మహారాష్ట్రలో ఒమిక్రాన్ కల్లోలం సృష్టిస్తోంది. గత 24గంటల్లో కొత్తగా 85 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 252కు పెరిగింది. వీటిలో ఒక ముంబైలోనే 137 కేసులు ఉన్నాయి. మరోవైపు గత 24గంటల్లో కొత్తగా 3,900 కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ వల్ల 20 మంది చనిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం 14,065 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Read More »ముంబైలో కరోనా అలజడి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా అలజడి సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో ముంబైలో 2,510 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ముంబైలో 1,377 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. కాగా నిన్న మహారాష్ట్ర వ్యాప్తంగా 2,172 కేసులు రాగా.. ఇవాళ ఒక్క ముంబై నగరంలోనే ఇన్ని కేసులు నమోదవ్వడం గమనార్హం. కాగా మహారాష్ట్రలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది.
Read More »కోలుకుంటున్న దాదా
ఇటీవల కరోనా బారిన పడిన మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని కోల్కతాలోని వుడ్అండ్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతానికి ఆయనకు జ్వరం లేదని తెలిపింది. నిపుణులైన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గంగూలీకి కొన్ని నెలల కిందట యాంజియోప్లాస్టీ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నారు.
Read More »ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో కొవిడ్తో ఎవరూ చనిపోలేదు. 186 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య- 20,76,849 మరణాల సంఖ్య – 14,492 మొత్తం కోలుకున్న వారి సంఖ్య- 20,61,308 ప్రస్తుతం యాక్టివ్ కేసులు- 1,049
Read More »అమెరికాలో కరోనా కల్లోలం
అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల కోసం జనం పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అమెరికాలో రోజువారీ కరోనా కొత్త కేసులు ఇప్పుడు 2లక్షల మార్కుకు చేరువయ్యాయి. అతి త్వరలోనే ఆ సంఖ్య తొలిసారి 5లక్షల మార్కును తాకే అవకాశం ఉంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించిన డేటా ప్రకారం ప్రతిరోజూ సగటున 1,98,404 కొత్త కేసులు నమోదవుతున్నాయి.
Read More »ఇంగ్లండ్ క్యాంప్ లో కరోనా కలవరం
ఇంగ్లండ్ క్యాంప్ లో మొత్తం 6 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని తెలుస్తోంది. అయితే.. జట్టు సపోర్టింగ్ స్టాఫ్, ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రమే పాజిటివ్ వచ్చిందట. ప్రస్తుతానికి ఆటగాళ్లకెవరికీ వైరస్ సోకలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఓటమి ముంగిట ఇంగ్లండ్ జట్టు కొట్టుమిట్టాడుతోంది. మరి ఈ సిరీస్ కొనసాగుతుందా..? లేక రద్దవుతుందా..? వేచి చూడాలి.
Read More »తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య తాజాగా 12
తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరో 12 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 55కి చేరింది. తాజా కేసుల్లో రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ (మ) గూడెం గ్రామానికి ఇటీవల వచ్చిన ఓ యువకుడికి ఒమిక్రాన్ వచ్చింది .. తాజాగా అతడి తల్లి, భార్యకు కూడా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే ఎల్లారెడ్డిపేట(మ) నారాయణపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ …
Read More »ఇంగ్లాండ్ శిబిరంలో కరోనా కలకలం
ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ ఆడుతున్న ఇంగ్లాండ్ శిబిరంలో కరోనా కలకలం రేపింది. ఇంగ్లండ్ బృందంలో 4 కరోనా కేసులు వచ్చాయి. సిబ్బంది కాగా.. మరో వీరిలో సహాయక ఇద్దరు ఆటగాళ్ల కుటుంబ సభ్యులని తెలిసింది. ఇక, ఆటగాళ్లలో ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదని తేలిన తర్వాతే.. హోటల్ నుంచి మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్కు అనుమతించారు. ఈ నేపథ్యంలో 3వ టెస్టు రెండో రోజు ఆట అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.
Read More »అక్కడ ఒక్కరోజే లక్ష కరోనా కేసులు
ఫ్రాన్స్ లో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఒకేరోజు ఏకంగా లక్ష కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,04,611 మంది వైరస్ బారిన పడినట్లు ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ వెల్లడించింది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఒకే రోజు నమోదైన అత్యధిక కేసులు ఇవే. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉందని ఫ్రాన్స్ వైద్యశాఖ ప్రకటించింది. రానున్న రోజుల్లో ఒమిక్రాన్ కేసులు అధికంగా నమోదయ్యే అవకాశం …
Read More »AP లో 82కొత్త కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 82 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా కొవిడ్తో ఒకరు మరణించారు. 164 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య- 20,76,492 మరణాల సంఖ్య- 14,490 మొత్తం కోలుకున్న వారి సంఖ్య- 20,60,836 ప్రస్తుతం యాక్టివ్ కేసులు- 1,166
Read More »