మంత్రి సత్యవతి రాథోడ్ను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ గారి తల్లి గారు మృతిచెందిన సంగతి విధితమే. ఈ క్రమంలో మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. మంత్రి సత్యవతి మాతృమూర్తి గుగులోత్ దస్మా పార్థీవదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గుగులోత్ దస్మా ఆత్మకు శాంతి …
Read More »రోడ్డు ప్రమాదానికి గురైన మంత్రి నాగార్జున కారు
ఆంధ్రప్రదేశ్కు చెందిన సాంఘిక శాఖ మంత్రి మేరుగు నాగార్జున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈరోజు శనివారం విజయవాడ వారధి నుంచి బందర్ రోడ్డు వైపు వస్తుండగా మంత్రి గారి కారు ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం వైద్యులు మంత్రిని డిశ్చార్జ్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More »దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 20,408 కరోనా పాజిటీవ్ మహమ్మారి కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,40,00,138కి చేరాయి. ఇందులో 4,33,30,442 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,312 మంది కరోనాతో మృతిచెందారు. మరో 1,43,384 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 54 మంది మరణించగా, 20,958 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read More »ఏపీలో మంకీ పాక్స్ కలవరం
ఏపీలో మంకీ పాక్స్ కలవరం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో మంకీపాక్స్ ఒకటి అనుమానిత కేసు నమోదయ్యింది. ఒడిశా నుండి ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వచ్చిన కుటుంబంలోని బాలుడు(8) ఒంటిపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు అతడిని గుంటూరు జీజీహెచ్లో చేర్పించారు. రెండువారాలు గడుస్తున్న దద్దుర్లు దక్కకపోవడంతో వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తూ బాలుడి నమూనాలను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి వచ్చే రిపోర్టు ఆదారంగా …
Read More »బాలయ్య మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో స్టార్ హీరో.. యువరత్న నందమూరి బాలకృష్ణ నటించనున్న మూవీలో కీలక పాత్ర కోసం బాలీవుడ్ కి చెందిన స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమెకు డైరెక్టర్ కథ వినిపిస్తాడని సమాచారం. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో 50 ఏళ్ల వయసున్న …
Read More »గ్యాంగ్ స్టర్ కథతో సూర్య మరో మూవీ
ప్రముఖ దర్శకురాలైన సుధ కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య మరో మూవీ చేయనున్నాడు. గ్యాంగ్ స్టర్ కథతో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా మూవీ ఉంటుందని సుధ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ఆకాశం నీహద్దురా మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం బాల డైరెక్షన్లో సూర్య చేస్తున్న వణంగాల్(తెలుగులో అచలుడు) పూర్తయ్యాక కొత్త మూవీ …
Read More »తెలుపు రంగు డ్రస్ లో మత్తెక్కిస్తున్న వేదిక అందాలు
ఏపీ టీడీపీ నేత ఇంట్లో పడిన దొంగలు-కాళ్లు చేతులు కట్టేసి మరి…?
ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరులో దోపిడీ దొంగలు స్వైరవిహారం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన నేత రామ సుబ్బారావు ఇంట్లోకి ఆరుగురు దొంగలు చొరబడి కాళ్లు, చేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. కత్తులతో బెదిరించి మూడు ఏటీఎం కార్డులు, సెల్ఫోన్లు లాక్కున్న దొంగలు ఏటీఎం పిన్ నెంబర్లను సైతం తీసుకున్నారు. 14 సవర్ల బంగారం, రూ. 20 వేలు చోరీ చేసి పారిపోయారు.. దీంతో బాధితుడు …
Read More »దేశంలో కొత్తగా 20,409 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 20,409 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 47 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,39,79,730కి చేరగా, 5,26,258 మంది మరణించారు. ఇప్పటివరకు 4,33,09,484 మంది బాధితులు కోలుకున్నారు. మరో 1,43,988 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 22,697 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read More »