ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. వర్షం పడటంతో శ్రీలంక 47.4 ఓవర్లలో 220/9 రన్స్ చేసింది. DLS ప్రకారం రెండో ఇన్నింగ్స్ ను 43 ఓవర్లకు కుదించారు. 216 పరుగులను లక్ష్యంగా పెట్టారు. అయితే శ్రీలంక బౌలర్లు రాణించడంతో ఆస్ట్రేలియా 37.1 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా మొదటి వన్డేలో ఆస్ట్రేలియా గెలిచింది. మరో 3 వన్డేలు మిగిలి ఉన్నాయి.
Read More »స్టెఫన్ నీరో ప్రపంచ రికార్డు
క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టెఫన్ నీరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కామన్ వెల్త్ బ్యాంక్ అంధుల క్రికెట్ సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ బ్యాటర్ స్టెఫన్ నీరో కేవలం 140 బంతుల్లో 309 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. నీరో 49 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీంతో ఆసీస్ 542 పరుగుల భారీ స్కోర్ చేయగా కివీస్ 272 …
Read More »జేమ్స్ ఆండర్సన్ అరుదైన ఘనత
ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు చెందిన సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. తన కెరీర్లో 650వ టెస్టు వికెట్ మైలురాయిని చేరుకున్నాడు. న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో లాథమ ను ఔట్ చేసి ఆండర్సన్ ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో 650 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ ఆండర్సన్ రికార్డులకెక్కాడు. స్పిన్ దిగ్గజాలు షేన్ వార్న్, మురళీధరన్ ఈ అరుదైన ఘనత సాధించిన …
Read More »బీసీసీఐ కీలక నిర్ణయం
టీమిండియాకు చెందిన మాజీ క్రికెటర్లు, అంపైర్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఇచ్చే పెన్షన్స్ను పెంచుతున్నట్లు ప్రకటించింది. కనిష్ఠంగా రూ.15వేలు ఉన్న పెన్షన్ను రూ.30 వేలకు.. గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న పెన్షన్ ను రూ.70 వేలకు పెంచింది. 5 కేటగిరీలుగా ఈ పెన్షన్ అందిస్తారు. జూన్ 1 నుండి పెన్షన్ పెంపు అమల్లోకి వస్తుంది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో 900 మంది మాజీ క్రికెటర్లు, …
Read More »ఐపీఎల్ మీడియా, డిజిటల్ ప్రసార హక్కుల బిడ్డింగ్ నుంచి అమెజాన్ ఔట్
ఐపీఎల్ మీడియా, డిజిటల్ ప్రసార హక్కుల బిడ్డింగ్ నుంచి అమెజాన్ వైదొలిగింది. భారత్లో తమ వృద్ధికి ఇది సరైన ఎంపికగా కనిపించడం లేదని కంపెనీ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఈ రేసులో స్టార్ స్పోర్ట్స్, సోనీ, జీ, రిలయన్స్ ముందున్నాయి. ఆదివారం ఆన్లైన్ ద్వారా జరిగే బిడ్డింగ్లో ఈ కంపెనీలు ప్రసార హక్కుల కోసం పోటీపడనున్నాయి. ఈసారి గంపగుత్తగా ఒక్కరికే కాకుండా మీడియా రైట్స్ను నాలుగు విభాగాలుగా విభజించారు.భారత ఉపఖండంలో …
Read More »కేన్ విలియమ్సన్ కి కరోనా పాజిటీవ్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కొవిడ్ బారిన పడ్డాడు.మొన్న శుక్రవారం ఇంగ్లండ్తో రెండో టెస్టు ఆరంభానికి ముందు విలియమ్సన్ పాజిటివ్గా తేలినట్టు కివీస్ జట్టు కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపాడు. దీంతో కేన్ తాజా టెస్టుకు దూరమయ్యాడు.. అతని గైర్హాజరీతో మ్యాచ్కు టామ్ లాథమ్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. కాగా, విలియమ్సన్ స్థానంలో హమిష్ రూథర్ఫర్డ్ జట్టులోకి వచ్చాడు.
Read More »GT కోచ్ ఆశిష్ నెహ్రాపై ప్రసంశలు
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ టైటిల్ సాధించిన సంగతి విదితమే.. ఆ జట్టు ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రాపై ప్రసంశలు వస్తున్నాయి. ‘కోచ్ మనసు పెట్టి పనిచేశాడు. తన ఆటగాళ్ల గురించి, వాళ్లకు ఏ విధంగా సాయం చేయాలనే దాని గురించి తెగ ఆలోచిస్తుంటాడు. వ్యూహాల పరంగా IPLలో అత్యుత్తమ కోచ్లలో అతడు ఒకడు. ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన చేసేలా వాళ్లతో మాట్లాడుతుంటాడు. ప్రచారం కోరుకోడు. తెరవెనుక ఉంటాడు’ అని GT …
Read More »కోహ్లీ రికార్డును సమం చేసిన బట్లర్
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ ఈ ఏడాది ఐపీఎల్లో ఫుల్ జోష్ మీదున్నాడు. బ్యాటింగ్తో దుమ్మురేపుతున్న ఆ హిట్టర్ ఇప్పుడో రికార్డును సమం చేశాడు. టీ20 సిరీస్లో విరాట్ కోహ్లీ పేరిట ఉన్న అత్యధిక సెంచరీల రికార్డును అతను సమం చేశాడు. ఈ యేటి సిరీస్లో బట్లర్ నాలుగు సెంచరీలు నమోదు చేశాడు. శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లోనూ బట్లర్ సూపర్ షో కనబరిచాడు. మోదీ స్టేడియంలో పరుగుల …
Read More »శిఖర్ ధావన్ సరికొత్త రికార్డు
పంజాబ్ కింగ్స్ ప్లేయర్ శిఖర్ ధావన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో 700 ఫోర్లు కొట్టిన తొలి బ్యాటర్గా ధావన్ ఘనత సాధించాడు. ఐపీఎల్ 2022 చివరి లీగ్ మ్యాచ్లో ధావన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. హైదరాబాద్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ధావన్ పేరిట ఐపీఎల్లో ఇప్పుడు మొత్తం 701 ఫోర్లు ఉన్నాయి. అతని …
Read More »రూ.40 కోట్లతో బంగ్లా కొన్న గంగూలీ
బీసీసీఐ అధ్యక్షుడు,టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు సౌరవ్ గంగూలీ కోల్ కత్తాలో భారీ బంగ్లాను కొనుగోలు చేశాడు. దీని విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. 10,280 చదరపు అడుగులు కలిగిన ఈ బంగ్లాను భార్య డోనా, కూతురు సనా, తల్లి నిరూపమ్ పేరిట సమానంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. 48 ఏళ్ల తర్వాత పూర్వీకుల ఇంటి నుంచి గంగూలీ త్వరలోనే కొత్తగా కొన్న భవనంలోకి మారనున్నాడు.
Read More »