తమిళ చిత్రం ‘లెట్స్ గెట్ మ్యారీడ్’తో నిర్మాతగా మారిన టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ.. కమెడియన్ యోగి బాబుకు తన ఆటోగ్రాఫ్ ఉన్న క్రికెట్ బ్యాట్ గిఫ్ట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోను యోగి బాబు ట్విటర్లో షేర్ చేశారు. ‘ధోనీ నెట్స్లోలో ప్రాక్టీస్ చేసిన బ్యాట్ను నాకు గిఫ్ట్ ఇచ్చారు. థాంక్యూ సార్’ అని ట్వీట్ చేశారు. రమేశ్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ …
Read More »చీఫ్ సెలెక్టర్ గా ఎంఎస్ ధోనీ..?
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా భవిష్యత్తును కాపాడాలి అంటే బీసీసీఐ ఎంఎస్ ధోనీని రంగంలోకి దింపాలన్నాడు. ‘తక్షణమే కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి చీఫ్ సెలక్టర్గా ధోనీని నియమించాలి. కానీ బీసీసీఐ ధోనీని సంప్రదించకపోవచ్చు. ఎందుకంటే ధోనీ తన పనిలో జోక్యం చేసుకోవద్దని సూటిగా చెప్పేస్తాడు’ అని అభిప్రాయపడ్డాడు.
Read More »బీసీసీఐ కీలక నిర్ణయం
టీమిండియాకు చెందిన మాజీ క్రికెటర్లు, అంపైర్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఇచ్చే పెన్షన్స్ను పెంచుతున్నట్లు ప్రకటించింది. కనిష్ఠంగా రూ.15వేలు ఉన్న పెన్షన్ను రూ.30 వేలకు.. గరిష్ఠంగా రూ.50 వేలు ఉన్న పెన్షన్ ను రూ.70 వేలకు పెంచింది. 5 కేటగిరీలుగా ఈ పెన్షన్ అందిస్తారు. జూన్ 1 నుండి పెన్షన్ పెంపు అమల్లోకి వస్తుంది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో 900 మంది మాజీ క్రికెటర్లు, …
Read More »క్రికెట్ చరిత్రలోనే రికార్డు
ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్లో నేపాల్ జట్టు చెత్త రికార్డు మూటగట్టుకుంది. యూఏఈతో జరిగిన పోరులో నేపాల్ 8 పరుగులకే ఆలౌటై అందరిని విస్మయపరిచింది. 2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరుగనున్న ప్రపంచకప్ కోసం నేపాల్, థాయ్లాండ్, భూటాన్, యూఏఈ, ఖతార్ మధ్య క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా శనివారం యూఏఈతో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్కు దిగిన నేపాల్ 8.1 ఓవర్లలో 8 పరుగులకు ఆలౌటైంది. …
Read More »రోహిత్ Hit మ్యానే కాదు History Man
టీమిండియా డేరింగ్ డాషింగ్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాడ్ తో జరిగిన రెండో టీ20లో సిక్సర్ కొట్టిన రోహిత్.. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యంత వేగంగా 450 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్ ఈ ఫీట్ కోసం 403 ఇన్నింగ్స్ లో తీసుకోగా అఫ్రిదీకి 487, గేల్ కు 499 ఇన్నింగ్స్ అవసరం అయ్యాయి. అలాగే ఈ …
Read More »శ్రీలంక క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డు
శ్రీలంక క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వన్డే క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఓడిపోయిన జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇప్పటివరకు అత్యధిక వన్డేల్లో ఓడిన జట్టుగా టీమిండియా ఉండేది. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో లంక టీం ఓటమిపాలై, భారత్ను రెండో స్థానానికి నెట్టింది. మొత్తం 428 మ్యాచ్ పరాజయాలతో ప్రథమ స్థానంలో నిలిచింది. 414 ఓటములతో పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది.
Read More »వన్డే క్రికెట్ కి ఆల్రౌండర్ కెవిన్ ఓబ్రెయిన్ రిటైర్మెంట్
ఐర్లాండ్ క్రికెట్ జట్టుకు చెందిన ప్రముఖ స్టార్ ఆల్రౌండర్ కెవిన్ ఓబ్రెయిన్ (37) వన్డే క్రికెటు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేల్లో కొనసాగాలనే ఆసక్తి, ప్రేమ తనకు లేదని పేర్కొన్నాడు. టెస్టు, టీ20 క్రికెట్ మ్యాచ్లకు అందుబాటులో ఉంటానన్నాడు. 2006లో అరంగేట్రం చేసిన కెవిన్ 153 వన్డేల్లో 3,618 పరుగులు చేశాడు. 114 వికెట్లు పడగొట్టాడు. 2011 వరల్డ్కప్లో ఇంగ్లాండ్పై కెవిన్ కేవలం 50 బంతుల్లోనే 100 పరుగులు బాదాడు.
Read More »విరాట్ నెంబర్ 2..రోహిత్ శర్మ నెంబర్ 3..
ఐసీసీ వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా రెండు, మూడు స్థానాలను నిలబెట్టుకున్నారు. పాకిస్థాన్ బ్యాట్స్మన్ బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే ఆల్ రౌండర్ల జాబితాలో బంగ్లా ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు.
Read More »ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. రెండో టీ20కి గాయంతో దూరమైన ఆరోన్ ఫించ్.. ఈ మ్యాచ్కు మళ్లీ ఆసీస్ కెప్టెన్గా వచ్చాడు. ఆల్రౌండర్ స్టాయినిస్ను ఆస్ట్రేలియా పక్కన పెట్టింది. ఇప్పటికే సిరీస్లో 2-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లి సేన.. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్కు టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
Read More »ఇంగ్లాండ్ కు విండీస్ క్రికెటర్లు
కరోనాతో నిరాశలో ఉన్న క్రికెట్ ప్రేమికులకు ఇది శుభవార్త..అంతర్జాతీయ క్రికెట్ రంగంలో తొలి అడుగు పడింది. ఇంగ్లాండ్ దేశంతో మూడు టెస్టులు ఆడటానికి విండీస్ జట్టు ఆటగాళ్లు ప్రత్యేక జెట్ విమానంలో ఇంగ్లాండ్ దేశానికి బయలుదేరి వెళ్లారు.కరోనా పరీక్షలు ఆటగాళ్లందరికీ నిర్వహించారు. ఈ పరీక్షల్లో నెగిటివ్ అని నివేదికలో తేలడంతో ఆటగాళ్లను విమానం ఎక్కించారు.అయితే ఈ మ్యాచులకు ప్రేక్షకులు మాత్రం ఉండరు..చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచులు జరుగుతున్నాయి..
Read More »