తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్ డ్రీమ్ ఏంటో తెలుసా..?. ఏముంటది ముఖ్యమంత్రి కావడం అని మీకు మీరే ఊహించుకోకండి. అసలు మంత్రి కేటీఆర్ డ్రీమ్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల గీతానగర్ లోని జెడ్పీ హైస్కూలును సీఎస్ఆర్ కింద పీపీపీ పద్ధతిలో సకల సౌకర్యాలతో అత్యద్భుతంగా మార్చారు. కార్పొరేట్ …
Read More »కమెడియన్ కు జోడిగా సాయిపల్లవి
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సాయిపల్లవి.. ఇప్పుడు తెలుగులో విరాట పర్వం, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో నటిస్తుంది. భారీ చిత్రాల్లో నటిస్తున్న సాయిపల్లవి ఓ ఎక్స్పెరిమెంట్కు తెర తీస్తుందట. తమిళంలో చేయబోయే ఓ సినిమాలో సాయిపల్లవి కమెడియన్ సరసన నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం మేరకు తమిళంలో కమెడియన్గా పేరు తెచ్చుకున్న కాళి వెంకట్ జోడీగా సాయిపల్లవిని నటింప …
Read More »బీజేపీకి మంత్రి కేటీఆర్ వార్నింగ్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఏ మాత్రం చోటు లేదన్నారు. బీజేపీ తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించిందని విమర్శించారు. టీఆర్ఎస్ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టులో కొనసాగుతున్న ఎత్తిపోతలు
తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. లింక్-1 పరిధిలోని కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్లో 5 పంపులతో 10,500 క్యూసెక్కుల నీటిని సరస్వతి బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. సరస్వతి పంపుహౌస్లో 4 మోటర్ల ద్వారా 11,720 క్యూసెక్కుల నీటిని పార్వతి బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. పార్వతి పంపుహౌస్లో ఆరు మోటర్ల ద్వారా 12,610 క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లిలోకి ఎత్తిపోస్తున్నారు. ఇక్కడినుంచి నంది రిజర్వాయర్కు.. ఇక్కడి మూడు మోటర్లతో 9,450 క్యూసెక్కుల నీటిని …
Read More »తెలంగాణలో రేషన్ పంపిణీలో సరికొత్త విధానం
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి రేషన్ బియ్యం పంపిణీలో కొత్తవిధానం అమల్లోకి వస్తున్నది. బయోమెట్రిక్ విధానానికి బదులుగా ఓటీపీ ఆధారంగా రేషన్బియ్యం పంపిణీ చేయనున్నారు. కార్డుదారుల ఫోన్ నంబర్ ఆధార్తో అనుసంధానం తప్పనిసరికానున్నది. అయితే ఇందులో కార్డు ఎవరి పేరు మీదైతే ఉంటుందో వారి ఫోన్ నంబరు మాత్రమే ఆధార్కు అనుసంధానం ఉండాల్సిన అవసరం లేదు. కార్డులో సభ్యులుగా ఉన్నటువంటి ఎవరిదైనా సరే ఫోన్ నంబర్ ఆధార్తో అనుసంధానం ఉంటే …
Read More »దేశంలో 13,052 కరోనా పాజిటివ్ కేసులు
గడిచిన 24 గంటల్లో దేశంలో 13,052 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. తాజాగా వైరస్ నుంచి కోలుకొని 13,965 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపింది. అలాగే మరో 127 మంది మహమ్మారికి బలయ్యారని తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో 1,07,46,183కు చేరాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 1,04,23,125 మంది కోలుకున్నారని పేర్కొంది. వైరస్ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య …
Read More »డీ రాజాకు ఎమ్మెల్సీ కవిత పరామర్శ
ఇటీవల అస్వస్థతకు గురై దవాఖానలో చికిత్స పొందుతున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజాను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. నగరంలో జరుగుతున్న పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో పాల్గొన్న ఆయన నిన్న స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే పార్టీ నాయకులు ఆయన్ను కోఠీలోని కామినేని హాస్పిటల్కు తరలించారు. ఈ క్రమంలో దవాఖానలో చికిత్స పొంతుదున్న ఆయనను ఎమ్మెల్సీ కవిత ఆదివారం ఉదయం పరామర్శించారు. చికిత్స గురించి వైద్యులతో …
Read More »అరుదైన ప్రజా కళాకారుడు పైలం సంతోష్
ప్రజా కళాకారుడు పైలం సంతోష్ ను స్మరిస్తూ అంబటి వెంకన్న రాసిన పాటను సంతోష్ బిడ్డ స్నేహ హృద్యంగా ఆలపించిన గీతాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. అరుదైన గొప్ప కళాకారుడు పైలం సంతోష్ అని, తెలంగాణ ఉద్యమంలో తను పోషించిన పాత్రను ఏనాడు మరువలేమని అన్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన తొలినాళ్లలోనే గౌరవనీయ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణ సాంస్కృతిక సారథి ని …
Read More »ఆరోగ్య తెలంగాణ వైపు రాష్ట్రం వడివడిగా అడుగులు
తెలంగాణ రాష్ట్రంలో మాతా, శిశు మరణాల రేటు తగ్గుదలలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇది కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాల ద్వారానే సాధ్యమయ్యిందని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా ఏరియా దవాఖానలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లాలో 46 కేంద్రాల ద్వారా సుమారు 75 వేల మందికి పోలియో చుక్కలు వేస్తున్నామని చెప్పారు. బంగారు తెలంగాణ కావాలంటే …
Read More »సినిమా థియేటర్లకు గుడ్న్యూస్
దేశంలోని సినిమా థియేటర్ల ఓనర్లకు గుడ్న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమాలు, థియేటర్లు, మల్టీప్లెక్స్లలో 100 శాతం సీట్లను నింపుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్లోనే థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినా.. ఇప్పటి వరకూ కేవలం 50 …
Read More »