ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఆశా కార్యకర్తలకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేపట్టినట్లు తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు తెలిపారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 43 మంది ఆశా కార్యకర్తలకు ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆశా …
Read More »రాంచీ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
జార్ఖండ్ రాజధాని రాంచీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం చేరుకున్నారు. సీఎం కేసీఆర్కు రాంచీ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. మరికాసేపట్లో జార్ఖండ్ గిరిజన ఉద్యమకారుడు బిర్సాముండా విగ్రహానికి పూలమాల వేసి సీఎం కేసీఆర్ నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం కేసీఆర్.. నేరుగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ అధికారిక నివాసానికి వెళ్లనున్నారు. గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు కేసీఆర్ ఆర్థిక …
Read More »తెలంగాణ రాష్ట్రానికి మరో పరిశ్రమ.. రూ.250 కోట్ల పెట్టుబడితో ఎస్3వీ కంపెనీ
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకువచ్చింది. వైద్య పరికరాలు తయారు చేసే ఎస్3వీ వ్యాస్క్కులార్ టెక్నాలజీస్ అనే సంస్థ రాష్ట్రంలో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుందని మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రకటించారు. దీనిద్వారా సుమారు 750 మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన వారికి అభినందనలు తెలిపారు. ‘రాష్ట్రంలో వినియోగించే వైద్య పరికరాల్లో దాదాపు 78 శాతం ఇతర దేశాల …
Read More »తొలిసారి చెన్నై నగరపాలక సంస్థ మేయర్గా దళిత మహిళ
చెన్నై నగరపాలక సంస్థ మేయర్గా తొలిసారి ఓ దళిత మహిళ ఎంపికయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన అధికార పార్టీ డీఎంకేకి చెందిన 29 ఏండ్ల ఆర్ ప్రియ (Priya) మేయర్గా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మేయర్ అయిన తొలి దళిత మహిళగా, అతి పిన్నయస్కురాలిగా ఆమె రికార్డుల్లోకెక్కారు. మొత్తంగా చెన్నై మేయర్ అయిన మూడో మహిళగా నిలిచారు. అంతకుమందు తారా చెరియన్ , కామాక్షి జయరామన్ …
Read More »పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం చెప్పిన ప్రభాస్
సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్లో ప్రభాస్ పేరు ప్రథమంగా ఉంటుంది. నలభైరెండేళ్ల వయసున్న ఈ పాన్ఇండియా హీరో ఇంకా సింగిల్గానే జీవితాన్ని సాగిస్తున్నారు. తాజాగా ఆయన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘రాధేశ్యామ్’ చిత్ర ప్రమోషన్లో భాగంగా ప్రభాస్ గురువారం ముంబయి వెళ్లారు. ట్రైలర్ను ఆవిష్కరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించబోతున్నారు. భవిష్యత్తును ముందుగా ఊహించే …
Read More »సర్కార్ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలి
సర్కార్ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు పెరిగేలా చూడాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను మంత్రి సందర్శించారు. అనంతరం వైద్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దవాఖానకి వచ్చే రోగులకు స్థానికంగా వైద్యం అందించాలన్నారు. రెఫరల్ కేసులు తగ్గించాలని వైద్యులకు సూచించారు. పేదలకు వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. గిరిజన ప్రాంతాల్లో …
Read More »పంటి నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు
పంటి నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు మీకోసం. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? వెల్లుల్లిని దంచి అందులో కొంచెం ఉప్పు లేదా మిరియాల పొడి కలిపి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది. ” అప్పుడే కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కను నొప్పిగా ఉన్న పంటిపై ఉంచుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కితే ప్రయోజనముంటుంది. గోరు వెచ్చటి నీటిలో కాస్త …
Read More »రాడ్ మార్ష్ గుండెపోటుతో మృతి
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, వికెట్ కీపర్ రాడ్ మార్ష్ (74) గుండెపోటుతో మృతి చెందాడు. మార్ష్ 1970 నుంచి 84 వరకు 96 టెస్టులు, 92 వన్డేలు ఆడాడు. కీపర్ టెస్టుల్లో 355 మందిని ఔట్ చేశాడు. అతడి రిటైర్మెంట్ వరకు ఇదే ప్రపంచ రికార్డు. ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్ కూడా ఇతడే. కోచ్గా, కామెంటేటర్, 2014 నుంచి 2016 వరకు ఆస్ట్రేలియా …
Read More »నికోలస్ పూరన్ విధ్వంసం
వెస్టిండీస్ క్రికెటర్ నికోలస్ పూరన్ అద్భుత ఫామ్ ఉన్నాడు. ట్రినిడాడ్ టీ10 లీగ్ విరుచుకుపడుతున్నాడు. తాజాగా 14 బంతుల్లోనే 54* రన్స్ చేశాడు. అంతకుముందు 37 బంతుల్లోనే 101* పరుగులు చేసి అదుర్స్ అనిపించాడు. ఈ రెండు మ్యాచ్ కలిపి 18 సిక్సర్లు, 6 ఫోర్లు బాదడం విశేషం. పూరన్ జోరు చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. IPLలోనూ ఇలాగే రాణించాలని కోరుకుంటున్నారు.
Read More »పెళ్లి పీటలు ఎక్కనున్న తాప్సీ
బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ తో ప్రేమలో ఉన్న సొట్ట బుగ్గల సుందరి .. అందాల రాక్షసి .. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందాలతో మత్తెక్కించిన తాప్సీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు ఓకే చెప్పి, ముహూర్తాన్ని నిర్ణయించినట్లు సమాచారం. అతి త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందట. ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన తాప్సీ బాలీవుడ్లోనూ సత్తా చాటుతోంది. …
Read More »