TimeLine Layout

January, 2022

  • 14 January

    సంక్రాంతి కి ఆర్జీవీ తనదైన స్టైల్లో విషెష్

    అసలు పండగలకు శుభాకాంక్షలు చెప్పడమే ఇష్టపడని వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడు. ‘మీకు అంబానీని మించిన ఇల్లు, డబ్బు రావాలి. అమ్మాయిలకు అందమైన అబ్బాయిలు, అబ్బాయిలకు అందమైన అమ్మాయిలు దొరకాలి. భర్తలను భార్యలు వేధించకూడదు. చిన్న సినిమాలు బాహుబలి కంటే పెద్ద హిట్ కావాలి. ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచాలి. నన్ను ద్వేషించే వారి కోసం నేను త్వరగా చనిపోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు’ …

    Read More »
  • 14 January

    సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా

    సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో 1-2తేడాతో భారత్ కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో టెస్టులో భారత్పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సౌతాఫ్రికాలో సిరీస్ గెలవాలన్న కల నెరవేరకుండానే పోయింది. సౌతాఫ్రికా టీమ్ పీటర్సన్-82, డుసెన్-41, ఎల్గర్-30 రాణించారు. * టీమిండియా స్కోర్లు 223 & 198 * సౌతాఫ్రికా స్కోర్లు 210 & 212/3

    Read More »
  • 14 January

    చలికాలం సీజన్ లో జుట్టు రాలుతుందా…?

    చలికాలం సీజన్ లో ఇంటి చిట్కాలు ఉన్నాయి. జుట్టు రాలడం తగ్గించడంలో బియ్యం నానబెట్టిన నీరు బాగా పనికొస్తుంది. బియ్యాన్ని శుభ్రంగా కడిగి.. నీళ్లు పోసి 2 రోజుల పాటు నానబెట్టాలి. ఈ నీళ్లను ఫ్రిజ్లో పెట్టుకుని జట్టుకు పట్టించి క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నానబెట్టిన మెంతుల పేస్టులో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించినా రిజల్ట్ కనిపిస్తుంది.

    Read More »
  • 14 January

    నా హత్యకు కుట్ర జరుగుతుంది..

    ఏపీ అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తన హత్యకు కుట్ర జరుగుతోందని  సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకోసం జార్ఖండికి చెందిన ఓ ముఠాతో చర్చలు జరిగాయని అన్నారు. దీనిపై ప్రధానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. ఏపీ సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏ వ్యక్తి అయిన నచ్చకపోతే ఆ వ్యక్తిని తీసేస్తారు.  మెగాస్టార్ చిరంజీవిని అల్లరి …

    Read More »
  • 14 January

    తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు శుభవార్త

    తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై సాధ్యమైనంత త్వరగా ప్రకటన చేస్తామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి అమలు చేయాల్సిన పీఆర్సీపై కసరత్తు చేస్తున్నామన్నారు. అలాగే ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్కు బదలాయింపును ఈ నెలలోనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని ప్రభాకర్రావు హామీ ఇచ్చారు.

    Read More »
  • 14 January

    TDP నేత పరిటాల శ్రీరామ్ కి కరోనా

    ఏపీలో అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల తల్లి సునీతతో కలసి ధర్మవరం నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను కలసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలుంటే టెస్టులు చేసుకోవాలని శ్రీరామ్ సూచించారు.

    Read More »
  • 14 January

    నిజామియా టీబీ ఆసుపత్రిలో కరోనా కలవరం

    తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోనిచార్మినార్లోని నిజామియా టీబీ ఆసుపత్రిలో శుక్రవారం62 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు… వీరిలో39 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.

    Read More »
  • 14 January

    సర్జరీ చేయించుకునే వారు కరోనా టెస్ట్ చేయించుకోవాలా..?వద్దా..?

    లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్షలు చేయాలని.. సర్జరీలు చేయించుకునే వారికి కరోనా పరీక్ష తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సర్జరీ చేయించుకునే వారిలో లక్షణాలు ఉన్నప్పుడే నిర్ధారణ పరీక్షకు వెళ్లాలని సూచించింది. కరోనా నిర్ధారణ అయ్యాక తీసుకోవాల్సిన చికిత్సపై వైద్యుల సలహాను తప్పనిసరిగా పాటించాలంది. N95 మాస్కును రోజంతా.. క్లాత్ మాస్కును 8 గంటలకోసారి మార్చి కొత్తది ధరించాలని కేంద్రం పేర్కొంది.

    Read More »
  • 14 January

    ఏపీలో కొత్తగా 4,528 కరోనా కేసులు

    గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38,816 టెస్టులు చేయగా.. కొత్తగా 4,528 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్తో మరణించారు. మరోవైపు 418 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,313 కేసులు ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది.

    Read More »
  • 14 January

    పాలిటిక్స్ రీఎంట్రీపై చిరంజీవి క్లారిటీ

    ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ అధినేత, సీఎం జగన్మోహాన్ రెడ్డితో భేటీ నేపథ్యంలో తనకు రాజ్యసభ సీటు ఇస్తారంటూ వస్తున్న వార్తలను ఖండించారు చిరంజీవి. తనకు రాజ్యసభ సీటు ఇస్తారన్న వార్తలు రూమర్స్ మాత్రమే అని.. అలాంటి ఆఫర్లు తన వద్దకు రావని చిరంజీవి స్పష్టం చేశారు. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని.. పదవులకు అతీతంగా వ్యవహరిస్తున్నానని చెప్పారు. ఇక, తాను సీట్ల ఆఫర్లకు ఆశపడేవాడిని కాదని, అలాంటివి కోరుకోవడం లేదని …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat