర్చించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించాలని నిర్ణయించారు. గొటబాయ రాజపక్స పరారవ్వడంతో తాత్కాలిక అధ్యక్షుడి హోదాలో రణిల్ విక్రమసింఘే ఈ ప్రకటన …
Read More » -
13 July
హైదరాబాద్లో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీ జరిగింది. మొత్తం 69 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు వ్యవహారం చర్చనీయాంశం అయిన నేపథ్యంలో భారీగా బదిలీల ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. నారాయణగూడ ఇన్స్పెక్టర్గా రాపోలు శ్రీనివాస్రెడ్డి, సైఫాబాద్కు కె.సత్తయ్య, శాలిబండకు జి.కిషన్, బేగంబజార్కు ఎన్.శంకర్, ఆసిఫ్నగర్కు శ్రీనివాస్, రాంగోపాల్పేటకు జి.లింగేశ్వరరావు, మొగల్పురాకు శివకుమార్ను నియమించారు. ఈ మేరకు …
Read More » -
13 July
విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండబోదు : మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తున్నప్పటికీ.. ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఉండబోదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. వందేండ్లలో ఎన్నడూ పడనంత వర్షపాతం నమోదు అయినప్పటికి కనురెప్ప పాటు అంతరాయం లేకుండా సరఫరా అందించిన ఘనత తెలంగాణా విద్యుత్ సంస్థలకే దక్కిందని ఆయన కొనియాడారు. ఇవే వర్షాలు గతంలో పడ్డప్పుడు విద్యుత్ శాఖా అతలాకుతలం అయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.రాష్ట్రంలో కుండపోతగా …
Read More » -
13 July
తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు పొడిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమ, మంగళ, బుధవారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. నేటితో సెలవులు ముగుస్తున్నాయి. కానీ రాష్ట్రంలో వర్షాలు ఏ మాత్రం తగ్గలేదు. అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురు, శుక్ర, …
Read More » -
13 July
తన క్రష్ ఎవరో చెప్పిన బేబమ్మ
ఎనర్జిటిక్ హీరో.. రామ్ హీరోగా ఎన్.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’లో హీరోయిన్గా నటించింది కృతిశెట్టి. ఉప్పెన మూవీ హిట్ అందించడంతో ఈ ముద్దుగుమ్మ సరైన కథలను ఎంపిక చేసుకుంటూ మోస్ట్ సక్సెస్ పుల్ హీరోయిన్ గా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది ఈ సర్పంచ్ నాగలక్ష్మీ.. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ది వారియర్ చిత్రం జూలై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో కృతి …
Read More » -
13 July
తెలంగాణ ఫుడ్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అర్హులకు ఆరోగ్యమైన ఆహారం
మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్ధానంలో వుందని తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్ర్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ కార్యాలయంలో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మేడే రాజీవ్ సాగర్ ను మంత్రి సత్యవతి రాథోడ్ గారు, ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »