TimeLine Layout

May, 2022

  • 26 May

    వైసీపీ మంత్రుల బస్సుయాత్రకు ప్రజల బ్రహ్మరథం

    వైసీపీ మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. గురువారం ఉదయం శ్రీకాకుళంలో ప్రారంభమైన ఈ యాత్ర విజయనగరం మీదుగా విశాఖపట్నం చేరుకుంది. దారి పొడవునా యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగుడుగనా నీరాజనాలు పలుకుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్‌ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని మంత్రులు ఈ యాత్రలో వివరిస్తున్నారు. విజయనగరంలోని న్యూపూర్ణ జంక్షన్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. …

    Read More »
  • 26 May

    మోదీజీ.. ఇది గుజరాత్‌ కాదు.. పోరాటాల గడ్డ తెలంగాణ: హరీశ్‌రావు

    తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ప్రధాని నరేంద్రమోడీకి లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన 8 ఏళ్లలో రాష్ట్రానికి ఇచ్చిందేంటో ఆయన చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ పర్యటనో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు చేసిన నేపథ్యంలో హరీశ్‌రావు స్పందించారు. సిద్దిపేటలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ …

    Read More »
  • 26 May

    రెండు మూడు నెలల్లోనే సంచలన వార్త వింటారు: కేసీఆర్‌

    కాంగ్రెస్‌, బీజేపీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికే సాగునీరు, తాగునీరు, విద్యుత్‌ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు. బెంగళూరులో జనతాదళ్‌ (ఎస్‌) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో ఆయన భేటీ అయ్యారు. వారి నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత వివిధ …

    Read More »
  • 26 May

    తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ప్రధాని మోడీ ధీమా

    కుటుంబ పార్టీలను తరిమికొడితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ వార్షికోత్సవానికి వచ్చిన ఆయన.. బేగంపేట ఎయిర్‌పోర్టు సమీపంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో వేలమంది అమరులయ్యారని.. వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు చెప్పారు. అమరవీరుల ఆశయాలు నెరవేరడం లేదని.. కుటుంబపాలనలో తెలంగాణ బందీ అయిందని  మోడీ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ హవా కనిపిస్తోందని.. అధికారంలోకి వచ్చితీరుతామని ఆయన ధీమా …

    Read More »
  • 26 May

    పవన్‌కు ఆ ప్రొసీజర్‌ కూడా తెలీదు: కొడాలి నాని ఎద్దేవా

    డా.బీఆర్‌.అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వాళ్లను ఈ దేశం నుంచి బహిష్కరించాలని వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడలో ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లను జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చదువుతున్నారని విమర్శించారు. చిన్నపిల్లలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇవ్వడం రాజ్యాంగం ప్రకారం ప్రొసీజర్‌ అని.. అది కూడా పవన్‌కు …

    Read More »
  • 25 May

    అమలాపురం ఘటనల వెనుక టీడీపీ, జనసేన: మంత్రి విశ్వరూప్‌

    అమలాపురం ప్రజానీకం ఎప్పుడూ తప్పుడు ఆలోచనతో లేరని ఏపీ మంత్రి విశ్వరూప్‌ అన్నారు. కోనసీమలోని దళిత సామాజిక వర్గానికి చెందిన వారెవరూ రోడ్లపైకి రావొద్దని.. రౌడీషీటర్ల ఉచ్చులో పడొద్దని కోరారు. అమలాపురంలో ఆందోళనకారులు తగులబెట్టని తన ఇంటిని మంత్రి పరిశీలించారు. గత 50 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ఆందోళలో కొంతమంది రౌడీషీటర్లు చేరారని విశ్వరూప్‌ ఆరోపించారు. అమలాపురంలో జరిగిన ఘటనల వెనుక టీడీపీ, జనసేన నాయకులు ఉన్నారన్నారు. …

    Read More »
  • 25 May

    చంద్రబాబు స్క్రిప్ట్‌నే పవన్‌ చదువుతున్నారు: మంత్రి రోజా

    వైసీపీ పాలనపై బురద చల్లేందుకే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అమలాపురం ఘటనల్లో తప్పు చేసిన వారిని విడిచిపెట్టేదే లేదని ఆమె తేల్చి చెప్పారు. అమరావతిలో రోజా మీడియాతో మాట్లాడారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెడితే ఆందోళనలు చేయడం బాధాకరమని విమర్శించారు. ఈ కుట్రల వెనుక ఎవరున్నారో వాళ్లని బయటకు తీస్తామని చెప్పారు. చంద్రబాబు స్క్రిప్ట్‌నే పవన్‌ కల్యాణ్‌ చదువుతున్నారని.. ప్యాకేజీ తీసుకుని …

    Read More »
  • 25 May

    గౌతమ్‌రెడ్డి మృతి.. ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

    ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనుండగా ఏపీలో ఆత్మకూరు అందులో ఒకటి. ఈ మేరకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. మే 20న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. జూన్‌ 23న ఎన్నికల పోలింగ్ నిర్వహించి జూన్‌ 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. …

    Read More »
  • 25 May

    వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్‌

    వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌ భాస్కర్‌ బాబు (అనంతబాబు)ను ఆ పార్టీ అధిష్ఠానం సస్పెండ్‌ చేసింది. మాజీ డ్రైవర్‌ సుబ్రమణ్యం హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉండటంతో వైకాపా అధినేత, సీఎం జగన్‌ ఆదేశాలతో పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుబ్రమణ్యం మరణానికి తానే బాధ్యుడినంటూ పోలీసులకు అనంతబాబు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్‌ చేశారు.

    Read More »
  • 25 May

    రాజ్యసభకు టీఆర్ఎస్ తరపున దామోదర్‌రావు, పార్థసారధి నామినేషన్‌

    రాజ్యసభకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గంగుల కమలాకర్‌రెడ్డి, మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నామినేషన్లను దాఖలు చేశారు. తెలంగాణ నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు గత మంగళశారం …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat