‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసి కుర్రకారు హృదయాల్ని దోచుకుంది మంగళూరు సోయగం కృతిశెట్టి. ఎవరికి సాధ్యం కాని చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో యువతరానికి చేరువైంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు చిత్రసీమలో జోరుమీదుంది. భారీ సినిమాల్లో అవకాశాల్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నది. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ మీదనే ఉందని.. మరే ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక లేదని చెప్పిందీ భామ. ముఖ్యంగా ప్రేమ విషయాలకు …
Read More »TimeLine Layout
May, 2022
April, 2022
-
30 April
ముంబయిలో శ్రీవారి ఆలయానికి రూ.500కోట్ల స్థలం..
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని మే 5 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. నడక దారి భక్తులకి దివ్యదర్శనం టికెట్లను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సర్వదర్శనం స్లాట్ విధానాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీవారి ఆలయం లో రెండు కొత్త బంగారు సింహాసనాలు తయారీకి ఆమోదం, పద్మావతి మెడికల్ కాలేజీలో రెండు బ్లాకుల …
Read More » -
30 April
మేం అడ్డుకుంటే బీజేపీ నేతలు తిరగలేరు: బాల్క సుమన్
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వచ్చిన సందర్భంగా శంషాబాద్లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు ప్రవర్తించిన తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం సరికాదన్నారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యే నోముల భగత్తో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. అడ్డుకోవడమే పని అయితే కేంద్రమంత్రి కిషన్రెడ్డి తెలంగాణలో …
Read More » -
30 April
ఘోరం.. సెక్యూరిటీ గార్డును తలకిందులుగా వేలాడదీసి చితకబాదారు!
దొంగతనం ఆరోపణలతో ఓ సెక్యూరిటీ గార్డును కొందరు యువకులు చిత్రహింసలకు గురిచేశారు. తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి చితకబాదారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సివత్ పట్టణానికి చెందిన మహవీర్ను ఎవరూ లేని ప్రదేశానికి కొంతమంది యువకులు తీసుకెళ్లారు. చెట్టుకు వేలాడదీసి కర్రలు, ఇనుపరాడ్డులతో విపరీతంగా దాడి చేశారు. తనను వదిలిపెట్టాలని ఏడ్చినా ఆ యువకులు కనికరం చూపలేదు. అయితే అటుగా వెళ్తున్న ఓ మహిళ …
Read More » -
30 April
టీడీపీ వాళ్లే నాపై దాడి చేయించారు: వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు
జి.కొత్తపల్లిలో వైసీపీ నేతలు తనపై దాడి చేయలేదని..టీడీపీ వాళ్లే వెనకుండి దాడి చేయించారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో తనపై జరిగిన దాడి ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. జి.కొత్తపల్లిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని.. వారి మధ్య వివాదాన్ని రాజీ చేసినట్లు చెప్పారు. వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. హత్యకు గురైన గంజి …
Read More » -
30 April
‘మన ఊరు- మన బడి’ పనులు త్వరగా పూర్తిచేయాలి: మంత్రి సబిత
వేసవి సెలవుల్లో పాఠశాలల పనులను త్వరగా పూర్తిచేయాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులును ఆదేశించారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై మంత్రి సబిత అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశమైంది. అధికారుతో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లిదయాకర్రావు, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ‘మన ఊరు-మన బడి’ పురోగతిపై చర్చించారు. మొదటి విడతలో చేపట్టిన పనులను జూన్ 12 నాటికి పూర్తిచేయాలని మంత్రి …
Read More » -
30 April
బీజేపీని ఓడించడం థర్డ్, ఫోర్త్ ఫ్రంట్తో కుదిరే పని కాదు
దేశంలో బీజేపీని ఓడించడం థర్డ్, ఫోర్త్ ఫ్రంట్తో కుదిరే పని కాదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. అయితే ఆ ఫ్రంట్ సెకండ్ ఫ్రంట్ స్థాయికి ఎదిగితే ఈజీగా బీజేపీని ఓడించ వచ్చని ఆయన సూచించారు. ఓ జాతీయ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో పీకే పై వ్యాఖ్యలు చేశారు. అయితే.. రాబోయే ఎన్నికల్లో తృణమూల్ను థర్డ్ఫ్రంట్ గా ముందు పెట్టి, బీజేపీని ఓడిస్తారా? అని ప్రశ్నించగా..అది కుదిరే పనికాదు. థర్డ్ …
Read More » -
30 April
తలసేమియా రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం
తలసేమియా వ్యాధి బారిన పడిన పిల్లలను చూస్తుంటే బాధ కలుగుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్య శ్రీ కింద అలాంటి పిల్లలందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు.తలసేమియా, సికెల్ సెల్ సోసైటీ ఆధ్వర్యంలో కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సదస్సుకు మంత్రి హరీశ్రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణలో కమలా సోసైటీ తలసేమియా రోగులకు మంచి సేవ అందిస్తోందని …
Read More » -
30 April
భారత ఆర్మీ చీఫ్గా జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరణ
భారత ఆర్మీ చీఫ్గా జనరల్ మనోజ్ పాండే శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ భారత ఆర్మీ చీఫ్గా బాధ్యతల్లో వున్న జనరల్ ఎం.ఎం. నరవాణే శనివారం పదవీ విరమణ చేశారు. మూడేళ్ల పాటు పాండే ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకూ జనరల్ మనోజ్ పాండే ఆర్మీకి ఉప చీఫ్గా పనిచేసిన విషయం తెలిసిందే.కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్ నుంచి మొదటి సారిగా ఆర్మీ చీఫ్గా ఎన్నిక కావడం ఇదే …
Read More »