Home / ANDHRAPRADESH / వైసీపీ మంత్రుల బస్సుయాత్రకు ప్రజల బ్రహ్మరథం

వైసీపీ మంత్రుల బస్సుయాత్రకు ప్రజల బ్రహ్మరథం

వైసీపీ మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. గురువారం ఉదయం శ్రీకాకుళంలో ప్రారంభమైన ఈ యాత్ర విజయనగరం మీదుగా విశాఖపట్నం చేరుకుంది. దారి పొడవునా యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగుడుగనా నీరాజనాలు పలుకుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్‌ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని మంత్రులు ఈ యాత్రలో వివరిస్తున్నారు.

విజయనగరంలోని న్యూపూర్ణ జంక్షన్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు.. ప్రజలకు చేకూర్చిన లబ్ధిని వివరించారు. మంత్రుల బస్సుయాత్ర బహిరంగ సమయంలో చిరుజల్లులు కూడా పడటంతో ప్రజలు పులకించిపోయారు. పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat