తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కౌటాల మ౦డల౦లోని గురుడుపేట గ్రామానికి చెందిన 30 మంది బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. టీఆర్ఎస్లోని ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో …
Read More »TimeLine Layout
July, 2021
-
27 July
నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి…..
పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఐనవోలు (225), వర్ధన్నపేట (604), పర్వతగిరి (452) మండలాల లబ్దిదారులకు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి …
Read More » -
27 July
ప్రధాని మోదీకి దీదీ షాక్
దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న పెగాసస్ స్పైవేర్ వివాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలో పలువురు రాజకీయ నేతలు, అధికారులు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాకింగ్కు గురయ్యాయన్న ఆరోపణలపై రాష్ట్ర పరిధిలో విచారణ జరిపేందుకు కమిషన్ను నియమించారు. కలకత్తా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బి.లోకూర్తో ద్విసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం ఆమె ఢిల్లీకి …
Read More » -
27 July
కొత్త రేషన్కార్డులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త రేషన్కార్డులను ఎమ్మెల్యే శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. గూడూరు మండలంలోని వాసవీ ఫంక్షన్ హాలులో 558 కుటుంబాలకు మంగళవారం కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా పస్తులుండొద్దని, ఇదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించిన గొప్ప సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడంతో …
Read More » -
27 July
నక్క తోక తొక్కిన హాట్ యాంకర్
బుల్లితెర హాట్ యాంకర్ వర్షిణి సౌందరాజన్కి పాన్ ఇండియన్ సినిమాలో అవకాశం దక్కింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’. సమంత అక్కినేని – మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వర్షిణి కీలక పాత్ర పోషిస్తుంది. సమంత అక్కినేనితో స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఆమె చాలా ఎగ్జైటింగ్గా “నా పాత్ర లేయర్డ్, మల్టిపుల్ లుక్తో ఉంటుంది. …
Read More » -
27 July
మరో ముందడుగు వేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్
దేశ వ్యాప్తంగా హరిత స్ఫూర్తిని నింపటమే లక్ష్యంగా పనిచేస్తోన్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇవాళ మరో మైలురాయిని సాధించింది. వెండితెర బిగ్ బీ, పద్మవిభూషణ్ అమితాబ్ బచ్చన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న అమితాబ్ అక్కడే మొక్కలు నాటారు.ప్రస్తుత తరుణంలో అందరికీ ఉపయోగకరమైన, భావి తరాలకు అవసరమైన మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ జోగినిపల్లి సంతోష్ …
Read More » -
27 July
లాంఛనంగా రేషన్కార్డుల పంపిణీ ప్రారంభించిన మంత్రులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం కొత్త రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ 53లక్షల రేషన్కార్డులు జారీ చేసి చేతులెత్తివేసిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం 34లక్షల కార్డులు జారీ చేసిందని తెలిపారు. రేషన్ షాపులకు దూరంగా ఉన్న గ్రామాలకు సబ్ సెంటర్ల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రేషన్ …
Read More » -
27 July
అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు : మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కుటుంబాలకు అండగా ఉంటామని.. ఎవరూ అధైర్యపడొద్దని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ భరోసానిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నర్సింహులపల్లికి చెందిన టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బొంగురపు శ్రీనివాస్రెడ్డి.. కొద్ది రోజుల కిందట కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందాడు. సోమవారం బాధిత కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. శ్రీనివాస్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. తక్షణ సహాయంగా …
Read More » -
27 July
రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన (ఆహార భద్రత కార్డు) కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మీర్పేట్ హెచ్. బి. కాలనీ డివిజన్ ఫేస్ వన్ ప్లే గ్రౌండ్ ఆవరణంలో ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్పొరేటర్ లతో కలిసి లాంఛనంగా ప్రారంభించి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఆహారభద్రత కార్డు నిరుపేదలకు ఎంతగానో …
Read More » -
27 July
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా- ఎమ్మెల్యే వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే ని కలిసేందుకు కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, నాయకులకు తన నివాసం వద్ద ఉన్న కార్యాలయంలో అందుబాటులో ఉంటూ స్వయంగా వారి సమస్యలను తెలుసుకుంటూ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు …
Read More »