అడ్డగోలు అబద్ధాలను ప్రచారం చేయడం.. అడ్డంగా దొరికిపోవడం బీజేపీ నేతలకు అలవాటైపోయింది. బీజేపీ నేతల్లో ఈటల రాజేందర్ రెండాకులు ఎక్కువే చదివినట్టున్నారు. కొన్నాళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వెలగబెట్టిన ప్రబుద్ధ నేత.. ఓట్లకోసం చౌకబారు ప్రచారానికి తెగబడ్డారు. గ్యాస్బండపై రూ.291 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా వస్తున్నదంటూ నోటికొచ్చిన అబద్ధమాడుతున్నారు. ప్రచారం ఒక్కో గ్యాస్బండపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.291 పన్నువాటాగా వస్తున్నదని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ …
Read More »ఆపదలో ఉన్న వారికి అడగ్గానే అండగా మంత్రి KTR
ఆపదలో ఉన్న వారికి అడగ్గానే అండగా నిలుస్తున్నారు మున్సిపల్, ఐటీశాఖా మంత్రి కేటీఆర్. సామాజిక మాధ్యమాల్లో ఆయనకు వస్తున్న విజ్ఞప్తులకు వెంటనే స్పందిస్తూ భరోసా ఇస్తున్నారు. వేడి పాలు ఒంటిపై పడి కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న చిన్నారితోపాటు బోన్క్యాన్సర్తో బాధపడుతు న్న బాలుడి వైద్యానికి సాయం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన గుండెబోయిన అశోక్, లక్ష్మి దంపతులకు కొడుకు కార్తీక్(11 నెలలు) …
Read More »రాష్ట్రంలో రెండు వందల ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు
దేశ వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తిపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.. దీనికి కారణం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మాత్రమే అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు వందల ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి.. తెలంగాణలో విద్యుత్ కోతలకు ఆస్కారమే లేదని మంత్రి తేల్చిచెప్పారు. ఒక్క నిమిషం కూడా రాష్ట్రంలో పవర్ కట్ ఉండదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుత్ను హైదరాబాద్కు …
Read More »సీఎం కేసీఆర్ గొప్ప మనసు-మంత్రి NIranjan Reddy చొరవతో చిన్నారికి సాయం
వనపర్తి నియోజకవర్గం రేవల్లికి చెందిన ఓ విద్యార్థిని అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పరోక్సిస్మాల్ నాక్టర్నాల్ హిమోగ్లోబినురియా (PNH) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ యువతికి చికిత్స చేసేందుకు రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్తో యువతి ప్రాణాలు నిలిపే అవకాశం ఉంది. బాధితురాలికి ఎంబీబీఎస్లో సీటు వచ్చినా కూడా.. ఈ వ్యాధి కారణంగా చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ …
Read More »ఏడేళ్లలో TRS ప్రభుత్వం రూ.58,303 కోట్లు ఖర్చు చేసింది-CM KCR
కాంగ్రెస్ 2004 నుంచి 2014 మధ్య పదేళ్ల కాలంలో రూ.12,173 కోట్లు ఖర్చు చేసింది. ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం రూ.58,303 కోట్లు వెచ్చించింది. ఇది మేం చెబుతున్న విషయం కాదు. కాగ్ నివేదిక’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.శాసనసభలో గురువారం పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ”ప్రతి పంచాయతీలో అయిదు నుంచి పది ఎకరాల్లో బృహత్ ప్రకృతి వనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 100 చోట్ల పనులు …
Read More »పట్టణాలు ఆర్థిక చోదకశక్తిగా, గ్రోత్ ఇంజిన్లుగా మారాయి- మంత్రి KTR
తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు ఆర్థిక చోదకశక్తిగా, గ్రోత్ ఇంజిన్లుగా మారాయని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సమతుల్యమైన, సమ్మిళితమైన, సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తున్నామని చెప్పారు. 75 ఏండ్ల చరిత్రలో గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, కుటీరపరిశ్రమలు, ఐటీరంగాలకు ప్రాధాన్యమిస్తూ కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. శాసనసభలో గురువారం పట్టణప్రగతిపై చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా పలువురు సభ్యులు …
Read More »పాజిటివ్ ఆలోచన నింపడం తప్పా?-CM KCR
కరీంనగర్ను డల్లాస్ మాదిరిగా చేస్తానని తాను ఎప్పుడూ చెప్పలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మానేరు నదిపై చెక్డ్యామ్లు, వంతెనలు నిర్మిస్తే లండన్లోని థేమ్స్ నది మాదిరిగా కనిపిస్తుందని అన్నానని చెప్పారు. నగరాల అభివృద్ధి గురించి రాష్ట్ర ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకే లండన్, ఇస్తాంబుల్ వంటివాటిని ఉదాహరణగా చెప్పానని తెలిపారు. అసెంబ్లీలో పల్లె ప్రగతి-పట్టణ ప్రగతిపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ పాత నగరాన్ని ఇస్తాంబుల్ చేస్తమన్నరు.. …
Read More »పేద గిరిజన వైద్య విద్యార్థి ఎంబీబీఎస్ చదువుకి ఆర్థిక సహకారం అందించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరం బోరబండ ప్రాంతానికి చెందిన అనూష కిర్గిజిస్తాన్ హెల్త్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతుంది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చింది. ప్రస్తుతం తాను చదువుతున్న వైద్య విద్య కోర్సులో మొదటి మూడు సంవత్సరాల్లో 95 శాతం మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. అయితే కరోనా నేపథ్యంలో చదువును కొనసాగించే పరిస్థితులు లేకపోవడంతో తన తల్లితో కలిసి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. పేద గిరిజన కుటుంబానికి …
Read More »ముక్రా(కే) గ్రామ పంచాయతీ మరో సంచలన నిర్ణయం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ పంచాయతీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీ ఆదాయం నుంచి ప్రతినెలా రూ. 2వేలు, సర్పంచ్ , ఎంపీటీసీల గౌరవ వేతనం నుంచి రూ.500 చొప్పున మొత్తం మూడు వేలు హరితనిధికి ఇచ్చేందుకు తీర్మానం చేశారు. ఇప్పటికే హరితహారం గురించి ముక్రా గ్రామం సాధించిన ప్రగతిని అసెంబ్లీలో స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. దీంతో గురువారం ముక్రా (కే) గ్రామ …
Read More »తాగునీటి సమస్యను 95% పరిష్కరించాం : మంత్రి KTR
శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అర్బన్ మిషన్ భగీరథపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. అర్బన్ మిషన్ భగీరథ పతకం కింద ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని కాలనీలకు తాగునీరు అందిస్తున్నాము. రూ. 313 కోట్ల 26 లక్షల వ్యయంతో నలభై ఏడున్నర ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన 12 రిజర్వాయర్లను నిర్మించి, 384 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయడం …
Read More »