ఈ ఏడాది అగ్ర తారల మరణంతో చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. కొందరు దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూయగా, యువహీరో సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యతో బలవన్మరణానికి పాల్పడటం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సరోజ్ఖాన్, భాను అథయా వంటి ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల్ని కోల్పోవడం పూడ్చలేని లోటును మిగిల్చింది. సూపర్హీరో పాత్ర ద్వారా ప్రపంచానికి సుపరిచితుడైన చాడ్విక్ బోస్మన్ అర్థాంతర నిష్క్రమణం సినీ ప్రియులకు విషాదాన్ని మిగిల్చింది. ఇర్ఫాన్ ఖాన్ బాలీవుడ్ నటుడు …
Read More »దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటి కంటే ఇవాళ 25 శాతం పెరిగినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. కొత్తగా 20,550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 286 మంది చనిపోయారు. 26,572 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 1.02 కోట్లకు చేరుకోగా, కరోనాతో 1.48 లక్షల మంది మృతి చెందారు. కొత్త రకం కరోనా వైరస్ కేసుల సంఖ్య …
Read More »రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధన ఎత్తివేత…
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేసింది. రిజిస్ట్రేషన్ల కోసం ఎల్ఆర్ఎస్ నిబంధనను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతినిచ్చింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, నిర్మాణాలకు అడ్డంకులు తొలగాయి. రిజిస్ట్రేషన్ అయిన వాటికి రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని ప్రభుత్వం తెలిపింది. అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని కొత్త …
Read More »సోలో బ్రతుకే సో బెటర్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్లు ఎంతో తెలుసా.?
సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ తో ప్రదర్శించబడుతుంది. లాక్డౌన్ తో సినిమా షూటింగ్స్ నిలిచిపోవడం, థియేటర్లు మూతపడటంతో సినీ పరిశ్రమ అతలాకుతలమైంది. సుదీర్ఘ కాలం తర్వాత డిసెంబర్ 25న థియేటర్లలో తొలి తెలుగు సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో వసూలు చేసిన కలెక్షన్లపై ఓ …
Read More »పెళ్లి పీటలు ఎక్కనున్న కీర్తి సురేష్
మలయాళీ సోయగం కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఈ అమ్మడి పెళ్లి గురించి చెన్నై సినీ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్లోగా ఆమెకు పెళ్లి జరిపించాలనే ప్రయత్నాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారని చెబుతున్నారు. చెన్నైకి చెందిన ఓ యువ వ్యాపారవేత్తతో కీర్తి కుటుంబ సభ్యులు సంబంధం కుదుర్చుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం ఉన్న సినిమా …
Read More »ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త
తెలంగాణలోని ప్రభుత్వంలోని అన్ని రకాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొత్త సంవత్సరం సందర్భంగా బొనాంజా ప్రకటించారు. అన్ని శాఖల్లో.. అన్ని క్యాటగిరీల్లో పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగులందరికీ వేతనాలు, ఉద్యోగ విరమణ వయోపరిమితిని పెంచాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతులు ఇచ్చి.. ఖాళీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రభుత్వోద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్జ్డ్, డైలీ వేజ్, ఫుల్టైమ్ కంటింజెంట్, పార్ట్టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీ …
Read More »మంత్రి కేటీఆర్ కి వృక్ష వేదం పుస్తకాన్ని అందజేసిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో ఉన్న అడవులు పకృతి అందాల చిత్రాలతో కూడిన పుస్తకం ను వేదాలలో పకృతి మరియు వృక్షాల గురించి చెప్పిన విషయాలను తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రచురించి తీసుకు వచ్చిన “వృక్ష వేదం” పుస్తకాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు నేడు అందజేయడం జరిగింది. ఈ …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన దేతడి హారిక
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ షో 4 విజేత అభిజిత్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన దేతడి హారిక. ఈ సందర్భంగా హారిక మాట్లాడుతూ గతంలో కూడా నీను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అని ఇప్పుడు 2వ సారి పాల్గొనడం చాలా …
Read More »ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 212 కరోనా కేసులు నమోదు కాగా.. నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 8,81,273కు చేరింది. 7,098 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో 3,423 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 8,70,752 మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో …
Read More »ఇండియాలో కొత్త స్టెయిన్ కరోనా కేసుల కలవరం
ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కరోనా కొత్త వైరస్ ఇండియాను తాకింది. దేశవ్యాప్తంగా మొత్తం 6 కొత్త స్టెయిన్ కేసులు నమోదయ్యాయి. ప్రధాన నగరాలైన బెంగళూరులో 3, హైదరాబాద్ లో 2 పుణెలో ఒక కేసు చొప్పున వెలుగుచూశాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటికే వరంగల్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు CCMB నిర్ధారించిందని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »