రైతుబంధు పథకానికి కొత్త రైతుల నుంచి వ్యవసాయశాఖ దరఖాస్తులు స్వీకరిస్తున్నది. బ్యాంకుఖాతా నంబర్లు, పేర్లు, ఆధార్నంబర్లు తప్పుగా ఉన్నవారు కూడా సరైన వివరాలను అందించాలని సూచించింది. ఈ నెల 20 వరకు వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)కి వివరాలు అందించాలని సూచించింది. ఈ నెల పది వరకు ధరణిలో నమోదైన రైతుల వివరాలను సీసీఎల్ఏ నుంచి వ్యవసాయశాఖ సేకరించింది. ఈ నెల 27 నుంచి రైతుబంధు పంపిణీ చేయనున్నట్టు సీఎం …
Read More »మెట్రో ప్రయాణం అద్భుతాల సమాహారం
హైదరాబాద్ మహానగరంలో ప్రయాణమంటేనే నరకం. రోడ్డెక్కితే చాలు..ఇంటికి ఎప్పుడు చేరుతామన్న గ్యారంటీ లేదు. అడుగడుగునా ట్రాఫిక్ జామ్లు. సిగ్నళ్లు. అనుకున్న సమయానికి గమ్యస్థానానికి చేరలేం. ట్రాఫిక్లో ఇబ్బందిపడుతూ ప్రయాణిస్తూ చాలామంది అలసటకు లోనవుతున్నారు. ఒత్తిడికి గురై అనారోగ్యం బారిన పడుతున్నారు. నగరరోడ్లపై నిత్యం నరకయాతన అనుభవిస్తున్న హైదరాబాదీలు మెట్రో రాకతో జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. చింతలను దూరం చేసి..వింతలను పరిచయం చేస్తున్న మెట్రోలో మియాపూర్-ఎల్బీనగర్ వరకు ప్రయాణిస్తూ కొందరిని పలకరించగా కొత్త …
Read More »మూసీ మురిపించేలా
మురికి మూసీని సుందర మూసీగా మార్చే పనులు వాయువేగంతో సాగుతున్నాయి. కాలుష్య కోరల నుంచి మూసీని రక్షించి ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రభుత్వం సుందరీకరణ పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూసీకి సమాంతరంగా నాగోలు వంతెన మొదలుకొని కొత్తపేట సత్యానగర్ వరకు రోడ్డు ఫార్మేషన్ పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. మూసీని సుందరీకరించాలన్న సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మూసీ తీరప్రాంత అభివృద్ధి సంస్థ(ఎంఆర్డీసీ) చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి …
Read More »యువతకు చేయూత
ఒకరి కింద పని చేయకుండా.. తానే ఓ వ్యవస్థను నడుపుతూ నలుగురికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్న వారిని ఎస్సీ కార్పొరేషన్ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నది. ఇందులోభాగంగా 40 మందికి మొబైల్ టిఫిన్ సెంటర్లను మంజూరు చేసింది. బుధవారం బేగంపేటలోని హరితప్లాజాలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి ఈ టిఫిన్ సెంటర్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. పైలెట్ ప్రాజెక్ట్గా.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలవుతున్న …
Read More »జనవరి నుండి కరోనా టీకాలు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకాలు రాష్ర్టానికి జనవరిలో వచ్చే అవకాశం ఉన్నదని వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎప్పుడు వచ్చినా కొన్ని గంటల్లోనే పంపిణీని ప్రారంభించి ఒకటి రెండురోజుల్లోనే పూర్తిచేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామన్నారు. కరోనా టీకా పంపిణీ ఏర్పాట్లలో భాగంగా జిల్లా వైద్యాధికారులకు (డీఎంహెచ్వో) రెండు రోజుల శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ …
Read More »తెలంగాణలో కొలువుల జాతర
తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర ఉద్యమంలా కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం మరోసారి పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి.. వెంటనే నోటిఫికేషన్లు జారీచేయాలని ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 50 వేలకుపైగా ప్రభుత్వ కొలువుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఉపాధ్యాయులు, పోలీసులతోపాటు ఇతర శాఖల్లో ఖాళీగాఉన్న అన్ని పోస్టుల భర్తీకి …
Read More »వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇలా చేస్కోవాలి
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం నుంచి స్లాట్ బుకింగ్ మొదలుకాగా, సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరుగనున్నాయి. రిజిస్ట్రేషన్కు స్లాట్ బుకింగ్ తప్పనిసరి. దీనికి తగ్గట్టు ప్రభుత్వం ఆన్లైన్లో సులభంగా స్లాట్ బుక్ చేసుకొనేలా ఏర్పాట్లు చేసింది. బుకింగ్ కోసం ఇచ్చే వివరాల నమోదులో ఆస్తి యజమానులే కీలకపాత్ర పోషించనున్నారు. స్లాట్ బుకింగ్ వెబ్సైట్: www.registration. telangana.gov.in రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ముందుగా వెబ్సైట్లో ఫోన్ నంబర్తో లాగిన్ …
Read More »ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ అద్భుత ప్రతిభ
ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ అద్భుత ప్రతిభ చూపుతున్నదని కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ)-స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్ (ఎస్ఐజీ) అవార్డు జ్యూరీ ప్రశంసించింది. వివిధ రాష్ర్టా ల ఆడిట్ సంచాలకులు, పంచాయతీ అధికారులతో సీఎస్ఐ-ఎస్ఐజీ అవార్డు జ్యూరీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణ ఆడి ట్ సంచాలకులు మార్తినేని వెంకటేశ్వరరావు పవ ర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ …
Read More »నేడు హస్తినకు సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పలు సమస్యలపై చర్చించేందుకు ఆయన కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉన్నది. కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను శుక్రవారం, కేంద్ర పౌరవిమానయాన, హౌసింగ్శాఖల మంత్రి హర్దీప్సింగ్ పురిని శనివారం కలువనున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు మంత్రులతో భేటీకి సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్టు తెలిసింది. వీరితోపాటు మరి కొంతమంది కేంద్ర మంత్రులతోనూ సీఎం కేసీఆర్ భేటీ …
Read More »సిద్దిపేటకు సీఎం కేసీఆర్ వరాల జల్లు
సిద్దిపేట జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల అనంతరం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. మంత్రి హరీశ్రావు, స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందిస్తూ సిద్దిపేటపై సీఎం వరాల జల్లు కురిపించారు. రూ. 100 కోట్ల రంగనాయకసాగర్ అభివృద్ధి.. తెలంగాణకే ఒక అందమైన, సుందర స్పాట్గా రంగనాయక్సాగర్ …
Read More »