గ్రేటర్ పరిధిలోని 185 చెరువుల పరిరక్షణ, అభివృద్ధి, సుందరీకరణ కోసం రెండేండ్ల కార్యప్రణాళికను సిద్ధం చేయాలని పురపాలకశాఖ మంత్రి కేటీ రామారావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థల్లో ఖాళీ స్థలాలను గుర్తించి వాటిని గ్రంథాలయాలు, పార్కులు, బస్బేల అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. బల్దియా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వి …
Read More »ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనాను తెస్తాం
తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అలాగే కరోనా చికిత్స పొందిన పేదలకు సీఎంఆర్ఎఫ్ కింద సాయం చేస్తామని తెలిపారు. వాటికి సంబంధించిన బిల్లులుంటే తనకు పంపాలని కోరారు. కరోనాపై బుధవారం జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్ …
Read More »రెవెన్యూ బిల్లును సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
తెలంగాణ శాసనసభలో రెవెన్యూ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రవేశపెట్టిన బిల్లుల్లో భూమిపై హక్కులు, పాస్పుస్తకాల చట్టం – 2020, గ్రామ రెవెన్యూ అధికారుల రద్దు చట్టం – 2020 ఉన్నాయి. కేంద్ర, రాష్ట్రాల భూములకు చట్టంలోని అంశాలు వర్తించవు అని ప్రభుత్వం తెలిపింది. ‘‘భూలావాదేవీలకు వెబ్సైట్ ద్వారా స్లాట్ కోసం దరఖాస్తు చేయాలి. సబ్రిజిస్ట్రార్ ఇచ్చిన సమయానికి పత్రాలు ఇచ్చి సేవలు పొందాలి. భూములను మార్ట్గేజ్ చేస్తే ధరణి …
Read More »పీవీని అవమానించిన కాంగ్రెస్
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పుట్టుక నుంచి మరణించే వరకు ఒకే రాజకీయ పార్టీలో కొనసాగారని, ఆ పార్టీకి, దేశానికి ఎనలేని సేవ చేశారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. కానీ, పీవీ మరణానంతర పరిణామాలు హృదయవిదారకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన ఢిల్లీలో మరణిస్తే.. పార్థివదేహాన్ని కనీసం ఏఐసీసీ కార్యాలయంలోకికూడా తీసుకెళ్లలేదని, తెలంగాణ బిడ్డ కావడం వల్లే ఆనాడు పీవీని కాంగ్రెస్ అవమానించిందని ఆరోపించారు. హైదరాబాద్కు తీసుకొచ్చి అంత్యక్రియలు …
Read More »రైతన్న నీకు నేనున్నా
తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో నవశకం ప్రారంభం కానున్నది. శతాబ్దాలనాటి చట్టాల బూజు దులుపుతూ.. అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం బుధవారం అసెంబ్లీ ముందుకు రానున్నది. 140కి పైగా చట్టాలు.. సంక్లిష్ట నిబంధనలతో కూడిన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళనచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంకల్పించిన సంగతి తెలిసిందే. అన్ని కోణాల్లో ఆలోచించి.. అన్ని వర్గాలను, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం …
Read More »గులాబీ దండుకు కేసీఆరే బాస్..
సీఎం కేసీఆర్ అందిస్తున్న అభివృద్ధి ఫలాలను అర్హుల చెంతకు చేర్చేందుకు సుశిక్షితుడైన సైనికుడిలా పనిచేస్తున్నా. మంత్రిగా జిల్లా అభివృద్ధిలో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. టీఆర్ఎస్ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికీ కేసీఆరే బాస్. ఆయన మాటే కార్యకర్తలకు శిరోధార్యం. ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ దండు ఏకతాటిపై ఉంది. ఉమ్మడి జిల్లాకు వరప్రదాయని అయిన సీతారామ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేసి రైతు కళ్లల్లో ఆనందం చూడటమే నా లక్ష్యం. …
Read More »సంచలన నిర్ణయాలను తీసుకున్న తెలంగాణ మంత్రి వర్గం
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ప్రగతి భవన్ లో సమావేశమై ఈ క్రింది నిర్ణయాలు తీసుకున్నది: • ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020 ని ఆమోదించింది • ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ని ఆమోదించింది • తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లును ఆమోదించింది • …
Read More »కలం వీరుడు రామలింగారెడ్డి: మంత్రి కేటీఆర్
ప్రస్తుత రాజకీయాల్లో రామలింగారెడ్డి లాంటి నాయకులు అరుదని మంత్రి కేటీఆర్ అన్నారు. కలం వీరుడిగా ఉద్యమానికి మద్దతునిచ్చిన వ్యక్తి రామలింగారెడ్డి అని పేర్కొన్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రామలింగారెడ్డిది గొప్ప వ్యక్తిత్వమని, నిరాడంబరమైన జీవన విధానంతో ఉండేవారని చెప్పారు. అందరితో కలుపుగోలుగా ఉండేవారని తెలిపారు. 2004లో జరిగిన ఎన్నికల సందర్భంగా దొమ్మాట నియోజకవర్గానికి రామలింగారెడ్డి …
Read More »అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం అయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి సభ నివాళులర్పించింది. వారి సేవలను సభ్యులు గుర్తు చేశారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో సభ్యులతో పాటు అసెంబ్లీ సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కు ధరించారు. కరోనా …
Read More »ప్రణబ్ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం
భారతరత్న, మాజీ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల తెలంగాణ శాసనసభ సంతాపం తెలిపింది. ప్రణబ్ మృతి పట్ల సంతాప తీర్మానాన్ని రాష్ర్ట సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రణబ్ మృతి పట్ల తెలంగాణ శాసనసభ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు. భారతదేశం శిఖర సమానమైన నాయకుడిని కోల్పోయింది. 1970 తర్వాత దేశ అభివృద్ధి చరిత్రలో ప్రణబ్ ముఖర్జీ పేరుకు …
Read More »