ఏపీ అధికార వైసీపీకి చెందిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తన హత్యకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.
ఇందుకోసం జార్ఖండికి చెందిన ఓ ముఠాతో చర్చలు జరిగాయని అన్నారు. దీనిపై ప్రధానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. ఏపీ సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏ వ్యక్తి అయిన నచ్చకపోతే ఆ వ్యక్తిని తీసేస్తారు.
మెగాస్టార్ చిరంజీవిని అల్లరి చేయించేందుకే ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు పత్రికల్లో రాయించారు. ఇకపై సీఎం విందుకు వెళ్లాల్సిన అవసరం చిరంజీవికి లేదు’ అని ఆయన అన్నారు.