TimeLine Layout

May, 2021

  • 4 May

    తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు

    తెలంగాణలో కొత్తగా 70,961 మందికి పరీక్షలు జరపగా 6,876కేసులు నమోదయ్యాయి. 59 మంది కరోనా బాధితులు మరణించారు. ఈ మేరకు తెలంగాణ హెల్త్ బులెటిన్ ను ఆరోగ్యశాఖ అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 79,520 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 7,432 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.

    Read More »
  • 4 May

    హీరో సందీప్ కిషన్ సంచలన నిర్ణయం

    కరోనా కారణంగా చిన్నారులెవరైనా తల్లిదండ్రులను కోల్పోతే.. వారి బాధ్యతను తాను తీసుకుంటానంటూ హీరో సందీప్ కిషన్ ముందుకు వచ్చాడు. అలాంటి వారు ఎవరైనా సరే.. వెంటనే తనను కాంటాక్ట్ చేయాల్సిందిగా ఓ మెయిల్ ఐడీని పోస్ట్ చేశాడు. అనాథలుగా మారిన పిల్లల వివరాలను sundeepkishancovidhelp@gmail.com కు తెలియజేయాల్సిందిగా సందీప్ ట్వీట్ చేశాడు. రెండేళ్ల పాటు వారికి కావలసిన తిండి, చదువు, ఇతర అవసరాలన్ని సమకూర్చుతానన్నాడు.

    Read More »
  • 4 May

    నేడు ఈటల కీలక ప్రకటన

    తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో ఇకపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగే ఉద్దేశం ఆయనకు లేదని సమాచారం. ఇవాళ హుజూరాబాద్లో అనుచరుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తర్వాత హైదరాబాద్కు వచ్చి స్పీకర్ను కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన లేఖను అందజేస్తారని తెలిసింది.

    Read More »
  • 4 May

    దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్లు

    దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల మార్కును దాటింది. 24 గంటల వ్యవధిలో 3,57,229 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 3,449 మంది కరోనా సోకి మరణించారు. ఫలితంగా, దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,02,82,833కు చేరగా… మరణాల సంఖ్య 2,22,408కు పెరిగింది. మొత్తంగా 1,66,13,292 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్ కేసులున్నాయి.

    Read More »
  • 4 May

    హైకోర్టుకు మాజీ మంత్రి ఈటల కుటుంబం

    తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని హైకోర్టులో ఈటల రాజేందర్ భార్య, కొడుకు, జమునా హేచరీస్ పిటిషన్ వేశారు. మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని, అచ్చంపేటలో తమ భూముల్లో అక్రమంగా సర్వే చేశారని పేర్కొన్నారు. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విచారణ జరిపిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా అధికారులకు ఆదేశాలివ్వాలన్నారు. ఇది నేడు విచారణకు వచ్చే అవకాశముంది.

    Read More »
  • 4 May

    మరో 600 ఎకరాలను కొనుగోలు చేసిన మార్క్ జుకర్ బర్గ్

    ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దంపతులు హవాయిలో మరో 600 ఎకరాలను కొనుగోలు చేశారు. హవాయిలోని కవాయి ద్వీపంలో ఈ భూమిని 53 మిలియన్ డాలర్లకు (రూ.391 కోట్లు) కొన్నారు. హవాయిలో జుకర్ బర్గ్కు ఇప్పటికే భూమి ఉండగా, ప్రస్తుత కొనుగోలుతో అక్కడ ఆయన భూమి మొత్తంగా 1300 ఎకరాలకు చేరింది.

    Read More »
  • 3 May

    ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) ఫలితాలు

    ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్(KMC) రిజల్ట్ అప్డేట్స్౼(31/60). 1: తేజావత్ హుస్సేన్(TRS) 2: మలీదు వెంకటేశ్వర్లు(CONGRESS) 3: మలీదు జగన్(INDEPENDENT) 4: దండా జ్యోతి రెడ్డి(TRS) 7: దొంగల సత్యనారాయణ(BJP) 8: లకావత్ సైదులు(CONGRESS) 9: SK జాన్ బీ(TRS) 10: చావా మాధురి(ఏకగ్రీవం-TRS) 13: కొత్తపల్లి నిరజ(TRS) 14: కురాకుల వలరాజు (TRS) 15: రావూరి కరుణ(TRS) 19: చామకూర వెంకన్న(CPI) 20: బిక్కసాని ప్రశాంత లక్ష్మి ( TRS) …

    Read More »
  • 3 May

    మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు.

    మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు. కరోనాతో బాధపడుతున్న ఆయన నేడు పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా సోకడంతో తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తరువాత ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అనంతరం సబ్బంహరి పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. నేటి ఉదయం నుంచే ఆయన పరిస్థితి మరింత విషమంగా …

    Read More »
  • 3 May

    కొత్తూరు మున్సిపాలిటిపై ఎగిరిన గులాబీజెండా

    మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఒక్కొక్క‌టిగా వెల్ల‌డి అవుతున్నాయి. ఇప్ప‌టికే న‌కిరేక‌ల్‌, జ‌డ్చ‌ర్ల‌ మున్సిపాలిటీని కైవ‌సం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ తాజాగా రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీని కైవ‌సం చేసుకుంది. కొత్తూరు మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డుల‌కుగాను 7 వార్డుల‌ను కైవ‌సం చేసుకుని గులాబీ జెండా ఎగుర‌వేసింది. ఐదు వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందింది. వార్డుల వారీగా గెలుపొందిన అభ్య‌ర్థుల వివ‌రాలిలా ఉన్నాయి. 1వ వార్డు – పి. మాధ‌వి(కాంగ్రెస్‌) 2వ …

    Read More »
  • 3 May

    జడ్చర్ల మున్సిపాలిటీపై ఎగిరిన టీఆర్‌ఎస్‌ జెండా

    మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ హవా కొనసాగుతున్నది. జడ్చర్ల మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్‌ పార్టీ జెండా ఎగురవేసింది. మొత్తం 27 వార్డుల్లో 19 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో టీఆర్‌ఎస్‌ ఇప్పటివరకు 16 వార్డుల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఒకటి, బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించింది. జడ్చర్లలోని డిగ్రీ కళాశాలలో ఓట్లను లెక్కిస్తున్నారు. మున్సిపాలిటీలోని మొత్తం 27 వార్డులకు ఏప్రిల్‌ 30న ఎన్నికలు జరిగిన …

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat