TimeLine Layout

April, 2021

  • 12 April

     భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి కన్నుమూత

    తెలంగాణ రాష్ట్రంలోని  భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్‌ నేత కుంజా బొజ్జి (95) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో భద్రాచలం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. కుంజా బొజ్జి భద్రాచలం నుంచి మూడుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అడవి వెంకన్న గూడెం.

    Read More »
  • 12 April

    మిష‌న్ భ‌గీర‌థ వాట‌ర్ ట్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

    తెలంగాణ రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ‌వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాంపూర్ గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన మిష‌న్ భ‌గీర‌థ వాట‌ర్ ట్యాంక్‌ను కేటీఆర్ ప్రారంభం చేశారు. ఈ ట్యాంక్ సామ‌ర్థ్యం 8 ల‌క్ష‌ల లీట‌ర్లు. వాట‌ర్ ట్యాంకు అందుబాటులోకి రావ‌డంతో స్థానిక ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. వాట‌ర్ ట్యాంకు ప్రారంభం కంటే ముందు అక్క‌డ ఏర్పాటు చేసిన ఫోటో …

    Read More »
  • 11 April

    ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 31,929 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చిత్తూరులో అత్యధికంగా 740 కేసులు వెలుగులోకి వచ్చినట్టు ఆరోగ్య శాఖ బులెటిన్‌ ద్వారా తెలిపింది. గుంటూరులో 527, విశాఖపట్నంలో 391, కర్నూలులో 296, కృష్ణాలో 278, శ్రీకాకుళంలో 279, ప్రకాశంలో 174 కేసులు వెలుగులోకి …

    Read More »
  • 11 April

    కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి

    అనంతపురం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, హిందూపురం మాజీ ఎమ్మెల్యే కామగానహళ్లి తిప్పేస్వామి(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పరిగి మండలం సేవా మందిరంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1941లో ఏప్రిల్ 6న జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సేవా మందిర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సొంత స్థలంలో …

    Read More »
  • 11 April

    ‘సబ్బండ కులాల’ సమున్నతాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం..

    కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే 195 వ జయంతి ( 11 ఏప్రిల్) ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నివాళులు అర్పించారు. దేశానికి ఫూలే అందించిన సేవలను ఈ సందర్భంగా సిఎం స్మరించుకున్నారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతికోసం, మహాత్మాఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని …

    Read More »
  • 11 April

    దేశంలో కొత్తగా 1,52,879 కరోనా కేసులు

    కరోనా సెకండ్‌ వేవ్‌ దేశాన్ని వణికిస్తోంది. రోజులు గడిచినా కొద్ది వైరస్‌ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా రోజు వారీ కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తున్న కేసులు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,52,879 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా మరో 839 మంది ప్రాణాలు …

    Read More »
  • 11 April

    తెలంగాణలో కరోనా కలవరం

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,187 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. వైరస్‌ ప్రభావంతో మరో ఏడుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా మరో 787 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రాష్ట్రంలో 20,184 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 13,336 మంది బాధితులున్నారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల …

    Read More »
  • 11 April

    సీఎం కేసీఆర్ పాలనలో రైతులు ఆర్థికంగా బలపడ్డారు-మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

    సీఎం కేసీఆర్ పాలనలో రైతుల ఆర్థిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. హన్మకొండలో  డీసీసీ బ్యాంకు పాలకవర్గం సభ్యుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ బాస్కర్, టీఏస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, రెడ్యా నాయక్, తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్ మర్నేని రవీందర్ …

    Read More »
  • 11 April

    మహాత్మా జ్యోతిరావు ఫూలేకు సీఎం కేసీఆర్ నివాళులు

    కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే 195 వ జయంతి ( 11 ఏప్రిల్) ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  నివాళులు అర్పించారు.దేశానికి ఫూలే అందించిన సేవలను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం,  మహాత్మాఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని …

    Read More »
  • 10 April

    నక్క తోక తొక్కిన రాశీ ఖన్నా

    తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నాగచైతన్యతో మళ్లీ జతకట్టే అవకాశాన్ని రాశీఖన్నా దక్కించుకుంది. థ్యాంక్ యూ చిత్రంలో ఆమె నటించనుంది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. అవికాగోర్, మాళవిక నాయర్లు రెండు పాత్రలకు ఎంపిక కాగా, మరో పాత్రకు పలు అన్వేషణల అనంతరం రాశీఖన్నాకు అవకాశం దక్కింది. గతంలో వెంకీమామలో నాగచైతన్యతో కలిసి రాశీఖన్నా నటించింది.

    Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat