Home / ANDHRAPRADESH / ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 31,929 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

చిత్తూరులో అత్యధికంగా 740 కేసులు వెలుగులోకి వచ్చినట్టు ఆరోగ్య శాఖ బులెటిన్‌ ద్వారా తెలిపింది. గుంటూరులో 527, విశాఖపట్నంలో 391, కర్నూలులో 296, కృష్ణాలో 278, శ్రీకాకుళంలో 279, ప్రకాశంలో 174 కేసులు వెలుగులోకి వచ్చాయి.

రాష్ట్రంలో ఇప్పటి వరకూ 9,21,906 కేసులు నమోదయ్యాయి.  గత 24 గంటల్లో కరోనాతో 12 మంది మృతి చెందారు. చిత్తూరులో మగ్గురు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, అనంతపురం, గుంటూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. మొత్తంగా రాష్ట్రంలో 7291 మంది మృత్యువాతపడ్డారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat